అన్వేషించండి

Operation Sindoor: పాక్ ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు ఆపరేషన్ సిందూర్, ఇది బాధ్యతాయుతమై దాడిగా పేర్కొన్న భారత్

India Strikes in Pakistan భారత బలగాలు మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి నాశనం చేశాయి. దీనికి ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టారు.

న్యూఢిల్లీ: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి హేయమైనదని.. ఆ దాడిలో 25 మంది భారతీయులు, ఓ నేపాల్ టూరిస్ట్ ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. ముంబై దాడులు, పుల్వామా ఉగ్రదాడి తరువాత ఇది అత్యంత పెద్ద ఉగ్రదాడి అని విదేశాంగ కార్యదర్శి అన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత భూభాగంలోకి వచ్చి మరి దాడులు చేసి 350 మందికి పైగా అమాయకుల ప్రాణాలు తీసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టి అపరేషన్ సిందూర్ వివరాలను ఆర్మీ అధికారులు, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు వెల్లడించారు.

విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌లో అశాంతి, అల్లర్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి చేసింది. కశ్మీర్‌లో అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు ప్రజలను భయాందోళనకు గురిచేయాలని ఉగ్రవాదులు కుట్రపన్నారు. పాకిస్తాన్ తమ నియంత్రణ రేఖను దాటి కాశ్మీర్ లో దాడులు జరుపుతోంది. పాకిస్తాన్ ప్రేరేపేత ఉగ్రవాదులకు భారత బలగాలు తమ సత్తా చాటాయి. పాకిస్తాన్ అంతర్జాతీయ సంస్థలను, పలు దేశాలను తప్పుదోవ పట్టించాలని చూస్తోంది. పాక్ ఉగ్రవాడులు సరిహద్దు దాటి వచ్చి దాడులు చేస్తున్నారు. దాంతో భారత్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని, పహల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు చర్చలు చేపట్టింది. 

 

ఆ కుటుంబాల కన్నీళ్లు ఎందరినో కదిలించాయి

పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు ఎంతో ఆవేదన అనుభవించాయి. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు అతి తగ్గర నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడి చేసింది తామేనని ద రెసిస్టెంట్ ఫ్రంట్ క్లెయిమ్ చేసింది. డిసెంబర్ 2023లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రసంస్థలు భారత్‌లో దాడులకు ప్లాన్ చేస్తున్నాయని పలుమార్లు అంతర్జాతీయంగా గళం విప్పాం. భారత్ పై మరిన్ని దాడులకు పాక్ ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ వారిని, బాధ్యతులపై కఠిన చర్యలు తప్పవు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గదామం. అందుకే పాక్ భూభాగం నుంచి జైషే మహ్మద్, లష్కరే టెర్రరిస్టులు భారత్ మీద ఉగ్రదాడులకు నిరంతరం ప్లాన్ చేస్తున్నారని’ విక్రమ్ మిస్త్రీ అన్నారు.

టీఆర్ఎఫ్ ను నిషేధిత ఉగ్రసంస్థల జాబితా నుంచి తొలగించాలని పాకిస్తాన్ పలుమార్లు కోరింది. ఈ క్రమంలో అదే సంస్థ భారత్ మీద ఉగ్రదాడి చేసే స్థాయికి దాని కార్యకలాపాలు విస్తరించడం నిజం కాదా. భారత్ ప్రతీకార చర్యలు చేపట్టి పాకిస్తాన్, పీఓకేలోని 9 ఉగ్రస్థావరాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించినట్లు తెలిపారు.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత బలగాలు పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాదుల 9 కీలక స్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేశాయి. ఏప్రిల్ 22న జరగిన పహాల్గంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఉగ్రవాదుల స్థావరాలపై ఆకస్మిక దాడులు చేసింది. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో ఏకంగా 176 మంది ప్రాణాలు కోల్పోగా, 600 మంది పైగా గాయపడ్డారు. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 2025 ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందారు. ఇందులో ఓ నేపాల్ టూరిస్ట్ ఉన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget