అన్వేషించండి

Ceasefire extended : కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించుకున్నాం - పాకిస్తాన్ ఉప ప్రధాని ప్రకటన

India Pakistan: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మే 18వ తేదీ వరకూ పొడిగించుకున్నామని పాకిస్తాన్ ఉపప్రధాని ఇషాక్ దార్ ప్రకటించారు.

India Pakistan ceasefire extended :భారతదేశం ,   పాకిస్తాన్  కాల్పుల విరమణను పొడిగించడానికి అంగీకరించాయని  పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ ప్రకటించారు.  రెండు దేశాల సైనిక జనరల్స్   మధ్య జరిగిన ఫోన్ చర్చల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణను పొడిగించడానికి అంగీకరించిందని దార్  ప్రకటిచారు.  ఆదివారం వరకు కాల్పుల విరమణ అమలులో ఉంటుంది. పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి కూడా అయిన ఇషాక్ దార్ సెనేట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. మే 14న రెండు వైపులా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) మధ్య హాట్‌లైన్ సంప్రదింపుల సందర్భంగా ఈ  నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 

డీజీఎంవోల చర్చల్లో కాల్పుల విరమణ పొడిగింపు నిర్ణయం                  

“DGMOల సంభాషణ సందర్భంగా, కాల్పుల విరమణను మే 12 వరకు పొడిగించారు. మే 12న DGMOలు మళ్ళీ మాట్లాడినప్పుడు, కాల్పుల విరమణను మే 14 వరకు పొడిగించారు. మే 14న జరిగిన తదుపరి చర్చలు, కాల్పుల విరమణను మే 18 వరకు పొడిగించడానికి  అంగీకరించారు అని  ” అని ఇషాక్ దార్ గురువారం ఎగువ సభకు తెలిపారు. 

బలగాలను తగ్గించాలని నిర్ణయం        

ఆపరేషన్ సిందూర్ తర్వాత అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలు  యుద్ధానికి సిద్ధమవ్వడంతో   భారత్‌, పాక్‌ శాంతించాలని  చర్చలు జరుపుకోవాలని  పలు దేశాలు సూచించాయి.   ఇరు దేశాలు కాల్పుల విమరణకు అంగీకరించాయి.   డీజీఎంవోల మధ్య చర్చల్లో  ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరపకూడదని, కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు. శత్రుత్వ చర్యలు తీసుకోకూడదనే విషయాలకు కట్టుబడి ఉండాలనే దానిపై చర్చించారు. అదేవిధంగా సరిహద్దులు, ఫార్వర్డ్‌ బేస్‌ ప్రాంతాల్లో బలగాల తగ్గింపును పరిగణించాలని నిర్ణయించారు.     

హఠాత్తుగా కాల్పుల విరమణ ప్రకటించిన  ఇరు దేశాలు                     

భారత సైన్యం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది. పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత మే 8, 9, 10 తేదీల్లో పాకిస్థాన్‌.. భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని డ్రోన్‌లు, క్షిపణి దాడులకు విఫలయత్నం చేయగా.. పాక్ కుట్రలను భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో తలెత్తిన ఉద్రిక్తతల మధ్య ఇరుదేశాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. ఇది తీవ్ర స్థాయి యుద్ధానికి దారి తీస్తుందని అనుకున్నారు కానీ.. కాల్పుల విరమణతో ఆగిపోయింది.               

 

టాప్ హెడ్ లైన్స్

TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Mark Zuckerberg Apology: మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
మోదీ ప్రభుత్వానికి సారీ చెప్పిన జుకర్ బర్గ్.. కేంద్రంతో వివాదం ముగిసిపోయిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Embed widget