అన్వేషించండి

DMKతోనూ కాంగ్రెస్‌కి విభేదాలు? ఆ మంత్రి వ్యాఖ్యలతో దుమారం

INDIA Bloc: కాంగ్రెస్‌ పని అయిపోయిందంటూ డీఎమ్‌కే మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

INDIA Bloc Disputes: I.N.D.I.A కూటమిలోని ఒక్కో పార్టీ కాంగ్రెస్‌ వరుస పెట్టి విమర్శలు సంధిస్తున్నాయి. ఇప్పటికే జేడీయూ ఏకంగా బీజేపీతో పొత్తుకి సిద్ధమైంది. అటు ఆప్ కూడా కాంగ్రెస్‌కి దూరంగానే ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితీ ఇంతే. ఇప్పుడు మరో కీలక పార్టీ అయిన DMK కాంగ్రెస్‌పై అసహనం వ్యక్తం చేసింది. కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తోందంటూ డీఎమ్‌కే మంత్రి ఒకరు తీవ్ర విమర్శలు చేయడం సంచలనమవుతోంది. ఆ పార్టీకి మునుపు ఉన్న బలం లేదని, ఎప్పుడో బలహీనపడిపోయిందని స్పష్టం చేశారు డీఎమ్‌కే మంత్రి రాజా కన్నప్పన్. ఇది కేవలం ఆయన ఒక్కరి అభిప్రాయమా..? లేదంటే నిజంగానే డీఎమ్‌కే, కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తాయా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. 

"కాంగ్రెస్ కేవలం తన స్వార్థమే చూసుకుంటోంది. కేవలం సీట్‌లు గెలుచుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీని నడుపుతోంది. దీని వల్ల ఏం ఉపయోగం..? ఓ ఐడియాలజీతో ఉండాలి. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఏమీ లేకుండా పోటీ చేస్తానంటే ఎలా..? ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఆ పార్టీకి అన్నీ గుర్తొస్తాయి. ఈ ఫార్ములా పెద్దగా వర్కౌట్ అవ్వదు. ప్రజలు కూడా హర్షించరు. బీజేపీ చాలా చరిత్ర ఉన్న పార్టీయే కావచ్చు. కానీ అప్పటంత బలం ఇప్పుడు లేదు"

- రాజా కన్నప్పన్, డీఎమ్‌కే మంత్రి

స్టాలిన్ ఏమంటున్నారు..?

అటు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎమ్‌కే చీఫ్ ఎమ్‌కే స్టాలిన్ మాత్రం కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఎవరూ కూటమిలో అనవసరమైన విభేదాలు సృష్టించొద్దని నేతలకు సూచిస్తున్నారు. దీని వల్ల ఓట్లు చీలిపోయి బీజేపీకే మేలు జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. 

దూరం..దూరం..

సీట్ల కేటాయింపు(Seats allocation) అంశం మా వ్య‌క్తిగ‌తం. వేరే పార్టీ వారు మాకు ఆఫ‌ర్ ఇవ్వ‌డం ఎందుకు?  మాతో చ‌ర్చిస్తే అప్పుడు ఆలోచిస్తాం అని ఇప్పటికే మ‌మ‌తా బెన‌ర్జీ(Mamatha benarjee) తెగేసి చెప్పారు. అనంత‌రం వెంట‌నే ఆమె మాట మార్చి.. తాము ఒంట‌రిగానే బ‌రిలో దిగుతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. కాగా, బెంగాల్‌ రాష్ట్రంలో మొత్తం 47 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో క‌నీసం 10 స్థానాల్లో పోటీ చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ, మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం రెండు క‌న్నా ఎక్కువ సీట్లు ఇచ్చే ప‌రిస్థితి లేదు. దీంతో ఈ దిశగా కొన్నాళ్ల నుంచి వివాదం ర‌గులుతూనే ఉంది. ఇప్పుడు ఈ వివాదం  మ‌రింత పెరిగి, చివ‌ర‌కు సీఎం బెన‌ర్జీ ఒంట‌రి పోరును ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఇండియా కూట‌మిలో ఉన్న మ‌రో పార్టీ  ఆమ్ ఆద్మీ(Aaam Aaadmi Party). ఢిల్లీ(Delhi), పంజాబ్‌(Punjab)ల‌లో అధికారంలో ఉన్న ఈ పార్టీ కూడా తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్(Bhagawanth mann) సీట్ల షేరింగ్‌పై మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 పార్ల‌మెంటు స్థానాల్లోనూ తామే(ఆప్) ఒంట‌రిగా పోటీ చేయ‌నున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ కూడా తుది ద‌శ‌కు చేరుకుంద‌ని సీఎం మాన్ చెప్పారు.

Also Read: Lok Sabha Election 2024: హ్యాట్రిక్‌పై గురి పెట్టిన మోదీ షా, రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ల నియామకం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Harish Rana Final Video: భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
భారత్‌లో తొలి కారుణ్య మరణం.. కంటతడి పెట్టిస్తున్న హరీష్ రాణా చివరి వీడియో
AP School Timings: ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
ఏపీలో రేపట్నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ లేటెస్ట్ అప్డేడ్
FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget