అన్వేషించండి

Covid-19 India: భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా? ఆ అవసరం కనిపిస్తోందా?

Covid-19 India: భారత్‌లో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారా అన్న అంశం చర్చకు వస్తోంది.

Lockdown in India:

నిపుణులు ఏమంటున్నారు..

భారత్‌లోనూ కరోనా కేసులు బయట పడుతున్నాయి. ఈ క్రమంలోనే మళ్లీ ఆందోళన మొదలైంది. అయితే...కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై...నిపుణులు వివరణ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అలాంటి స్థితి ఇప్పుడు లేదని, ఎవరూ భయపడొద్దని సూచించారు. అలా అని ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. వివిధ దేశాల్లో కేసులు పెరుగుతున్నందున అక్కడిపరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఇక్కడా నిఘా పెంచాలని చెబుతున్నారు. సెకండ్‌ వేవ్‌లో లాగా...పెద్ద మొత్తంలో కరోనా బాధితులు ఆసుపత్రుల్లో చేరే అవకాశాలు తక్కువే అని అన్నారు. ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా మాటల్లో చెప్పాలంటే.."మొత్తంగా చూస్తే భారత్‌లో కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు, లాక్‌డౌన్‌లు అవసరం లేదు" అని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకూ ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే...వీలైనంత మేర వ్యాప్తిని అడ్డుకోవడమే ఉత్తమమన్న పాఠం నేర్చుకున్నామని గుర్తు చేశారు. "చైనాలో విస్తరిస్తున్న BF.7వేరియంట్ భారత్‌లోనూ వెలుగులోకి వచ్చింది" అని చెప్పారు. అయితే...వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తే పెద్ద ప్రమాదం ఏమీ ఉండదని అంటున్నారు నిపుణులు. ఇప్పటికే భారతీయుల్లోహైబ్రిడ్‌ ఇమ్యూనిటీ పెరిగిందని, అందుకే లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. 

విదేశీ ప్రయాణికులపై నిఘా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుక్ మాండవియా ఈ మేరకు అధికారిక ఓ ప్రకటన చేశారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరిగా RT PCR టెస్ట్‌లు చేయాలని ఆదేశించారు. అన్ని విమానాశ్రయాల్లోనూ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలున్నా...పాజిటివ్‌ అని తేలినా వెంటనే క్వారంటైన్‌ చేయాలని స్పష్టం చేశారు. ఈ దేశాల నుంచి వచ్చే వాళ్లు తప్పనిసరిగా Air Suvidh ఫామ్‌లలో ప్రస్తుత ఆరోగ్య స్థితికి సంబంధించిన అన్ని వివరాలు తెలియ జేయాలని కేంద్రం వెల్లడించింది. ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత, సరఫరాపై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. గతంలో వచ్చిన కరోనా వేవ్ లో ఆక్సిజన్ లభ్యత లేక, సరఫరా కొరత కారణంగా ఆసుపత్రుల్లో ఎంతో మంది కరోనా బాధితులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. చైనాలోని ఒక నగరంలో ప్రతిరోజు దాదాపు ఐదులక్షల మందికి కరోనా వ్యాపిస్తోందని, అక్కడి ప్రభుత్వం ప్రకటిస్తున్న నివేదికలలో తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఒక ఉన్నత ఆరోగ్య అధికారి తెలిపినట్లు ఏఎఫ్‌పీ వార్త సంస్థ పేర్కొంది.

Also Read: Isha Ambani: మనవడు మనవరాలికి గ్రాండ్ వెల్‌కమ్, అంబానీతో అట్లుంటది మరి - ఇది టీజర్ మాత్రమే

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chittoor Gun Fire: చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Railway Passengers Alert: సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మారిన నాలుగు రైళ్లు- అధికారుల ప్రకటన
Railway Passengers Alert: సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మారిన నాలుగు రైళ్లు- అధికారుల ప్రకటన
Borugadda Anil Kumar: హైకోర్టు సీరియస్, రాజమండ్రి జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్
హైకోర్టు సీరియస్, రాజమండ్రి జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్
Samantha: ఇండియాలో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు... సమంత ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?
ఇండియాలో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు... సమంత ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Gifts Gangajal to Mauritius President | మారిషస్ అధ్యక్షుడికి మోదీ విలువైన బహుమతులు | ABP DesamAdilabad Cement Industry Condition | అమిత్ షా హామీ గాల్లో కలిసిపోయిందా..అందుకే అమ్మేస్తున్నారా.? | ABP DesamJeedimetla Ramalingeswara Temple Issue | రామలింగేశ్వర స్వామి గుడిలో చోరీ..హిందూ సంఘాల ఆందోళన | ABP Desamleviathan Snake Mystery | లెవియాథాన్ నిజంగా ఉందా ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chittoor Gun Fire: చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Railway Passengers Alert: సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మారిన నాలుగు రైళ్లు- అధికారుల ప్రకటన
Railway Passengers Alert: సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మారిన నాలుగు రైళ్లు- అధికారుల ప్రకటన
Borugadda Anil Kumar: హైకోర్టు సీరియస్, రాజమండ్రి జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్
హైకోర్టు సీరియస్, రాజమండ్రి జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్
Samantha: ఇండియాలో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు... సమంత ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?
ఇండియాలో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు... సమంత ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?
Pakistan Train Hijack:104 మంది బందీలను కాపాడిన పాక్ ఆర్మీ, కాల్పుల్లో 16 మంది మిలిటెంట్లు హతం
104 మంది బందీలను కాపాడిన పాక్ ఆర్మీ, కాల్పుల్లో 16 మంది మిలిటెంట్లు హతం
Telugu TV Movies Today: చిరంజీవి ‘మృగరాజు’, పవన్ ‘బ్రో’ to ప్రభాస్ ‘సాహో’, ఎన్టీఆర్ ‘సాంబ’ వరకు - ఈ బుధవారం (మార్చి 12) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘మృగరాజు’, పవన్ ‘బ్రో’ to ప్రభాస్ ‘సాహో’, ఎన్టీఆర్ ‘సాంబ’ వరకు - ఈ బుధవారం (మార్చి 12) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Kerala Girl Dies After Water Fasting : డైట్ చేస్తూ బరువు తగ్గాలని ప్రయత్నించిన కేరళ యువతి మృతి.. ఆమె చేసిన బ్లండర్ మిస్టేక్స్ ఇవే, మీరు అస్సలు చేయకండి 
డైట్ చేస్తూ బరువు తగ్గాలని ప్రయత్నించిన కేరళ యువతి మృతి.. ఆమె చేసిన బ్లండర్ మిస్టేక్స్ ఇవే, మీరు అస్సలు చేయకండి 
Robinhood First Review: క్లీన్ కామెడీ, నో అసభ్యత, డబుల్ ఫన్... 'రాబిన్‌హుడ్‌'కు నితిన్ ఫస్ట్ రివ్యూ
క్లీన్ కామెడీ, నో అసభ్యత, డబుల్ ఫన్... 'రాబిన్‌హుడ్‌'కు నితిన్ ఫస్ట్ రివ్యూ
Embed widget