అన్వేషించండి

Heatwave in India: నిప్పులు చెరుగుతున్న సూరీడు, 90% ప్రాంతాలు హైరిస్క్‌లో ఉన్నాయంటున్న రిపోర్ట్

Heatwave in India: దేశవ్యాప్తంగా వడగాలుల తీవ్రత పెరుగుతోంది.

 Heatwave in India:

హెచ్చరికలు..

దేశవ్యాప్తంగా సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. వడ దెబ్బలతో ఎక్కడో ఓ చోట ప్రాణాలు కోల్పోతున్నారు. IMD ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మరో ఐదు రోజుల పాటు వడగాలుల తీవ్రత పెరుగుతుందని తేల్చి చెప్పింది. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలెర్ట్ అయ్యాయి. ఇప్పుడున్న ఉష్ణోగ్రతలతోనే అల్లాడిపోతుంటే...కొత్తగా వచ్చిన ఓ రిపోర్ట్ బుర్రను ఇంకా హీట్ ఎక్కిస్తోంది. వాతావరణ మార్పుల కారణంగా దేశ నలుమూలలా వడగాడ్పుల తీవ్రత పెరుగుతూ వస్తోందని వెల్లడించింది. ప్రస్తుతానికి దేశంలోని 90% ప్రాంతాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని తేల్చి చెప్పింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. ప్రమాదకర పరిస్థితులున్నాయని తెలిపింది.  University of Cambridge విడుదల చేసిన ఈ రిపోర్ట్‌లో వేడిగాలుల కారణంగా తీవ్రంగా నష్టపోయే ప్రాంతాల జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఈ వాతావరణ మార్పుల కారణంగా భారత్ సుస్థిరాభివృద్ధిలోని కొన్ని లక్ష్యాలను గడువులోగా సాధించలేకపోతోందని తెలిపింది. 

వేలాది మంది మృతి 

గత 50 ఏళ్లలో భారత్‌లో వడ గాలుల కారణంగా 17 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ మాజీ సెక్రటరీ ఎమ్ రాజీవన్ వెల్లడించారు. ఈ మరణాలపై 2021లో ఓ రిపోర్ట్ కూడా వచ్చింది. 1971 నుంచి 2019 మధ్య కాలంలో ఎక్కువగా మరణాలు నమోదయ్యాయి. ఇటీవల నవీ ముంబయిలో వడ దెబ్బ కారణంగా 13 మంది చనిపోయారు. నిర్లక్ష్యం చేస్తే అన్ని చోట్లా ఇలాంటి మరణాలు నమోదయ్యే ప్రమాదముందని చెబుతోంది IMD. దేశంలో 90% మేర ప్రాంతాలు "హై రిస్క్‌"లో ఉన్నాయి. ఈ సమస్యను ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రభావం అభివృద్ధిపై పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీలో హీట్‌ వేవ్స్ కారణంగా విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడుతోంది. తాగు నీటికీ తంటాలు పడుతున్నారు అక్కడి ప్రజలు.  

IMD అలెర్ట్ 

కొద్ది రోజుల పాటు ఈ వేడిగాలుల ముప్పు తప్పదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది. దీన్నే టెక్నికల్ పరిభాషలో Blackouts అంటారు. సాధారణంగా వేసవిలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉంటుంది. అయితే...విపరీతమైన వేడి కారణంగా ట్రాన్స్‌మిష్‌ లైన్స్‌ సరైన విధంగా పవర్‌ను సప్లై చేయలేవు. ఈ కారణంగానే పదేపదే కరెంట్ పోవడం, సప్లైలో అంతరాయం ఏర్పడడం లాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే జరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్షలాది మంది ప్రజలు ఈ వేడిగాలుల ప్రభావానికి గురయ్యే ప్రమాదముంది. వడ దెబ్బల కారణంగా ప్రాణాలూ కోల్పోయే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పలు చోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. లు రాష్ట్రాలకు హీట్‌ వేవ్‌ వార్నింగ్‌ ఇచ్చింది భారత వాతావరణ విభాగం (IMD).హరియాణా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా ఈ జాబితాలో ఉన్నాయి. 

Also Read: Rahul Gandhi Defamation Case: రాహుల్ గాంధీకి మరో ఎదురు దెబ్బ, శిక్షపై స్టే విధించాలని పిటిషన్‌ - కొట్టేసిన కోర్టు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది ఏపీ వాసులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది ఏపీ వాసులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
Rana Daggubati: తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Attack on Chilkur Balaji Temple Rangarajan | రామరాజ్యం స్థాపించటానికి వచ్చాం అంటూ దాడి | ABP DesamVishwak sen on Prudhviraj Controversy | 11 గొర్రెలు కాంట్రవర్సీపై విశ్వక్ సారీ | ABP DesamAllu Aravind on Ram Charan | రామ్ చరణ్ పై వ్యాఖ్యల వివాదం మీద అల్లు అరవింద్ | ABP DesamPresident Murmu in Maha kumbh 2025 | మహా కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Crime News: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది ఏపీ వాసులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మంది ఏపీ వాసులు మృతి - కుంభమేళాకు వెళ్లొస్తుంటే విషాదం
Ramarajyam Raghav Reddy: చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన
చిలుకూరి పూజారినే కాదు చిన్న జీయర్ నూ టార్గెట్ చేసిన "రామరాజ్యం " రాఘవ రెడ్డి, అతడి లక్ష్యం ఇదే!
Rana Daggubati: తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
తెలుగులో రిలీజ్ కాని రానా దగ్గుబాటి మూవీ... సమంత నటించిన ఆ ఫ్లాప్ సినిమా పేరేంటో తెలుసా?
New Ration Cards: మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం, వాళ్లు అప్లై చేయవద్దన్న అధికారులు
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Allu Aravind: 'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
'రామ్ చరణ్‌పై అలా మాట్లాడకుండా ఉండాల్సింది' - ట్రోలింగ్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అరవింద్, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా!
Brahma Anandam Trailer: ప్రభాస్ వదిలిన ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్... తండ్రీకొడుకులు, తాతామనవళ్లులా ఏడిపించేశారు కదయ్యా!
ప్రభాస్ వదిలిన ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్... తండ్రీకొడుకులు, తాతామనవళ్లులా ఏడిపించేశారు కదయ్యా!
Chilkuru Balaji Rangarajan Attack case: చిలుకూరు అర్చకులు రంగరాజన్‌పై దాడి, ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
చిలుకూరు అర్చకులు రంగరాజన్‌పై దాడి, ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Embed widget