అన్వేషించండి

భారత్ త్వరలోనే 10 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది - WEF ప్రెసిడెంట్

World Economic Forum: భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని WEF ప్రెసిడెంట్ అంచనా వేశారు.

World Economic Forum Predictions: ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే భారత్‌ ఆర్థిక వ్యవస్థ చాలా సానుకూలంగా ఉందని మోదీ సర్కార్‌ చాలా ధీమాగా చెబుతోంది. కరోనా లాంటి సంక్షోభాన్నీ తట్టుకుని మనం నిలదొక్కుకున్నామని అంటోంది. ప్రతిపక్షాలు ఇదంతా ఒట్టి మాటలే అని కొట్టి పారేస్తున్నప్పటికీ...ఇప్పుడు స్వయంగా World Economic Forum ప్రెసిడెంట్ Borge Brende భారత ఆర్థిక వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027 నాటికి భారత్ అతి పెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. అంతే కాదు. త్వరలోనే భారత్ 10 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని స్పష్టం చేశారు. PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉన్నా...భారత్ మాత్రం స్థిరంగా ముందుకు వెళ్తోందని ప్రశంసలు కురిపించారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సులో భారత్‌పై అన్ని దేశాలూ ఆసక్తి చూపించాయని, ఆర్థికంగా ఎదిగేందుకు భారత్ అన్ని విధాలుగా కృషి చేస్తోందని తెలిపారు. ఇదే ఉత్సాహం భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు బోర్గె బ్రెండే. 

"నేను ఎప్పుడు భారత్‌కి వచ్చినా ఏదో తెలియని ఓ విశ్వాసం కలుగుతుంది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ఆ అనుభూతి కలగదు. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అయినా భారత్ మాత్రం సానుకూలంగా అడుగులు వేస్తోంది. మిగతా దేశాలపైనా దృష్టి సారించాల్సిన అవసరముంది. 2027 నాటికి భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్న విశ్వాసముంది"

- బోర్గె బ్రెండ్, WEF అధ్యక్షుడు 

అమెరికా కూడా ఇప్పుడిప్పుడే ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకుంటోందని వివరించారు WEF ప్రెసిడెంట్. 7%తో జీడీపీతో సానుకూలంగా ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. వచ్చే రెండు మూడేళ్లలో భారత్‌ ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానానికి చేరుకుంటుందని అన్నారు. కొన్నేళ్లుగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు జరిగాయని, అమెరికా చైనాతో పోల్చితే భారత్‌ మెరుగ్గా ఉందని వెల్లడించారు. భారత్‌లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. 

ఎర్ర సముద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభంతో లక్షల కోట్ల డాలర్ల నష్టం జరిగే ప్రమాదముందన్న అంచనాలున్నాయి. చమురు మోసుకొస్తున్న ఓడలపై హౌతీలు దాడులు చేస్తున్నారు. ఫలితంగా...అవి నడి సముద్రంలో చిక్కుకుపోయాయి. ఈ దాడుల కారణంగా చమురు సరఫరాకి అంతరాయం కలుగుతోంది. ఈ పరిణామాలపై.. World Economic Forum అధ్యక్షుడు బార్జ్ బ్రెండే కీలక వ్యాఖ్యలు చేశారు. డిమాండ్‌కి తగ్గట్టుగా సప్లై లేకపోవడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు 10-20% మేర పెరిగే ప్రమాదముందని బాంబు పేల్చారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. Suez Canal ని మూసేయడం వల్ల అంతర్జాతీయంగా చమురుతో పాటు నిత్యావసర సరుకుల సరఫరాకి అంతరాయం కలుగుతుందని...వాటి ధరలు అమాంతం పెరిగొచ్చని అంచనా వేశారు. దావోస్‌లో జరిగిన WEF సమావేశానికి హాజరైన బ్రెండే...ఈ విషయం ప్రస్తావించారు. ఇప్పటికే ఈ ప్రభావం మొదలైందని వెల్లడించారు. 

Also Read: సత్యపాల్ మాలిక్ ఇళ్లలో సీబీఐ సోదాలు, ఆ ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి?

టాప్ హెడ్ లైన్స్

EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
EPFO 15000 పరిమితిని పెంచుతున్న కేంద్రం.. PF, పెన్షన్‌లో మరింత పొదుపు చేయవచ్చు
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Karnataka Congress MLAs Resign: కర్ణాటక కాంగ్రెస్‌లో తిరుగుబాటు జ్వాల - క్యాబినెట్‌లో చోటు దక్కక ఎమ్మెల్యేల రాజీనామాలు!
కర్ణాటక కాంగ్రెస్‌లో తిరుగుబాటు జ్వాల - క్యాబినెట్‌లో చోటు దక్కక ఎమ్మెల్యేల రాజీనామాలు!
Breaking News:మహిళల రక్షణలో చారిత్రాత్మక తీర్పు.. లైవ్-ఇన్ వేధింపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
మహిళల రక్షణలో చారిత్రాత్మక తీర్పు.. లైవ్-ఇన్ వేధింపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Embed widget