అన్వేషించండి

Doctors Precautions: ఓ వైపు శీతాకాలం, మరోవైపు కరోనా భయం - అప్రమత్తంగా ఉండాల్సిందే అంటున్న నిపుణులు, ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Telangana News: అసలే చలి, ఆపై కరోనా కేసులు పెరుగుతుండడం తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే, జాగ్రత్తలు పాటిస్తే ఏ ప్రమాదం ఉండదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Doctors Alert to People on Corona New Variant: తెలంగాణ (Telangana) సహా ఇతర ప్రాంతాల్లోనూ చలి విజృంభిస్తోంది. తూర్పు తీరం నుంచి బలమైన గాలుల కారణంగా గత 3, 4 రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. అటు, ఏపీలోనూ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. వాతావరణ మార్పులతో ఇప్పటికే చాలా మంది జలుబు, దగ్గుతో సతమతమవుతుండగా కరోనా హెచ్చరికలు ఇప్పుడూ ప్రజలను మరింత కలవరపెడుతున్నాయి. ఒక్క హైదరాబాద్ (Hyderabad) లోనే 13 కేసులు (Corona Cases) నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ఆస్పత్రులు జ్వర పీడితులతో నిండిపోయాయి. చలి పంజా విసురుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు వీలైనంత మేర సాయంత్రం, ఉదయం ఆరుబయట తిరగకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే, చాలా ప్రాంతాల్లో ప్రజలు గాలులతో కూడిన చలి కారణంగా బయటకు రావాలంటేనే జంకుతున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి జలుబు, దగ్గు, జ్వర పీడితులు ఎక్కువయ్యారు. జాగ్రత్తలు పాటిస్తే ఏం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

'వీరు అప్రమత్తంగా ఉండాలి'

జ్వరం, జలుబు, గొంతు సమస్యలు పెరుగుతున్న తరుణంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1 కారణంగా కేసులు పెరుగుతున్నాయని, మాస్కులు ధరించి అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచించింది. చలి జ్వరం, జలుబుతో ఇబ్బంది పడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు, గర్భిణులు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని స్పష్టం చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు కడుక్కోవాలని, తప్పనిసరైతే ప్రయాణాలు చేయాలని పేర్కొంటున్నారు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాసలో ఇబ్బందులు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. పిల్లలు, వృద్ధులు ఉన్ని దుస్తులు ధరించాలని, ఇంటి లోపల వేడిగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. 

8 నెలల తర్వాత

తెలంగాణలో దాదాపు 8 నెలల తర్వాత గత మంగళవారం రాత్రి వైద్యారోగ్య శాఖ మరోసారి కొవిడ్ బులెటిన్ విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం 402 పరీక్షలు నిర్వహించగా, కొత్త కొవిడ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ 14 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనే ఎక్కువగా కేసులు నమోదు కావడంతో పలు గేటెడ్ కమ్యూనిటీల్లో మాస్కులు, శానిటైజేషన్లు మళ్లీ ప్రారంభించారు. అలాగే, పలు కార్పొరేట్ సంస్థలు సైతం తమ ఉద్యోగులను కొవిడ్ ప్రోటోకాల్ పాటించేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా అలర్ట్ చేస్తున్నాయి. అటు, నగరంలోని గాంధీ, నల్లకుంట ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులతో పాటు మరో 2 ఆస్పత్రుల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అవసరమైన పీపీఈ కిట్లు, డిస్పోజబుల్ బెడ్ షీట్లు, మాస్కులు, శానిటైజర్లు అన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

అయ్యప్ప భక్తులకు అలర్ట్

ప్రతిరోజూ భాగ్య నగరం నుంచి పలు రాష్ట్రాలకు రాకపోకలు సాగించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు రాకపోకలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ప్రయాణించే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏమాత్రం అనారోగ్య సూచనలున్నా ప్రయాణాలు మానుకోవాలని, వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేస్తున్నారు.

పడిపోతున్న ఉష్ణోగ్రతలు

మరోవైపు, రాష్ట్రంలో గత 3, 4 రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 13.90 డిగ్రీలు, ములుగు 14.40, వరంగల్ 13.50, హన్మకొండ 15, జనగామ 15.10, మహబూబాబాద్ జిల్లాలో 16.40 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాధారణం కంటే అన్ని జిల్లాల్లోనూ సగటున ఒకట్రెండు డిగ్రీలు తక్కువగా నమోదైనట్లు చెప్పారు. సాయంత్రం నుంచి ఉదయం వరకూ చలి గాలుల కారణంగా చాలామందిలో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. తేమ కారణంగా వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయి చాలామందిలో శ్వాస సంబంధిత సమస్యలు, గొంతు సంబంధిత సమస్యలు ఎక్కువయ్యాయి. అటు, పాడి పంటలకు సైతం చలి వాతావరణంతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. పాడి పశువుల్లోనూ పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు.

Also Read: Auxilo Finserve: దేశవ్యాప్తంగా 10 వేల విద్యాసంస్థలకు రుణాల జారీ లక్ష్యం: ఆక్సిలో ఫిన్‌సర్వ్‌

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Best Mileage Cars: మారుతి విటారా నుండి హోండా వరకు! భారత్‌లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే
మారుతి విటారా నుండి హోండా వరకు! భారత్‌లో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే
US Iran War Updates: పశ్చిమాసియాకు భారీగా చేరుకున్న అమెరికా సైన్యం.. ఏ క్షణంలోనైనా ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్ ?
పశ్చిమాసియాకు భారీగా చేరుకున్న అమెరికా సైన్యం.. ఏ క్షణంలోనైనా ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్ ?

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Embed widget