E-Passport : ఈ-పాస్పోర్ట్కి ఎలా అప్లై చేయాలో తెలుసా? ప్రాసెస్, ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే
E-Passport India : భారత ప్రభుత్వం ఈ-పాస్పోర్ట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. మరి దీనికి ఎలా అప్లై చేయాలి? లాభాలు ఏంటి వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

E-Passport Guide : విదేశాలకు వెళ్లేవారు పాస్పోర్ట్ని ఎక్కువగా వాడుతారు. అయితే ఇండియాలో ఇన్నిరోజులు పాస్పోర్ట్ను డిజిటల్ చేయలేదు. పొరుగుదేశాలు ఇప్పటికే ఈ-పాస్పోర్టులను వినియోగిస్తుండగా.. ఇప్పుడు ఇండియాలో కూడా దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ-పాస్పోర్ట్ వినియోగంలోకి వస్తే.. ఎయిర్పోర్ట్లో ఎంట్రీ ఫాస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా పర్సనల్ డేటా కూడా బయటకు రాదు. బెటర్ సెక్యూరిటీ కోసం దీనిని అందుబాటులోకి తెచ్చారు.
ఈ-పాస్పోర్ట్
ఈ-పాస్పోర్ట్ చిన్న గోల్డ్ చిప్తో వస్తుంది. దీనిలో బయోమెట్రిక్ పద్ధతిలో సమాచారం స్టోర్ చేస్తారు. ఫింగర్ ప్రింట్స్, ఫేస్ స్కాన్, మొదలైన అంశాలన్నీ ఈ చిప్లో స్టోర్ అయి ఉంటాయి. ఈ పాస్పోర్ట్ ఫ్యూచర్లో స్మార్ట్ ఐడీ కానుంది.
పాత పాస్పోర్ట్ వాడుతుంటే..
మీరు ఇప్పటికే పాస్పోర్ట్ వాడేవారు అయితే వెంటనే దీనిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీకుండే వీలును బట్టి దీనిని మార్చుకోవచ్చు. పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయిపోతున్నప్పుడు మీరు ఈ-పాస్పోర్ట్ సేవలు వినియోగించుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో మీరు ఈ-పాస్పోర్ట్ కోసం అప్లై చేయవచ్చు.
ఈ-పాస్పోర్ట్ అప్లై చేయాల్సిన విధానం
ముందుగా passportindia.gov.in సైట్లోకి వెళ్లి రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు Login క్లిక్ చేయాలి. అక్కడ Apply for Fresh/Reissue అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిలో మీరు Fresh లేదా Reissue ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు కొత్తగా పాస్పోర్ట్కి అప్లై చేసేవారు అయితే Fresh అని.. పాస్పోర్ట్ ఉండి.. E-Passport కోసం అప్లై చేసేవారు అయితే Reissue అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
ఈ ఆప్షన్ తర్వాత Pay Fee and Book Your Slot అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫీజు పే చేసి.. మీ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. కన్ఫార్మేషన్ మెసేజ్ లేదా Receiptని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత Passport Seva Kendraకు మీ ఒరిజనల్ డాక్యుమెంట్స్తో వెళ్లి.. ఫార్మాలిటీలు పూర్తి చేసుకోవాలి. అంతే ఈ ప్రాసెస్ పూర్తి చేస్తే కొన్నిరోజుల్లో వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత పాస్పోర్ట్ డెలీవరి చేస్తారు.
ఏ ప్రాంతాల్లో దీనిని అప్లై చేసుకోవచ్చంటే..
ప్రస్తుతం ఇండియాలో ఈ-పాస్పోర్ట్ సేవలు కొన్ని సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, నాగపూర్, భుభనేశ్వర్, జమ్మూ, రాంచీ, గోవా, జైపూర్, సూరత్, ఢిల్లీ, సిమ్లాలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో భారతదేశం అంతటా ఈ సేవలను అమలు చేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా చేసుకుంది.
Also Read : భారతీయులు వీసా లేకుండా ఈ దేశానికి వెళ్లొచ్చట.. అనౌన్స్ చేసిన ఫిలిప్పీన్స్, పూర్తి వివరాలు, అర్హతలివే






















