అన్వేషించండి

Operation Sindoor: పాక్ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు ఆపరేషన్ సిందూర్, ఇది బాధ్యతాయుతమై దాడిగా పేర్కొన్న భారత్

India Strikes in Pakistan భారత బలగాలు మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి నాశనం చేశాయి. దీనికి ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టారు.

న్యూఢిల్లీ: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి హేయమైనదని.. ఆ దాడిలో 25 మంది భారతీయులు, ఓ నేపాల్ టూరిస్ట్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. ముంబై దాడులు, పుల్వామా ఉగ్రదాడి తరువాత ఇది అత్యంత పెద్ద ఉగ్రదాడి అని విదేశాంగ కార్యదర్శి అన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత భూభాగంలోకి వచ్చి మరి దాడులు చేసి 350 మందికి పైగా అమాయకుల ప్రాణాలు తీసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టి అపరేషన్ సిందూర్ వివరాలను ఆర్మీ అధికారులు, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు వెల్లడించారు.

విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌లో అశాంతి, అల్లర్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి చేసింది. కశ్మీర్‌లో అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు ప్రజలను భయాందోళనకు గురిచేయాలని ఉగ్రవాదులు కుట్రపన్నారు. పాకిస్తాన్ తమ నియంత్రణ రేఖను దాటి కాశ్మీర్ లో దాడులు జరుపుతోంది. పాకిస్తాన్ ప్రేరేపేత ఉగ్రవాదులకు భారత బలగాలు తమ సత్తా చాటాయి. పాకిస్తాన్ అంతర్జాతీయ సంస్థలను, పలు దేశాలను తప్పుదోవ పట్టించాలని చూస్తోంది. పాక్ ఉగ్రవాడులు సరిహద్దు దాటి వచ్చి దాడులు చేస్తున్నారు. దాంతో భారత్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని, పహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు చర్చలు చేపట్టింది. 

 

ఆ కుటుంబాల కన్నీళ్లు ఎందరినో కదిలించాయి

పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఎంతో ఆవేదన అనుభవించాయి. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు అతి తగ్గర నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడి చేసింది తామేనని ద రెసిస్టెంట్ ఫ్రంట్ క్లెయిమ్ చేసింది. డిసెంబర్ 2023లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థలు భారత్‌లో దాడులకు ప్లాన్ చేస్తున్నాయని పలుమార్లు అంతర్జాతీయంగా గళం విప్పాం. భారత్ పై మరిన్ని దాడులకు పాక్ ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ వారిని, బాధ్యతులపై కఠిన చర్యలు తప్పవు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గదామం. అందుకే పాక్ భూభాగం నుంచి జైషే మహ్మద్, లష్కరే టెర్రరిస్టులు భారత్ మీద ఉగ్రదాడులకు నిరంతరం ప్లాన్ చేస్తున్నారని’ విక్రమ్ మిస్త్రీ అన్నారు.

టీఆర్ఎఫ్ ను నిషేధిత ఉగ్రసంస్థల జాబితా నుంచి తొలగించాలని పాకిస్తాన్ పలుమార్లు కోరింది. ఈ క్రమంలో అదే సంస్థ భారత్ మీద ఉగ్రదాడి చేసే స్థాయికి దాని కార్యకలాపాలు విస్తరించడం నిజం కాదా. భారత్ ప్రతీకార చర్యలు చేపట్టి పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించినట్లు తెలిపారు.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత బలగాలు పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాదుల 9 కీలక స్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేశాయి. ఏప్రిల్ 22న జరగిన పహాల్గంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఉగ్రవాదుల స్థావరాలపై ఆకస్మిక దాడులు చేసింది. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో ఏకంగా 176 మంది ప్రాణాలు కోల్పోగా, 600 మంది పైగా గాయపడ్డారు. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందారు. ఇందులో ఓ నేపాల్ టూరిస్ట్ ఉన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget