అన్వేషించండి

Omicron Variant: దేశంలో మూడో ఒమిక్రాన్ కేసు... జింబాబ్వే నుంచి గుజరాత్ వచ్చిన వ్యక్తిలో కొత్త వేరియంట్ లక్షణాలు

భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ మూడో కేసు నమోదయ్యింది. ఇటీవల జింబాబ్వే నుంచి గుజరాత్ వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యాధికారులు గుర్తించారు.

భారత్ ను కలవరపెడుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. తాజాగా గుజరాత్ లో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు వైద్యాధికారులు ప్రకటించారు. గుజరాత్‌ జామ్‌నగర్‌లో ఓ వ్యక్తిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. ఇటీవల జింబాబ్వే నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ గుర్తించినట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ప్రైమరీ కాంటాక్స్ వివరాలు సేకరిస్తున్నారు. ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చిన కొందరి ఆచూకీ అధికారులకు చిక్కకపోవడం సమస్యగా మారింది. వారు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:  ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 72 ఏళ్ల వ్యక్తికి కోవిడ్-19 ఓమిక్రాన్ వేరియంట్‌ సోకింది.  ఆఫ్రికాలోని జింబాబ్వే దేశం నుంచి వచ్చిన వ్యక్తిలో ఓమిక్రాన్ లక్షణాలు గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. జింబాబ్వే 'ఎట్ రిస్క్' దేశాలలో ఒకటిగా భారత్ గుర్తించింది. జామ్‌నగర్ మునిసిపల్ కమిషనర్ విజయ్‌కుమార్ ఖరాడి తెలిపిన వివరాల ప్రకారం... ఒమిక్రాన్ నిర్థారించేందుకు జీనోమ్ సీక్వెన్స్ కోసం ఇతని నమూనాలు అహ్మదాబాద్‌కు పంపించామన్నారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం అతడికి కోవిడ్-19 ఓమిక్రాన్ వేరియంట్‌ సోకిందని ఆయన తెలిపారు.

Also Read:  కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదా.. బహిరంగ ప్రదేశాల్లోకి నో ఎంట్రీ ... తమిళనాడు నగరంలో ఆంక్షలు

" గుజరాత్ జామ్‌నగర్‌కు చెందిన వ్యక్తి గత కొంత కాలంగా జింబాబ్వేలో నివసిస్తున్నారు. ఆయన నవంబర్ 28న తన మామగారిని కలవడానికి భారత్ కు వచ్చారు. అతనికి జ్వరం రావడంతో వైద్యులు అతనికి RT-PCR పరీక్ష చేయించుకోవాలని సలహా ఇచ్చారు. కోవిడ్ పరీక్షలో అతని పాజిటివ్ వచ్చింది.” అని గుజరాత్ వైద్యాధికారులు ఇచ్చిన నివేదికలో తెలుస్తోందని PTI పేర్కొంది.  

భారత్ ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ మూడో కేసు ఇది. మిగిలిన రెండు కేసులు బెంగళూరుకు చెందిన 46 ఏళ్ల వైద్యుడికి సోకింది. అతడు ఇటీవల ఎక్కడికీ ప్రయాణించలేదు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది. 

Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి                                      

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20 Result: అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP DesamJudicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP DesamDirector Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP DesamSircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20 Result: అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
అభిషేక్ ఆల్ రౌండ్ షో - 150 పరుగులతో టీమిండియా ఘన విజయం, 5వ టీ20లోనూ ఇంగ్లాండ్ చిత్తు
Chittor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ, బస్సు ఢీకొని నలుగురు మృతి, 14 మందికి గాయాలు
Crime News: కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
Hyderabad News: చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
Delhi News: వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
Embed widget