అన్వేషించండి

Biparjoy Cyclone: గుజరాత్ తీరాన్ని తాకిన బిపార్జోయ్ తుపాను, ఈ అర్ధరాత్రి వరకూ తీవ్ర పరిస్థితులు - ఐఎండీ

ప్రస్తుతం గంటకు 100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయానికి 120 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

గుజరాత్ తీరంలో బిపార్జోయ్ తుపాను బీభత్సం మొదలైంది. తుపాను గుజరాత్ కచ్ తీర ప్రాంతంలోని కోట్ లఖ్‌పత్ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావం వల్ల తదుపరి 5 గంటల పాటు అంటే అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. తుపాను ప్రభావం గుజరాత్ తీర ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభించింది. కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. గుజరాత్‌ తీరం వెంబడి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. కచ్‌లోని మాండ్వి ప్రాంతంలో రోడ్లపై హోర్డింగ్‌లు, చిన్న నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. నలియా జఖౌ హైవేపై పెద్ద పెద్ద చెట్లు కూలిపోవడంతో హైవే మూసుకుపోయింది. భారత వాతావరణ శాఖ ప్రకారం..  ఈ సమయంలో తుఫాను వేగం గంటకు 15 కి.మీ.

ప్రస్తుతం గంటకు 100 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయానికి 120 నుంచి 130 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీరం దాటే ప్రాంతంలో ఉన్న దాదాపు 20 గ్రామాలకు చెందిన ప్రజలను ఇప్పటికే తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు.

ఆ ప్రాంతంలో విద్యుత్ కోత

కచ్‌లోని మాండ్విలో, జిల్లా అధికారులు 300 కంటే ఎక్కువ బృందాలు ఏర్పాటు చేశాయి. ఇవి ఆ ప్రాంతంలో విద్యుత్‌ను పునరుద్ధరించడానికి పని చేస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. తుపాను తీరం దాటిపోయి పరిస్థితి సాధారణ స్థితికి వస్తే, ఎంత నష్టం జరిగిందో అంచనా వేయవచ్చు.

అర్ధరాత్రి 11.30 సమయంలో బిపోర్జాయ్‌ తుపాను పూర్తిగా తీరం దాటే  అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత అది తీవ్ర తుపానుగా, ఆ తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుంది. దీని ప్రభావంతో కచ్‌-సౌరాష్ట్ర ప్రాంతాలు, పోర్‌బందర్‌, ద్వారక, జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌, జునాగఢ్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ద్వారక, పోర్‌బందర్‌, జామ్‌నగర్‌, మోర్బీ తీర ప్రాంతాల్లో అలలు 3 నుంచి 6 మీటర్ల  మేర ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చినట్లు ఐఎండీ వెల్లడించింది.

ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు - హర్ష్ సంఘ్వీ

గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. బిపార్జోయ్ రాత్రిపూట తీరాన్ని తాకడం వల్ల భద్రతా ఏజెన్సీలకు సవాలును పెంచింది. ఈదురు గాలులతో కచ్‌లో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. మాండ్విలోని మారిటైమ్ బోర్డు కార్యాలయం ధ్వంసమైంది. కచ్‌లో పలు చెట్లు నేలకూలాయి. రెండు ట్రాన్స్‌ఫార్మర్లు సహా 60 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ శుక్రవారం కూడా మూసివేయబడుతుంది. సబర్మతి రివర్ ఫ్రంట్‌లోని అటల్ వంతెన కూడా మూసివేయబడుతుంది.

మొత్తం 18 ఎన్డీఆర్‌ఎఫ్‌, 12 ఎస్‌డీఆర్‌ఎఫ్ టీమ్ లతోపాటు రోడ్లు, భవనాల శాఖకు చెందిన 115 బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ దళాలను కూడా రంగంలోకి దింపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget