అన్వేషించండి

Yearender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం

కొత్త సంవత్సరం రాబోతోంది. ఏదేమైనా 2021 ఏడాదిలో భారత రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ సంచలన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచారు. అందులో ఐదు ప్రకటనలు ఊహించనవి. అవే..!

మరికొన్ని రోజుల్లో 2021 ముగిసిపోతుంది. కొత్త సంవత్సరం రాబోతోంది. ఏదేమైనా 2021 ఏడాదిలో భారత రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ సంచలన నిర్ణయాలతో ఆశ్చర్యపరిచారు. అందులో ఐదు ప్రకటనలు ఊహించనవి. అవే..!

1. National Hydrogen Mission - హైడ్రోజన్‌ మిషన్‌
ఈ ఏడాది స్వాత్రంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని నరేంద్రమోదీ జాతీయ హైడ్రోజన్‌ మిషన్‌ను ఆరంభించారు. దేశంలో వాతావరణ సంక్షోభం రాకుండా అడ్డుకొనేందుకు గ్రీన్‌ హైడ్రోజన్‌ ఎలా సాయపడుతోందో ఆయన వివరించారు. ప్రపంచంలోనే అత్యధిక గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి హబ్‌గా భారత్‌ను మార్చాలని, ఎక్కువ ఉద్యోగాలు సృష్టించాలన్నది ఈ మిషన్‌ లక్ష్యం.

2. Repeal of farm laws - వ్యవసాయ చట్టాల రద్దు
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటుందని ఎవ్వరూ భావించలేదు. అలాంటి సమయంలో హఠాత్తుగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ప్రజలు, రైతులకు క్షమాపణలు చెప్పారు. ఈ చట్టాల ప్రయోజనాలను రైతులకు సరిగ్గా వివరించలేక పోయామని, వారిని ఒప్పించడంలో విఫలమయ్యామని వెల్లడించారు.

Yearender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం

3. Sainik schools for girls - బాలికలకు సైనిక్‌ పాఠశాలలు
తల్లిదండ్రులు తమ కుమారులను సైనిక్‌ పాఠశాలల్లో చేర్పించేందుకు ఎంత ఆరాట పడతారో తెలియని కాదు. ఇందులో కేవలం బాలురకే ప్రవేశం. అలాంటిది 2021-22 సెషన్‌ నుంచి బాలికలకు సైనిక్‌ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తూ మోదీ నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో 33 సైనిక్‌ పాఠశాలలు ఉన్నాయి. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ నావల్‌ అకాడమీలో ప్రవేశాలకు యువతను సిద్ధం చేయడమే వీటి లక్ష్యం.

4. Gati Shakti - National Master Plan - గతి శక్తి యోజన
ప్రధాని మోదీ ప్రకటించిన మరో భారీ ప్రాజెక్ట్‌ 'గతి శక్తి యోజన'. స్థానిక వ్యాపారులను అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసేందుకు రూ.100 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రకటించారు. అన్ని రకాల అవాంతరాలను అధిగమించి ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే ఈ ప్రణాళిక ఉద్దేశం.

5. 75 Vande Bharat Trains - వందే భారత్‌ రైళ్లు
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 75 వందే భారత్‌ రైళ్లను ప్రకటించారు. స్వాత్రంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా 75 రైళ్లను ప్రకటించారు. దేశంలోని మూలమూలలను కలపడమే ఈ రైళ్ల ఉద్దేశం.

Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్‌ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్‌!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Advertisement

వీడియోలు

Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Shiva Jyothi : శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
Embed widget