అన్వేషించండి

Kumaraswamy: కర్ణాటకలో స్కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది - మాజీ సీఎం కుమారస్వామి సెటైర్లు

కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి పలు విమర్శలు గుప్పించారు.

కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కాకుండా స్కాంగ్రెస్ కొనసాగుతోందని జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కరెంట్ కొరత కాంగ్రెస్ ప్రభుత్వమే సృష్టించిందని ఆరోపించారు. ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్రికెట్ మ్యాచ్ చూడటాన్ని కుమారస్వామి తప్పుపట్టారు. " రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నాడు. ఇక్కడ ప్రజలు సమస్యల్లో ఉంటే కర్ణాటక నీరో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు" అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లపై విమర్శలు గుప్పించారు. సీఎం, డిప్యూటీ సీఎం కొందరు సహచరులతో కలిసి బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. దీనిపై కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కష్టకాలంలో ఉంటే ప్రభుత్వం మాత్రమ క్రికెట్ మ్యాచులు చూస్తోందని ఆరోపించారు.

ఈ మ్యాచ్‌లో మీరు పాకిస్తాన్‌కి మద్దతు ఇచ్చారా..? లేక ఆస్ట్రేలియాకు మద్దతు ఇచ్చారా..? అని సెటైర్లు వేశారు. ప్రజలు ప్రభుత్వంలో అవినీతి గురించి మాట్లాడుతుకుంటున్నారని అన్నారు. ప్రజలు మాకు అధికారం ఇచ్చారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.. పర్సంటేజీలు, అవినీతిపై ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మేం చెప్పినట్లు చేశామని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ, రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని కుమారస్వామి అన్నారు.

రాష్ట్రప్రభుత్వం, కేంద్రం సహాయం కోసం లేఖలు రాసింది. రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కేంద్రాన్ని కలవాలని ప్రభుత్వానికి సూచించారు. కొన్ని జిల్లాల్లో నీటి కొరత ఉందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కర్ణాటకలో జేడీఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇరు పార్టీలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వంపై కుమారస్వామి విరుచుకుపడ్డారు.

కర్ణాటక రాష్ట్రం విద్యుత్ సమస్యలు ఎదుర్కొంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తీరిగ్గా కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూడడంలో మునిగిపోయారని దుయ్యబట్టారు. కరెంటు కొరతను ప్రభుత్వమే సృష్టించిందని ఆరోపించారు. కమిషన్ల కోసమే కరెంటును బయటనుంచి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 32, 912 మెగావాట్లను ఉత్పత్తి చేసే వ్యవస్థ ఉన్నప్పటికీ నిర్వహణలోపం కారణంగా కేవలం 12 వేల మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతోందని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ లోటుపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే మ్యాచ్ ను వీక్షించడంపై వచ్చిన విమర్శలను ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఖండించారు. జీవితం అంటే రాజకీయం కాదని అన్నారు. 

అనంతరం కర్ణాటకలో రైతుల ఆత్మహత్యల గురించి అధికార కాంగ్రెస్ ప్రకటించుకోవడంలేదని విమర్శించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జెడిఎస్ కదా ముగిసి పోయిందన్న భ్రమలో కాంగ్రెస్ వెళ్లిందని వ్యాఖ్యానించారు.  కర్ణాటకలో 42 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసిన అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విషయం గురించి ఏమాత్రం ఆలోచించడం లేదని విమర్శించారు. ఇకనైనా రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలను పరిష్కరించడానికే ఓటు వేసి గెలిపించాలి తప్ప ఇలా కాలయాపన చేయడానికి కాదని నొక్కి చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Teacher Burns Child Private Part: వారణాసిలో ఘోరం - ప్యాంట్‌లో మూత్రం పోసుకున్నాడని.. బాలుడి ప్రైవేట్ పార్ట్ కాల్చిన టీచర్!
వారణాసిలో ఘోరం - ప్యాంట్‌లో మూత్రం పోసుకున్నాడని.. బాలుడి ప్రైవేట్ పార్ట్ కాల్చిన టీచర్!
SC Status Religious Conversion Verdict: మత మార్పిడితో ఎస్సీ హోదా రద్దు - సంచలన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు!
మత మార్పిడితో ఎస్సీ హోదా రద్దు - సంచలన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Embed widget