అన్వేషించండి

ABP Network Ideas Of India 2023: ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సుకి ఇన్‌ఫోసిస్ నారాయణ మూర్తి, కార్పొరేట్ కల్చర్‌పై కీలక ప్రసంగం

ABP Network Ideas Of India: ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సదస్సులో ఇన్‌ఫోసిస్ నారాయణ మూర్తి పాల్గొననున్నారు.

ABP Network Ideas Of India 2023: 

రెండు రోజుల సదస్సు..

ABP Network Ideas Of India సదస్సు రెండో ఎడిషన్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో ఈ సమ్మిట్ జరగనుంది. దేశంలో పలు రంగాల్లో ప్రముఖులైన వాళ్లు తమ అభిప్రాయాలు, ఆలోచనలు ఈ వేదికగా పంచుకోనున్నారు. వాతావరణ మార్పుల నుంచి
గ్లోబల్ ప్లేయర్‌గా భారత్ ఎలా రాణించగలదు అన్న అంశం వరకూ అన్ని విషయాలపైనా చర్చలు జరగనున్నాయి. డాబర్ వేదిక్ టీ, డాక్టర్ ఆర్థో, Gallant Advance స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న ఈ సమ్మిట్‌లో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్, గేయ రచయిత, కవి జావేద్ అక్తర్ పాల్గొననున్నారు. వీరితో పాటు సింగర్ లక్కీ అలీ, శుభ ముద్గల్, రచయితలు అమితవ్ ఘోష్, దేవ్‌దత్త్ పట్నాయక్, సినీ నటులు సారా అలీఖాన్, జీనత్ అమన్,ఆయుష్మాన్ ఖురానా, మనోజ్ వాజ్‌పేయీ, సెలెబ్రటీ చెఫ్ వికాస్ ఖన్నా, క్రీడా ప్రముఖులు జ్వాలా గుప్తా, వినేష్ ఫోగట్‌ తదితరులు హాజరు కానున్నారు. ఈ సారి సమావేశంలో "నవ భారత్" పై చర్చ జరగనుంది. ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఏం చేయాలన్న అంశంపై తమ ఆలోచనలు పంచుకోనున్నారు. 

నారాయణ మూర్తి స్పీచ్...

ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ NR నారాయణ మూర్తి ఈ సారి స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. గతేడాది జరిగిన సదస్సులో నారాయణ మూర్తి ఐటీ రంగ భవిష్యత్‌పై చర్చించారు. ఈ సారి కార్పొరేట్ కల్చర్‌పై తన అభిప్రాయాలు పంచుకోనున్నారు. 1981లో Infosys సంస్థను స్థాపించారు నారాయణమూర్తి. 2002 వరకూ దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆ కంపెనీ CEOగా ఉన్నారు. ఆ తరవాత 2002 నుంచి 2011 వరకూ ఛైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. 2011లో ఈ పదవి నుంచి తప్పుకున్నప్పటికీ ఐదేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగారు.

4 దశాబ్దాలుగా కార్పొరేట్ ఇండియా పురోగతిని పరిశీలించిన నారాయణ మూర్తి..."Father of the Indian IT sector" గా పేరు తెచ్చుకున్నారు. ఆయన సేవల్ని గుర్తించిన ప్రభుత్వం 2008లో పద్మశ్రీ, 2011లో పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది. ఈ సారి సమ్మిట్‌లో కార్పొరేట్ ప్రపంచంలోని కొత్త ట్రెండ్‌లపై మాట్లాడనున్నారు నారాయణ మూర్తి. ఆయన ఇంకే మాట్లాడతారో తెలుసుకోవాలంటే ఈ abplive.comని ఫాలో అవుతూ ఉండండి. ఫిబ్రవరి 25న ఆయన తన అభిప్రాయాలు పంచుకుంటారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget