అన్వేషించండి

Mother Teresa charity: మదర్ థెరిసా మిషనరీస్ అకౌంట్స్ ఫ్రీజ్ పై వివాదం... నిధులు వినియోగించవద్దని మాత్రమే చెప్పామని కేంద్రం స్పష్టం

మదర్ థెరిసా మిషనరీస్ అకౌంట్స్ ఫ్రీజ్ పై కేంద్రం స్పష్టత ఇచ్చింది. నిధులు మాత్రమే వినియోగించవద్దని చెప్పామని పేర్కొంది. హోంశాఖ నిర్ణయంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మదర్ థెరిసా గొప్ప సేవామూర్తి. ఎవరూ సహాయం చేయడానికి ఇష్టపడని వారి కోసం తన జీవితాన్ని అంకితం చేసింది. యూరప్ లో పుట్టినా భారత్ క్రిస్టియన్ మిషనరీస్ ద్వారా ఎంతో మందికి సేవ చేశారు. ఆమె అందించిన సేవలకు నోబెల్ పురస్కారం దక్కింది. ఆమె మరణించిన 19 సంవత్సరాల తరువాత వాటికన్ సెయింట్‌గా ప్రకటించింది. మదర్ థెరిసా సంస్థ మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థ అకౌంట్లను క్రిస్మస్ రోజునే కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది. విదేశాల్లో ఉన్న దాతల నుంచి నిధులను స్వీకరించాలని స్వచ్ఛంద సంస్థ చేసిన అభ్యర్థనను హోంమంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఈ నిధులను ఉపయోగించడానికి లాభాపేక్ష లేని సంస్థలకు ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ (FCRA) కింద క్లియరెన్స్ అవసరం. అయితే కేంద్రం ఈ లైసెన్స్ పునరుద్ధరించాలనే అభ్యర్థనను తిరస్కరించిందని మదర్ థెరిసా స్వచ్ఛంద సంస్థ తెలిపింది. 

Also Read: మదర్ థెరిసా సేవా సంస్థ అకౌంట్లు ఫ్రీజ్ చేసిన కేంద్రం... ఆగ్రహం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ !

కానీ కేంద్రం మాత్రం మరో కారణం చెబుతోంది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయలేదని హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న మిషనరీస్ ఖాతాలను స్తంభింపజేయాలని మిషనరీస్ ఆఫ్ ఛారిటీ సంస్థే స్వయంగా ఎస్‌బీఐను అభ్యర్థించిందని అని పేర్కొంది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ FCRA అర్హతను పునరుద్ధరించలేదని తెలిపింది. మిషనరీస్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకున్నప్పుడు కొన్ని ప్రతికూల కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఆ ఖాతాల్లోని నిధులను వినియోగించవద్దని మాత్రమే చెప్పామని కేంద్రం వెల్లడించింది. అయితే ఈ వ్యవహారంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. పేదలకు ఆశ్రయం కల్పించే మిషనరీస్ ఆఫ్ ఛారిటీ బ్యాంక్ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం స్తంభింపజేసిందని ట్వీట్ చేశారు. 

Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం

క్రిస్మస్ రోజునే ఆ సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేయడం ఇది మానవత్వం కాదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ కోల్‌కతా ప్రధాన కేంద్రంగా సేవా కార్యక్రమాలు  చేపడుతోంది. క్రిస్మస్ పర్వదినం రోజున తమ సంస్థకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, నగదు మొత్తం ఫ్రీజ్ చేశారని దీని వల్ల 22 వేల మందికిపైగా రోగులు, ఉద్యోగులు ఇబ్బంది పడ్డారని ఆ సంస్థకు చెందిన కొంత మంది సోషల్ మీడియాలో ట్వీట్స్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్‌ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్‌!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Slams Revanth Reddy: రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలి- హామీల అమలుపై కేటీఆర్ ఫైర్
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Embed widget