అన్వేషించండి

చైనాతో మైత్రి భారత్‌కి అవసరమే, సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలి - ప్రధాని మోదీ

India China Border: భారత్ చైనా సరిహద్దు వివాదాన్ని త్వరగా పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ వెల్లడించారు.

India China Border Dispute: భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రెండు దేశాల మధ్య ఎంతో కీలకమైన మైత్రి ఉందని, ఇది చెడిపోకుండా సమస్యని పరిష్కరించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. భారత్, చైనా మధ్య బంధం స్థిరంగా ఉండడం ప్రపంచానికి కూడా ముఖ్యమేనని వెల్లడించారు. అమెరికాకి చెందిన Newsweek మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరలో రెండు దేశాలూ ఈ వివాదాన్ని పక్కన పెట్టి శాంతియుతంగా ముందుకు వెళ్లేందుకు చొరవ చూపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 2020లో లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాన్ని మరింత పెంచింది. అప్పటి నుంచి దాదాపు 18 రౌండ్లకి పైగా కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో వివాదం సద్దుమణగలేదు. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 

"చైనాతో మైత్రి అనేది భారత్‌కి చాలా కీలకం. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నాను. రెండు దేశాల బంధం బలపడేలా చర్చలు జరగాల్సిన అవసరముంది. భారత్ చైనా మధ్య వివాదం సద్దుమణగడం కేవలం ఈ రెండు దేశాలకే కాదు. ప్రపంచం మొత్తానికి మంచిది. మిలిటరీ స్థాయిలో చర్చలు జరగాల్సిన అవసరం చాలా ఉంది. వీలైనంత త్వరగా శాంతిని పునరుద్ధరించాలి"

- ప్రధాని నరేంద్ర మోదీ

భారత్‌ పాకిస్థాన్‌ బంధం గురించీ ప్రస్తావించారు ప్రధాని మోదీ. 2019లో జరిగిన పుల్వామా దాడి గురించి మాట్లాడారు. ఈ దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వైరం పెరిగింది. భారత్ ఎప్పుడూ శాంతియుత వాతావరణాన్నే కోరుకుంటుందని తేల్చిచెప్పారు ప్రధాని మోదీ. హింస, ఉగ్రవాదానికి తమ దేశంలో తావు ఉండదని స్పష్టం చేశారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్‌ గురించి ప్రస్తావించేందుకు మోదీ ఆసక్తి చూపించలేదు. అది ఆ దేశ అంతర్గత వ్యవహారం అని వెల్లడించారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hero Xoom 125 లో రెండు వేరియంట్లు - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Hero Xoom 125 VX vs ZX - ₹8,000 తేడాతో ఏ ఫీచర్లు మారాయి?
Bihar Politics: బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
Thalapathy Vijay: కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
కట్టప్ప కుటుంబంలో గొడవ... విజయ్ విషయంలో బ్రదర్ & సిస్టర్ ఫైట్
ఫిబ్రవరి 2026 కార్ సేల్స్‌: జనం ఈ కంపెనీ కార్లను తెగ కొన్నారు, డిమాండ్‌ కూడా పెరిగింది
ఫిబ్రవరి 2026 కార్ సేల్స్‌: గత నెలలో ఈ కార్లకే భారీ డిమాండ్, కొనడానికి జనం క్యూ

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget