By: ABP Desam | Updated at : 16 Oct 2021 11:06 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
కరోనా కేసులు(ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గడంలేదు. కొవిడ్ సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ఇటీవల మళ్లీ కేసులు పెరిగాయి. ఇటీవల కరోనా కేసుల సంఖ్య 20 వేలకు దిగువగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,981 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా తాజాగా 166 మంది మరణించారు. కిందటి రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రెండూ తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. నిన్నటి కేసుల్లో సగానికి పైగా కేరళలో నమోదయ్యాయి. కేరళలో 8867 కరోనా కేసులు, 67 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకూ 97,23,77,045 వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు తెలిపింది.
India reports 15,981 new #COVID cases, 17,861 recoveries and 166 deaths in last 24 hours, as per Union Health Ministry.
Total cases: 3,40,53,573
Active cases: 2,01,632
Total recoveries: 3,33,99,961
Death toll: 4,51,980
Total Vaccination: 97,23,77,045 (8,36,118 in last 24 hrs) pic.twitter.com/IKgh6rZ8S2— ANI (@ANI) October 16, 2021
Also Read: బంగ్లాదేశ్లో దసరా వేడుకలు రక్తసిక్తం.. ఇస్కాన్ టెంపుల్పై దాడి.. భక్తులకు గాయాలు
పెరిగిన రికవరీ రేటు
కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,40,53,573గా ఉన్నాయి. దీంతోపాటు మరణాల సంఖ్య 4,51,980కు చేరింది. తాజాగా కరోనా నుంచి 17,861 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,33,99,961కు చేరిందని కేంద్రం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 2,01,632 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు 98 శాతానికి పైగా పెరిగింది.
Also Read: ఎంపీ డేవిడ్ అమీస్ హత్య ఉగ్రవాదుల పనే.. లండన్ పోలీసుల ప్రకటన !
Also Read: గ్రీన్ టీతో కోవిడ్ను అరికట్టవచ్చా? IISER శాస్త్రవేత్తల పరిశోధనలో ఏం తేలింది?
Also Read: చేప పేగులతో సాంప్రదాయక వంటకం.. ఇది ఏ దేశంలో ప్రత్యేకమో తెలుసా?
Also Read: ‘ఫస్ట్ నైట్’ బెడ్ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?
Hardik Patel Resign: కాంగ్రెస్లో మరో వికెట్ డౌన్- గుజరాత్ పీసీసీ చీఫ్ హార్థిక్ పటేల్ రాజీనామా
Maharashtra News : భార్యకు చీర ఆరేయడం రాదని భర్త ఆత్మహత్య, సూసైడ్ కు కారణాలు చూసి పోలీసులు షాక్
Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు- 31 ఏళ్ల తర్వాత పెరరివలన్ రిలీజ్
Pithapuram News : పిఠాపురంలో దారుణ హత్య, భార్యను కాపురానికి పంపలేదని అత్తపై అల్లుడు దాడి
Corona Cases: దేశంలో కొత్తగా 1,829 కరోనా కేసులు- 33 మంది మృతి
Minister KTR UK Tour : పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ యూకే టూర్, కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు
National Survey: కొడుకు పుట్టాలని కోరుకునే జంటల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది, సర్వేలో తేలిన విషయం
Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మిత్రులు సజీవదహనం
Chandrababu Tour : నేడు కడప జిల్లాలో చంద్రబాబు టూర్, పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం