By: Ram Manohar | Updated at : 07 Dec 2022 02:58 PM (IST)
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ స్పందించారు.
Delhi MCD Election 2022:
కార్యకర్తలతో సరదాగా..
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని వెనక్కి నెట్టి మెజార్టీతో దూసుకుపోయింది. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ABP Newsతో మాట్లాడిన ఆయన...ఇది చాలా గొప్ప విజయం అని ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఢిల్లీ ప్రజల విజయం అని వ్యాఖ్యానించారు. ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ కార్యాలయానికి వెళ్లిన కేజ్రీవాల్..చాలా సంతోషంగా కనిపించారు. కార్లో నుంచే కార్యకర్తలను పలకరిస్తూ ఉత్సాహం నింపారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా స్పందించారు. "15 ఏళ్ల చెత్త పరిపాలనకు మేం స్వస్తి పలికాం" అంటూ బీజేపీకి చురకలు అంటించారు. అంతే కాదు. బీజేపీకి ప్రత్యామ్నాయం ఆప్ పార్టీయేనని స్పష్టం చేశారు. ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా ఆప్ విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వేదికగా స్పందించారు. "ఆమ్ ఆద్మీ పార్టీని నమ్మిన ఢిల్లీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పార్టీని (బీజేపీ) ఓడించి నిజాయతీ గల పార్టీకే అండగా నిలబడ్డారు" అని అన్నారు.
इस शानदार जीत के लिए दिल्ली की जनता का शुक्रिया और सबको बहुत-बहुत बधाई। अब हम सबको मिलकर दिल्ली को साफ़-स्वच्छ और सुंदर बनाना है। https://t.co/SFkqmrAI6i
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 7, 2022
दिल्ली MCD में आम आदमी पार्टी पर भरोसा करने के लिए दिल्ली की जनता का दिल से आभार…
— Manish Sisodia (@msisodia) December 7, 2022
दुनिया की सबसे बड़ी और सबसे नेगेटिव पार्टी को हराकर दिल्ली की जनता ने कट्टर ईमानदार और काम करने वाले @ArvindKejriwal जी को जिताया है.
हमारे लिए ये सिर्फ़ जीत नहीं बड़ी ज़िम्मेदारी है.
సంబరాలు..
మ్యాజిక్ ఫిగర్ 126 సీట్లు దాటడంతో ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర కోలాహలంగా ఉంది. మరోవైపు ఎంసీడీ చరిత్రలోనే అరుదైన సంఘటన జరిగింది. సుల్తాన్పురి-ఏ వార్డులో ఆప్ తరపున పోటీ చేసిన బోబి విజయం సాధించారు. దీంతో తొలిసారి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎంసీడీ సభ్యులుగా ఎన్నికైనట్లయింది. దిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ హర్షం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్ సర్వేలు MCD పీఠం ఆప్దేనని స్పష్టం చేశాయి. 15 ఏళ్లుగా భాజపా చేతిలోనే ఉన్న్ MCDని ఈసారి
ఆప్ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశాయి. 250 వార్డులకు గాను ఆప్ 155 వార్డుల్లో విజయం సాధిస్తుందని సర్వేలు తేల్చాయి.
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !
TS Minister KTR: నిధుల వరద పారిస్తా అన్నావ్ ! ఎన్ని పైసలు తెచ్చినవ్ ఈటల: మంత్రి కేటీఆర్ సెటైర్లు
Nizamabad News: దక్షిణ మధ్య రైల్వేలో నిజామాబాద్ జంక్షన్ కీలకం - కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా న్యాయం జరిగేనా!
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్గా భారతి హోళికేరి
Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !