అన్వేషించండి

చైనాతో మైత్రి భారత్‌కి అవసరమే, సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలి - ప్రధాని మోదీ

India China Border: భారత్ చైనా సరిహద్దు వివాదాన్ని త్వరగా పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ వెల్లడించారు.

India China Border Dispute: భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రెండు దేశాల మధ్య ఎంతో కీలకమైన మైత్రి ఉందని, ఇది చెడిపోకుండా సమస్యని పరిష్కరించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. భారత్, చైనా మధ్య బంధం స్థిరంగా ఉండడం ప్రపంచానికి కూడా ముఖ్యమేనని వెల్లడించారు. అమెరికాకి చెందిన Newsweek మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరలో రెండు దేశాలూ ఈ వివాదాన్ని పక్కన పెట్టి శాంతియుతంగా ముందుకు వెళ్లేందుకు చొరవ చూపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2020లో లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాన్ని మరింత పెంచింది. అప్పటి నుంచి దాదాపు 18 రౌండ్లకి పైగా కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో వివాదం సద్దుమణగలేదు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 

"చైనాతో మైత్రి అనేది భారత్‌కి చాలా కీలకం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నాను. రెండు దేశాల బంధం బలపడేలా చర్చలు జరగాల్సిన అవసరముంది. భారత్ చైనా మధ్య వివాదం సద్దుమణగడం కేవలం ఈ రెండు దేశాలకే కాదు. ప్రపంచం మొత్తానికి మంచిది. మిలిటరీ స్థాయిలో చర్చలు జరగాల్సిన అవసరం చాలా ఉంది. వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించాలి"

- ప్రధాని నరేంద్ర మోదీ

భారత్‌ పాకిస్థాన్‌ బంధం గురించీ ప్రస్తావించారు ప్రధాని మోదీ. 2019లో జరిగిన పుల్వామా దాడి గురించి మాట్లాడారు. ఈ దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వైరం పెరిగింది. భారత్ ఎప్పుడూ శాంతియుత వాతావరణాన్నే కోరుకుంటుందని తేల్చిచెప్పారు ప్రధాని మోదీ. హింస, ఉగ్రవాదానికి తమ దేశంలో తావు ఉండదని స్పష్టం చేశారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌ గురించి ప్రస్తావించేందుకు మోదీ ఆసక్తి చూపించలేదు. అది ఆ దేశ అంతర్గత వ్యవహారం అని వెల్లడించారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget