అన్వేషించండి

Bihar elections 2025: సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించిన ఎన్నికల సంఘం - తొలగించిన 65 లక్షల ఓట్ల జాబితా ప్రకటన - ఇక నిరూపించాల్సింది కాంగ్రెస్సే !

Surpreme Court : బీహార్‌లో నిర్వహించిన సమగ్ర ఓటర్ల పరిశీలనలో తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల జాబితాను ఈసీ వెబ్ సైట్‌లో ప్రకటించింది. ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ తమ ఆరోపణలు నిరూపించాల్సి ఉంది.

EC releases names of 65 lakh Bihar voters deleted list:  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం బీహార్ లో తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల జాబితాలను ప్రకటించింది.  ఓటర్ల తొలగింపు వివరాలను ఆగస్టు 19, 2025 నాటికి బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఒక రోజు ముందుగానే ఈసీ ఈ జాబితా విడుదల చేసింది.  

తొలగించిన 65 లక్షల ఓటర్లలో  18.66 లక్షల మంది మరణించినవారు, 26.01 లక్షల మంది  ఇతర నియోజకవర్గాలకు తరలివెళ్లినవారు,  7 లక్షల మంది పలు చోట్ల ఓటర్లుగా   నమోదైనవారు ఉన్నాని ఈసీ తెలిపింది. అలాగే  11,484 మందిని గుర్తించలేదు.   ఈ ఓటర్లను ‘ASD’ (Absentee, Shifted, Dead) ఓటర్లుగా వర్గీకరించారు.  ఈ జాబితాలు జిల్లా ఎన్నికల అధికారుల వెబ్‌సైట్‌లలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.  ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (EPIC) నంబర్‌తో  సెర్చ్  చేసి తెలుసుకోవచ్చు. ఆ ఓట్లను ఎందుకు తీసేశారో కారణాలు కూడా వివరిస్తున్నారు. 

ఆగస్టు 14, 2025న, సుప్రీం కోర్టు ఈసీని 65 లక్షల ఓటర్ల తొలగింపు వివరాలను, వారి పేర్లతో పాటు తొలగింపు కారణాలను  అంటే మరణం, వలస, డూప్లికేట్ ఎంట్రీలు  వంటి కారణాలను న్‌లైన్‌లో ప్రచురించాలని ఆదేశించింది  ఈ జాబితాలు బూత్ వారీగా పంచాయత్ , బ్లాక్ డెవలప్‌మెంట్ కార్యాలయాల్లో కూడా ప్రదర్శించాలని, వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని కోర్టు సూచించింది. ఓటర్ల గుర్తింపు కోసం ఆధార్ కార్డును కూడా ఒక పత్రంగా అంగీకరించాలని కోర్టు ఈసీకి  సూచించింది.  చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఈ SIR ప్రక్రియ ఓటరు జాబితాలలోని లోపాలను సరిచేయడానికి ఉద్దేశించినదని, “వోట్ చోరీ” ఆరోపణలను నిరాధారమైనవిగా తోసిపుచ్చారు.

బీహార్‌లో జూన్ 24, 2025 నుంచి  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్  ప్రారంభించారు.   2003 తర్వాత రాష్ట్రంలో జరిగిన మొదటి  ఓటర్ జాబితా పరిశీలన.  ఈ ప్రక్రియలో 1 లక్ష బూత్ లెవల్ అధికారులు, 4 లక్షల మంది వాలంటీర్లు,  1.5 లక్షల బూత్ లెవల్ ఏజెంట్లు (BLAs) పాల్గొన్నారు.  జూన్ 24, 2025 నాటికి బీహార్‌లో మొత్తం 7.89 కోట్ల ఓటర్లు ఉన్నారు, వీరిలో 90.67% మంది ఎన్యూమరేషన్ ఫారమ్‌లు సమర్పించారు. 90.37% డిజిటైజ్ చేశారు.  ఆర్జేడీ, కాంగ్రెస్ మొదలైనవి ఇలా చేయడాన్ని   “వోట్ చోరీ”గా అభివర్ణించి, ఈసీ బీజేపీతో కుమ్మక్కై ఓటరు జాబితాను మార్చిందని ఆరోపించింది. 

ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. జాబితాను ఆన్ లైన్ లో పెట్టినందున ఎంత మందికి అర్హులైన ఓటర్లను ఓటర్లుగా తీసివేశారో.. ఎంత మంది అనర్హులకు ఓట్లు కేటాయించారో బయట పెట్టాల్సి ఉంది.                                

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget