అన్వేషించండి

Shiv Sena Symbol: శివసేన ఎన్నికల గుర్తుపై ఈసీఐ కీలక నిర్ణయం, ఎవరూ వాడొద్దని శిందే, ఉద్దవ్‌ గ్రూప్‌లకు ఆదేశం

Shiv Sena Symbol: నవంబర్ 3న అంధేరి (తూర్పు) అసెంబ్లీ ఉపఎన్నికకు ముందు గుర్తుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏక్నాథ్ షిండే వర్గం కోరింది.

Shiv Sena Symbol: ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాల మధ్య నడుస్తున్న ఫైట్‌ కారణంగా శివసేన గుర్తును స్తంభింపజేసింది. అంధేరిలో ఈస్ట్‌ సీటుకు జరిగే ఉపఎన్నికలు జరగనున్న వేళ ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా ఠాక్రే శివసేనకు ఊహించని షాక్‌ లాంటిదే చెప్పవచ్చు. 

శివసేన 'విల్లు, బాణం' గుర్తుపై శిందే, ఠాక్రే వర్గం మధ్య కొనసాగుతున్న వివాదంలో భారత ఎన్నికల సంఘం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంధేరి తూర్పు స్థానానికి జరిగే ఉపఎన్నికలో శివసేనకు రిజర్వ్ చేసిన 'విల్లు, బాణం' చిహ్నాన్ని ఉపయోగించడానికి రెండు వర్గాలను అనుమతించబోమని కమిషన్ శనివారం (అక్టోబర్ 8) తెలిపింది.

ఈ ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫై చేసిన ఉచిత చిహ్నాల జాబితా నుంచి వేర్వేరు చిహ్నాలను ఎంచుకోవాలని రెండు వర్గాలను కోరినట్లు కమిషన్ తెలిపింది. అక్టోబర్ 10న మధ్యాహ్నం 1 గంటలకు రెండు గ్రూపులు స్పందించాల్సి ఉంటుంది.

శివసేన విల్లు, బాణం గుర్తు తమకు ఇవ్వాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం పోరాటం చేస్తోంది. దీనికి ఈ మధ్యాహ్నం 2 గంటలలోగా సమాధానం ఇవ్వాలని ఎన్నికల సంఘం ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని కోరింది. ఈ కేసులో విచారణ ప్రారంభించడానికి వీలుగా అక్టోబర్ 7 లోగా తమ వాదనలు వినిపించాలని, లిఖితపూర్వక ప్రకటన ఇవ్వాలని ఈసి గతంలో రెండు వర్గాలను కోరింది.

ఈ చిహ్నాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటానికి నవంబర్ 3 అంధేరి ఈస్ట్ సీటు ఉపఎన్నిక జరిగే లోపు ఈ గుర్తును తమకు కేటాయించాలని శిందే వర్గం కోరింది. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని శిందే వర్గం అక్టోబర్ 4న రాసిన లేఖలో ఈసిని కోరింది. ఈ ఏడాది మేలో శివసేన ఎమ్మెల్యే రమేష్ లట్కే మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. శివసేన ఎన్నికల చిహ్నం విల్లు బాణంను తనకు ఇవ్వాలని శిందే వర్గం డిమాండ్ చేసింది.

శిందే వర్గం వాదన ఏమిటి?

తమకు మెజారిటీ శివసేన సభ్యుల మద్దతు ఉందని పేర్కొంది శిందే శిబిరం. థాకరే నేతృత్వంలోని శివసేనకు మెజారిటీ మద్దతు లేదని పేర్కొంది. దీనిపై ఆ పార్టీ ఇంకా ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వలేదని ఆరోపిస్తోంది. శివసేనలో తిరుగుబాటు జరిగినప్పటి నుంచి అసలు సిసలైన శివసేన గురించి వివాదం నడుస్తోంది. ఏక్నాథ్ శిందే, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు తమను తాము నిజమైన శివసేన అని పిలుచుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో ఎన్నికల సంఘం విచారణ చాలా ముఖ్యమైంది. ఏ వర్గానికి 'విల్లు, బాణం' గుర్తు పొందాలో నిర్ణయించాల్సి వస్తోంది. అలా కేటాయించిన పార్టీయే నిజమైన శివసేనగా మారనుంది. అందుకే ఈ గుర్తు కోసం రెండు వర్గాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. 

ఎన్నికల గుర్తు వాడకంపై నిషేధం 

వచ్చే ఎన్నికల్లో థాకరే వర్గీయులు విల్లు, బాణం గుర్తు ఉపయోగించకుండా చేసేందుకు శిందే వర్గీయులు గట్టిగానే ప్రయత్నించింది. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంది. అందులో భాగంగానే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. అంధేరి ఉపఎన్నికల్లో గుర్తు వాడకాన్ని నిషేధం మాత్రం ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు పెద్ద ఎదురుదెబ్బగానే మారణందు. 

సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

శివసేన ఎవరిదన్న అంశంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గాల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. సుప్రీం కోర్టునీ ఆశ్రయించాయి ఇరు వర్గాలు. చాలా రోజుల్లో పెండింగ్‌లో ఉన్న విచారణపై ఈ మధ్య సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ అంశంలో ఉద్ధవ్‌ ఠాక్రేకు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది. ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ శిందే మధ్య ఏ వర్గాన్ని 'నిజమైన' శివసేన పార్టీగా గుర్తించాలి అనే అధికారం ఎన్నికల సంఘానికి ఉందంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఏక్‌నాథ్ శిందే గ్రూప్‌ను అసలైన శివసేనగా గుర్తించకుండా ఈసీని నిలువరించాలని ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill :భారత్ వన్డే క్రికెట్‌లో కొత్త శకం- వన్డే కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో శుభ్‌మన్‌గిల్‌- ఆస్ట్రేలియాకు వెళ్లే జట్టు ఇదే!
భారత్ వన్డే క్రికెట్‌లో కొత్త శకం- వన్డే కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో శుభ్‌మన్‌గిల్‌- ఆస్ట్రేలియాకు వెళ్లే జట్టు ఇదే!
AP Crime News: తంబళ్లపల్లెలో టీడీపీ నేతల అక్రమ మద్యం కుటీర పరిశ్రమ-పట్టుకున్న పోలీసులు - వీళ్ల ప్లాన్ చూస్తే మైండ్ బ్లాంకే !
తంబళ్లపల్లెలో టీడీపీ నేతల అక్రమ మద్యం కుటీర పరిశ్రమ-పట్టుకున్న పోలీసులు - వీళ్ల ప్లాన్ చూస్తే మైండ్ బ్లాంకే !
Telangana Tims Politics: కేసీఆర్ ప్రారంభించారనే ఆస్పత్రులు పూర్తి చేయట్లేదు - హరీష్ ఆరోపణ - గట్టి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్
కేసీఆర్ ప్రారంభించారనే ఆస్పత్రులు పూర్తి చేయట్లేదు - హరీష్ ఆరోపణ - గట్టి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్
IND vs WI: అహ్మదాబాద్‌ టెస్టులో విండీస్‌పై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత్ విజయం-  అద్భుతమైన క్యాచ్ పట్టిన నితీష్
అహ్మదాబాద్‌ టెస్టులో విండీస్‌పై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత్ విజయం- అద్భుతమైన క్యాచ్ పట్టిన నితీష్
Advertisement

వీడియోలు

India vs West Indies Test Match Record Breaking Centuries | ఆహ్మదాబాద్‌ టెస్ట్‌పై పట్టుబిగించిన భారత్
Sai Sudharsan India vs West Indies | వరుసగా విఫలమవుతున్న సాయి సుదర్శన్
KL Rahul Century India vs West Indies | కేఎల్ రాహుల్ సెంచరీల మోత
Ravindra Jadeja Record India vs West Indies | టెస్టుల్లో జ‌డేజా అరుదైన ఘ‌న‌త‌
Vijay Devarakonda Rashmika Engagement | రహస్యంగా రష్మిక విజయ్ దేవరకొండ నిశ్చితార్థం  | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shubman Gill :భారత్ వన్డే క్రికెట్‌లో కొత్త శకం- వన్డే కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో శుభ్‌మన్‌గిల్‌- ఆస్ట్రేలియాకు వెళ్లే జట్టు ఇదే!
భారత్ వన్డే క్రికెట్‌లో కొత్త శకం- వన్డే కెప్టెన్‌గా రోహిత్ స్థానంలో శుభ్‌మన్‌గిల్‌- ఆస్ట్రేలియాకు వెళ్లే జట్టు ఇదే!
AP Crime News: తంబళ్లపల్లెలో టీడీపీ నేతల అక్రమ మద్యం కుటీర పరిశ్రమ-పట్టుకున్న పోలీసులు - వీళ్ల ప్లాన్ చూస్తే మైండ్ బ్లాంకే !
తంబళ్లపల్లెలో టీడీపీ నేతల అక్రమ మద్యం కుటీర పరిశ్రమ-పట్టుకున్న పోలీసులు - వీళ్ల ప్లాన్ చూస్తే మైండ్ బ్లాంకే !
Telangana Tims Politics: కేసీఆర్ ప్రారంభించారనే ఆస్పత్రులు పూర్తి చేయట్లేదు - హరీష్ ఆరోపణ - గట్టి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్
కేసీఆర్ ప్రారంభించారనే ఆస్పత్రులు పూర్తి చేయట్లేదు - హరీష్ ఆరోపణ - గట్టి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్
IND vs WI: అహ్మదాబాద్‌ టెస్టులో విండీస్‌పై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత్ విజయం-  అద్భుతమైన క్యాచ్ పట్టిన నితీష్
అహ్మదాబాద్‌ టెస్టులో విండీస్‌పై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో భారత్ విజయం- అద్భుతమైన క్యాచ్ పట్టిన నితీష్
Ravi Teja: మాస్ మహారాజా కొత్త సినిమాకు క్లాస్ టైటిల్... భర్తలూ, ఇది మీ కోసమే!
మాస్ మహారాజా కొత్త సినిమాకు క్లాస్ టైటిల్... భర్తలూ, ఇది మీ కోసమే!
Hydra Demolitions : హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో రూ.3,600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన 'హైడ్రా'– హైకోర్టు తీర్పు అమలుతో కబ్జాదారులకు షాక్
హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో రూ.3,600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన 'హైడ్రా'– హైకోర్టు తీర్పు అమలుతో కబ్జాదారులకు షాక్
Singapore Crime: సింగపూర్‌లో కాల్ గర్ల్స్ బుక్ చేసుకుని వాళ్లను దోపిడీ చేసిన ఇద్దరు భారతీయు టూరిస్టులు - ఐదేళ్ల జైలు, 12 బెత్తం దెబ్బల శిక్ష  !
సింగపూర్‌లో కాల్ గర్ల్స్ బుక్ చేసుకుని వాళ్లను దోపిడీ చేసిన ఇద్దరు భారతీయు టూరిస్టులు - ఐదేళ్ల జైలు, 12 బెత్తం దెబ్బల శిక్ష !
The Girlfriend Release Date: ఎంగేజ్మెంట్, పెళ్లిపై రష్మిక సైలెన్స్... కానీ కొత్త సినిమా రిలీజ్ డేట్ చెప్పింది
ఎంగేజ్మెంట్, పెళ్లిపై రష్మిక సైలెన్స్... కానీ కొత్త సినిమా రిలీజ్ డేట్ చెప్పింది
Embed widget