By: ABP Desam | Updated at : 04 Dec 2022 11:20 AM (IST)
Edited By: Murali Krishna
(Image Source: PTI) ( Image Source : PTI )
Rahul Gandhi on BJP: 'భారత్ జోడో యాత్ర'కు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అధికార భాజపాపై విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, ఎల్పీజీ ధరలు తగ్గినప్పటికీ భారత్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధర ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నించారు.
గ్లోబల్ ఎల్పీజీ, ముడి చమురు ధరలు వరుసగా 40%, 25% తగ్గాయి. అయితే దేశంలో మాత్రం ధరలు అలాగే ఉన్నాయని రాహుల్ గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు.
कच्चा तेल - 25% सस्ता
एलपीजी - 40% सस्ती
ये 6 महीनों के अंतरराष्ट्रीय कीमतों के आंकड़े हैं। फिर भी पेट्रोल, डीज़ल और गैस सिलेंडर के दाम कम क्यों नहीं हुए?
प्रधानमंत्री जी, आपके 'लूट-तंत्र' के खिलाफ लोकतंत्र की आवाज़ है - भारत जोड़ो यात्रा। जवाब दीजिए! — Rahul Gandhi (@RahulGandhi) December 3, 2022
ఇంధన ధరలపై రాహుల్ గాంధీ గురువారం కూడా ప్రభుత్వంపై దాడి చేశారు. ప్రజలు అధిక ద్రవ్యోల్బణంతో బాధపడుతున్నారని, ప్రధానమంత్రి పన్నుల నుంచి డబ్బును తిరిగి పొందడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు.
జోడో యాత్ర
సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఇంకా 2,355 కి.మీ సాగనుంది. మొత్తం 3,570 కిలోమీటర్ల పాటు ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్ర వచ్చే ఏడాది కశ్మీర్లో ముగుస్తుంది. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని సుదీర్ఘ పాద యాత్ర ఇదే అని కాంగ్రెస్ పేర్కొంది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో రాబోయే ఎన్నికల్లో గట్టిగా పోరాడేందుకు, పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు ఈ యాత్రను కాంగ్రెస్ నమ్ముకుంది. యాత్ర 87వ రోజుకు చేరుకుంది. మధ్యప్రదేశ్లో ఈ రెండు రోజులతో యాత్ర పూర్తవుతుంది. నవంబర్ 23న మధ్యప్రదేశ్లో ప్రవేశించిన యాత్ర 12 రోజుల్లో రాష్ట్రంలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తుంది.
భారత్ జోడో యాత్ర ఇప్పటివరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేసింది. డిసెంబర్ 5న రాజస్థాన్లోకి ప్రవేశించనుంది.
Also Read: బుధవారం నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్ - కేంద్రాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ వ్యూహాలివే
Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల
Telangana Budget 2023: అభివృద్ధిలో దేశానికే ఆదర్శం నా తెలంగాణ- బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ తమిళిసై
US - China: అమెరికా ఎయిర్ బేస్లో చైనా స్పై బెలూన్, అలెర్ట్ అయిన అగ్రరాజ్యం
ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న తెలంగాణ గవర్నర్
Air India Express flight: ఎయిర్ ఇండియా ఫ్లైట్లో మంటలు, టేకాఫ్ అయిన కాసేపటికే ల్యాండింగ్
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Hanuma Vihari: శెబ్బాష్ హనుమ విహారీ! మణికట్టు విరిగినా ఆంధ్రా కోసం బ్యాటింగ్ చేశాడు!
Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!