అన్వేషించండి

Haryana Crime News: గదిలో 36 రోజులపాటు నిర్బంధించి సామూహిక అత్యాచారం, డబ్బు కడితే కానీ వదలని కీచకులు

Haryana Crime News: హరియాణాకు చెందిన ఓ మహిళను గదిలో నిర్బంధించి సామూహిక అత్యాచార చేసారు.

Haryana Crime News: 

గడ్డి కోసుకుంటుండగా..

హరియాణాలో దారుణం జరిగింది. నూహ్ ప్రాంతంలో ఓ మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. 36 రోజుల పాటు ఆమెకు నరకం చూపించారు. గడ్డి కోసుకునేందుకు వెళ్లిన సమయంలో 45 ఏళ్ల మహిళను కిడ్నాప్ చేశారు. రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో ఆమెను నిర్బంధించారు. చివరకు ఆమెను విడిపించటానికి కుటుంబ సభ్యులు ఆ నిందితులకు రూ.3 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. అత్యాచారం చేసి వీడియోలు తీశారు. ఆ వీడియోలు బయట పెట్టకుండా ఉండాలంటే డబ్బులివ్వాలని బాధితురాలి కుటుంబ సభ్యుల్ని
డిమాండ్ చేశారు నిందితులు. చేసేదేమీ లేక ఆ డబ్బు కట్టి మహిళను విడిపించుకున్నారు. ఆ తరవాత పుణ్‌హన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ FIR ప్రకారం...బాధితురాలు జులై 27 వ తేదీన గడ్డి కోసుకునేందుకు వెళ్లింది. ఇది గమనించిన ముగ్గురు దుండగులు...తుపాకీ చూపించి బెదిరించి కార్ ఎక్కించుకుని ఆ మహిళను తీసుకెళ్లిపోయారు. రాజస్థాన్‌లోని ఓ గ్రామానికి తీసుకెళ్లి ఓ గదిలో నిర్బంధించారు. 
మత్తు మందు ఇచ్చి అశ్లీల వీడియోలు తీశారు. పలు సార్లు అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు చేసింది బాధితురాలు. సెప్టెంబర్ 1వ తేదీన నిందితులకు రూ.3 లక్షలు ముట్టచెప్పాక విడుదల చేసినట్టు వెల్లడించింది. తన వీడియోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయకుండా ఉండేందుకు ఈ డబ్బు డిమాండ్ చేసినట్టు తెలిపింది. నూహ్ ఎస్‌పీ ఈ ఘటనపై మాట్లాడారు. "ఫిర్యాదులోని వివరాల ప్రకారం...FIR బుక్ చేశాం. నిజానిజాలు నిర్ధరించుకున్నాక చట్టప్రకారం శిక్ష విధిస్తాం" అని స్పష్టం చేశారు. 

వరుస ఘటనలు..

ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరచు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోనూ గత నెల ఓ అత్యాచార బాధితురాలిపై మరోసారి అత్యాచారం జరగటం సంచలనమైంది. అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న ఓ కీచకుడు బెయిల్‌పై బయటకు వచ్చి బాధిత యువతిపై మరోసారి అత్యాచారం చేశాడు. మధ్యప్రదేశ్‌ జబల్‌పుర్‌ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. అత్యాచార బాధితురాలిపై మళ్లీ అత్యాచారానికి తెగపడ్డాడు ఓ దుర్మార్గుడు. ఈ సారి స్నేహితుడితో కలిసి గ్యాంగ్‌ రేప్ చేశాడు. అంతటితో ఆగని దుర్మార్గులు ఆ ఘటనన వీడియో తీసి బాధితురాలిని బెదిరించారు. తనపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోకపోతే సోషల్ మీడియాలో వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. త‌మిళ‌నాడు రాష్ట్రంలో మరో ఘటన జరిగింది. మైలాడు తురైలోని మ‌హిళ నివాసం ముందు ఉన్న గేటును ప‌గుల‌గొట్టి 15 మంది యువ‌కులు ఇంట్లోకి దౌర్జ‌న్యంగా ప్ర‌వేశించారు. ఆమె కుటుంబ స‌భ్యుల‌ను క‌త్తుల‌తో బెదిరించి మహిళను ఎత్తుకెళ్లారు. ఈ మొత్తం ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయింది. సమాచారం అందుకున్న మైలాడుతురై పోలీసులు వెంటనే గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అదే రోజు రాత్రి జాతీయ రహదారిపై కిడ్నాప‌ర్ల కారును అడ్డ‌గించి మ‌హిళ‌ను ర‌క్షించారు.

Also Read: TDP Ysrcp Dilemma : "ఎన్టీఆర్" పేరు మార్పు వివాదం - రెండు పార్టీల్లోనూ అలజడి ! ఏ పార్టీకి ఎక్కువ ఎఫెక్ట్ ?

Also Read: Alluri Movie Review: అల్లూరి రివ్యూ: శ్రీవిష్ణు కోరుకున్న హిట్ కొట్టాడా?

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20i Update: భారత్ భారీ స్కోరు - అభిషేక్ బ్లాస్టింగ్ సెంచరీ, పలు రికార్డులు బద్దలు..
భారత్ భారీ స్కోరు - అభిషేక్ బ్లాస్టింగ్ సెంచరీ, పలు రికార్డులు బద్దలు..
Big Alert: వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP DesamJudicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP DesamDirector Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP DesamSircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
నందమూరి కుటుంబంతో విజయసాయి రెడ్డి... రాజకీయాలకు గుడ్ బై చెప్పి బంధుత్వాలకు దగ్గరగా!
U19 Women T20 World Cup Winner India: తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
తెలంగాణ ప్లేయర్ త్రిష ఆల్ రౌండ్ షో.. రెండోసారి కప్పు భారత్ కైవసం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
Mumbai T20i Update: భారత్ భారీ స్కోరు - అభిషేక్ బ్లాస్టింగ్ సెంచరీ, పలు రికార్డులు బద్దలు..
భారత్ భారీ స్కోరు - అభిషేక్ బ్లాస్టింగ్ సెంచరీ, పలు రికార్డులు బద్దలు..
Big Alert: వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
వైరస్‌తో ఒక్క జిల్లాలోనే కోటికి పైగా కోళ్లు మృతి! కూటమి ప్రభుత్వం ఏం చేస్తోందంటూ వైసీపీ ఆగ్రహం
Hyderabad News: చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
చోరీ చేసే ముందు రెక్కీ - యూట్యూబ్ వీడియోలు చూసి ఎస్కేప్ ప్లాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు
Delhi News: వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
వరుడి అత్యుత్సాహం కొంపముంచింది - పెళ్లి వేదిక వద్ద 'చోలీ కే పీచే క్యాహై' అంటూ డ్యాన్స్, మ్యారేజ్ క్యాన్సిల్ చేసిన వధువు తండ్రి
Abhishek Century: అభిషేక్ స్టన్నింగ్ సెంచరీ - సిక్సర్లతో ఊచకోత, టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు
అభిషేక్ స్టన్నింగ్ సెంచరీ - సిక్సర్లతో ఊచకోత, టీ20ల్లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు
Crime News: కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
కూతురి చదువంటూ భర్త కిడ్నీ అమ్మేసింది - ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో రాత్రికి రాత్రే జంప్, కట్ చేస్తే..
Embed widget