అన్వేషించండి

Bangladesh: బంగ్లాదేశ్‌లో దసరా వేడుకలు రక్తసిక్తం.. ఇస్కాన్ టెంపుల్‌పై దాడి.. భక్తులకు గాయాలు

బంగ్లాదేశ్‌లోని నౌఖాలీలో ఉన్న ఇస్కాన్ టెంపుల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అక్కడ దసరా వేడుకల్లో పాల్గొన్న భక్తులను భయబ్రాంతులకు గురి చేశారు.

బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలు, భక్తులపై దాడులు ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయి. తరచూ ఇలాంటి సంఘటన తరచూ వెలుగులోకి వస్తున్నాయి. 
చాలా ప్రాంతాల్లో ఇలా మతపరమైన అల్లర్లు సృష్టించడం చాలా సర్వసాధారణమైపోతోంది. 24గంటల వ్యవధిలోనే ఇలాంటి దాడులు రెండు చోట్ల జరిగాయి. దుర్గా పూజ సందర్భంగా హిందూ దేవాలయాలు, విగ్రహాలపై దాడులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత రోజే దసరా సందర్భంగా ఏకంగా ఎంతో ప్రఖ్యాతమైన ఇస్కాన్ టెంపుల్‌పై దాడి జరగడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 
నోఖాలి ప్రాంతంలోని ఇస్కాన్ దేవాలయంలో భక్తులపై దుండగులు తీవ్రంగా దాడి చేశారు. ఇందులో చాలా మంది భక్తులు గాయపడ్డారు. ఆలయ ఆస్తి బాగా  దెబ్బతింది. విధ్వంసానికి గురైన ఆలయ చిత్రాలను ట్విట్టర్‌లో పంచుకుంది ఇస్కాన్ టెంపుల్. భారీగా ఆస్తి నష్టం జరిగిందని.. దుండగుల దాడిలో గాయపడ్డ భక్తుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది.

ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఎసి భక్తివేదాంత స్వామి ప్రోభుపాద్ శిల్పాన్ని కూడా దుండగులు దగ్ధం చేశారు. హిందువులందరి భద్రతకు భరోసా ఇవ్వాలని , నేరస్థులకు న్యాయం చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి దేవస్థానం విజ్ఞప్తి చేసింది. 

మతపరమైన హింసకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనే బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా హామీ ఇచ్చారు. అయినప్పటికీ హింస ఆగలేదు. గురువారం, హబీగంజ్ జిల్లాలోని దుర్గా పూజ వేదిక వద్ద జరిగిన మత ఘర్షణలో ఒక పోలీసు సహా 20 మందికి పైగా గాయపడ్డారు. 

భారత్‌ జోక్యం చేసుకోవాలని ఇస్కాన్ సిబ్బంది వేడుకోలు

ఈ విషయంపై బంగ్లాదేశ్ తో వెంటనే మాట్లాడాలని భారత ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించారు ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారమ్ దాస్. 'బంగ్లాదేశీ హిందువులను కాపాడండి' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఒక ట్వీట్‌ను పోస్ట్ చేసిన దాస్, పొరుగు దేశంలో హిందువులపై విస్తృత హింస జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

నోఖలిలోని ఇస్కాన్ ఆలయం వెలుపల 500 మంది గుమిగూడి, విగ్రహాలను ధ్వంసం చేసి, దేవాలయానికి నిప్పు పెట్టారని దాస్ పేర్కొన్నారు.

గురువారం బంగ్లాదేశ్‌లోని హిందూ దేవాలయాలపై జరిగిన దాడులపై తన ప్రతిస్పందన తెలియజేసింది భారత్‌ రాయబార కార్యాలయం. ఢాకాలోని హైకమిషన్‌కు   బంగ్లాదేశ్ అధికారులతో మాట్లాడుతోందని ఈ విషయంపై చర్చిస్తోందనిపేర్కొంది.


" మతపరమైన స్థలాలపై దాడుల నివేదికలను మేము చూశాము. బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా వెంటనే రియాక్ట్‌ అయింది. ప్రభుత్వం సెక్యూరిటీ, పోలీసు భద్రత పెంచింది. వేడుకలు ప్రశాంతంగా జరుగుతాయన్ని అనుకున్నాం. జరిగిన సంఘటనల విచారణ బంగ్లాదేశ్‌కు వదిలేశాం. "
-MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి
 

బంగ్లాదేశ్‌లో మతపరమైన హింస

బంగ్లాదేశ్‌లో దుర్గా పూజ వేడుకల సందర్భంగా హింస చెలరేగింది. ననువర్ దిగినది ఒడ్డున జరిగిన వేడుకల్లో ఓ మత గ్రంథాన్ని అపవిత్రం చేశారన్న పుకారు సోషల్ మీడియాలో వ్యాపించింది. ఇదే ప్రస్తుత మత ఘర్షణలకు కారణమైంది. కుమిలియా జిల్లాలోని ననువా దిగిర్‌పార్ ప్రాంతంలో పోలీసులతో ఘర్షణ పడిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. కనీసం 50 మంది గాయపడ్డారు.

ఖుల్నా జిల్లాలోని ఒక హిందూ దేవాలయం గేటు నుంచి కనీసం 18 బాంబులు స్వాధీనం చేసుకున్నారు, ఇది దేశంలోని హిందూ సమాజాన్ని ఆందోళన కలిగిస్తోంది.
అన్ని హింసాత్మక సంఘటనలపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. అదనంగా, భద్రతను పెంచడానికి బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB)దళాలను కనీసం 22 జిల్లాలలో మోహరించారు.

ASLO READ:  ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
APSRTC: వాట్సప్ బస్ టికెట్లు అనుమతించండి - అధికారులకు ఏపీఎస్ఆర్టీసీ కీలక ఆదేశాలు, టికెట్లు బుక్ చేసుకోండిలా!
వాట్సప్ బస్ టికెట్లు అనుమతించండి - అధికారులకు ఏపీఎస్ఆర్టీసీ కీలక ఆదేశాలు, టికెట్లు బుక్ చేసుకోండిలా!
Big Alert: వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
Mudragada Padmanabha Reddy: మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం
మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Union Budget 2025 Top 5 Points | బడ్జెట్ చూడలేదా పర్లేదు..ఈ వీడియో చూడు చాలు | ABP DesamUnion Budget 2025 Income Tax Nirmala Sitharaman 12Lakhs No Tax | ఉద్యోగులకు పెద్ద తాయిలం ప్రకటించిన కేంద్రం | ABPNagoba Jathara Youngsters Musical Instruments | డోలు, సన్నాయిలతో కుర్రాళ్ల సంగీత సేవ | ABP DesamPM Modi Hints on Income Tax Rebate | ఆదాయపు పన్ను మినహాయింపు గురించి మోదీ నిన్ననే చెప్పారు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
APSRTC: వాట్సప్ బస్ టికెట్లు అనుమతించండి - అధికారులకు ఏపీఎస్ఆర్టీసీ కీలక ఆదేశాలు, టికెట్లు బుక్ చేసుకోండిలా!
వాట్సప్ బస్ టికెట్లు అనుమతించండి - అధికారులకు ఏపీఎస్ఆర్టీసీ కీలక ఆదేశాలు, టికెట్లు బుక్ చేసుకోండిలా!
Big Alert: వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
Mudragada Padmanabha Reddy: మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం
మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై దాడి, ఇళ్లు కూల్చడానికి తాగుబోతు యత్నం
Udit Narayan Kiss Controversy : 'ముద్దు' వివాదంపై స్పందించిన ఉదిత్ నారాయణ్.. 'నేను అస్సలు సిగ్గుపడను, అది కేవలం నా ఫ్యాన్స్ మీద నాకున్న లవ్ మాత్రమే'
'ముద్దు' వివాదంపై స్పందించిన ఉదిత్ నారాయణ్.. 'నేను అస్సలు సిగ్గుపడను, అది కేవలం నా ఫ్యాన్స్ మీద నాకున్న లవ్ మాత్రమే'
Crime News: యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడు - బంధించిన యువతి కుటుంబసభ్యులు, చివరకు!
యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడు - బంధించిన యువతి కుటుంబసభ్యులు, చివరకు!
Budget 2025 : విదేశాల్లో పిల్లల్ని చదివించే వారికి బిగ్ రిలీఫ్ - టీసీఎస్ లిమిట్ రూ.10 లక్షలకు పెంపు
విదేశాల్లో పిల్లల్ని చదివించే వారికి బిగ్ రిలీఫ్ - టీసీఎస్ లిమిట్ రూ.10 లక్షలకు పెంపు
Viral News: బ్రెజిల్‌లో ఆకాశంలో వింత ఘటన, ఒక్కసారిగా స్పెడర్ వర్షం కురిసింది- రీజన్ ఇదే
బ్రెజిల్‌లో ఆకాశంలో వింత ఘటన, ఒక్కసారిగా స్పెడర్ వర్షం కురిసింది- రీజన్ ఇదే
Embed widget