అన్వేషించండి

IRCTC Aadhaar Linking : IRCTCలో ఆధార్​ను ఇలా లింక్ చేయండి, పూర్తి ప్రాసెస్ ఇదే.. తత్కాల్ టికెట్ కావాలంటే ఇది చేయాల్సిందే

Aadhaar for Tatkal Tickets : తత్కాల్ టికెట్స్ కోసం భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ.. ఆధార్, ఓటీపీ నిబంధనను తెరపైకి తెచ్చింది. అయితే IRCTCలో ఆధార్​ని ఎలా లింక్ చేయాలో తెలుసా? పూర్తి సమాచారం ఇక్కడుంది.

Steps to Link Aadhaar on IRCTC :  భారతీయ రైల్వే శాఖలో తత్కాల్ టికెట్స్ అనేవి హాట్​ కేకుల్లాంటివి. ఇలా బుకింగ్ ఓపెన్ అవ్వగానే అలా టికెట్స్ అమ్ముడుపోతాయి. దీనిలో అక్రమ బుకింగ్​లు ఎక్కువగా ఉన్నాయని గుర్తించి.. సామాన్య ప్రయాణికులకు టికెట్లు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో IRCTC ఓ కొత్త నిబంధనను తెరపైకి తెచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆ నిబంధనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు.. IRCTCలో ఆధార్​ను ఏ విధంగా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

నిబంధన ఇదే.. 

తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే IRCTCలో కచ్చితంగా ఆధార్​ ఓటీపీతో కూడిన ధృవీకరణ చేయాలని నిబంధనలు ఇచ్చింది. దీని ద్వారా భారతీయ రైల్వేల్లో బల్క్ టికెట్లు, అక్రమబుకింగ్​లు తగ్గుతాయని భావిస్తుంది. ఈ నిబంధనతో సామాన్యులకు కూడా తత్కాల్ టికెట్లు దొరుకుతాయని చెప్తున్నారు. ఈ ప్రాసెస్ జూలై 1, 2025వ తారీఖు నుంచి అమలు కానుంది. 

అర్హులు కారు.. 

మీ IRCTC అకౌంట్ ఆధార్​తో లింక్ కాకుంటే మీరు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడానికి అర్హులు కారు. కాబట్టి మీరు తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా వైరిఫైడ్ యూజర్ అవ్వాల్సిందే. IRCTC వెబ్​సైట్​లో లేదా IRCTC యాప్​లో మీరు కచ్చితంగా యూజర్​ అవ్వాలి. మీ మొబైల్ నంబర్​ కూడా ఆధార్​కి లింకై ఉండాలి. అప్పుడే మీరు ఆధార్​ ఓటీపీని టైమ్​కి పొందగలుగుతారు. 

IRCTCని ఆధార్​తో ఎలా లింక్ చేయాలంటే.. 

ఆధార్​ని IRCTCలో లింక్ చేయాలంటే irctc.in వెబ్​సైట్​లోకి వెళ్లాలి. లేదా IRCTC వెబ్​సైట్ అని కొడితే డైరక్ట్​ వెబ్​సైట్ ఓపెన్ అవుతుంది. మీరు యూజర్ డిటైల్స్​తో లాగిన్ అవ్వాలి. అనంతరం My Accountని సెలక్ట్ చేయాలి. అక్కడ Link Aadhaarని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్, పూర్తి పేరు, పుట్టిన తేది వంటి వివరాలు అన్నీ ఇచ్చి.. OTP కోసం Submit చేయాలి. ఆధార్​తో లింక్ అయిన మొబైల్ నెంబర్​కి OTP వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే ఆధార్​ IRCTCతో లింక్​ అయిపోయినట్టే. 

పాన్ కార్డ్​తో కూడా

మీరు పొరపాటు పేరు, పుట్టిన తేది వంటివి తప్పుగా ఇచ్చినా ఎడిట్ ఆప్షన్​తో సెట్ చేసుకోవచ్చు. అయితే ఆధార్​లో ఉన్న డిటైల్స్ మాత్రమే ఇవ్వాలని గుర్తించుకోవాలి. పాన్ కార్డ్​తో కూడా దీనిని చేయవచ్చు. ఆధార్​ లింక్​ కోసం ఓపెన్ చేసిన పేజ్​లోనే పైన పాన్​ కార్డ్ లింక్​ కూడా ఉంటుంది. ఇదే ప్రాసెస్​లో అన్ని డిటైల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 

అతి పెద్ద మార్పు ఇదే

మరో అతిపెద్ద మార్పు ఏంటంటే.. ఏజెంట్లు తత్కాల్ టికెట్లు బుక్ చేయాలనుకుంటే బుకింగ్ విండో ఓపెన్ అయిన తర్వాత మొదటి 30 నిమిషాల్లో వారికి అనుమతి లభించదు. ఏసీ కోచ్​లను ఏజెంట్లు 10 నుంచి 10.30 వరకు బుక్ చేయలేరు. నాన్ ఏసీ కోచ్​లు 11 నుంచి 11.30 వరకు ఏజెంట్లు బుక్ చేసే వీలు ఉండదు. కాబట్టి రెగ్యులర్ పాసింజర్లు టికెట్లు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Embed widget