అన్వేషించండి

బుధవారం నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్ - కేంద్రాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ వ్యూహాలివే

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల , ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు అంశం వంటి అనేక అంశాలపై కేంద్రాన్ని నిలదియ్యాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో శీతాకాల సమావేశాల్లో తాము లేవనెత్తాల్సిన అంశాలపై కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు అంశం వంటి అనేక అంశాలపై కేంద్రాన్ని నిలదియ్యాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.

కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తమ పార్టీ లేవనెత్తే అంశాలను తెలిపారు. అంతకంతకూ పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల , ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడం వంటి అనేక అంశాలపై కేంద్రాన్ని నిలదియ్యాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని జైరాం రమేష్ వెల్లడించారు.

సోనియా గాంధీ నివాసంలో సమావేశం
త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వారు అనుసరించాల్సిన వ్యూహాలను, లేవనెత్తాల్సిన అంశాల గురించి నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ ఇంట్లో శనివారం సమావేశం అయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ మాట్లాడుతూ " కాంగ్రెస్ కుల గణనకు మద్దతుగా ఉంది, గణన చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి  మాట్లాడుతున్నారు. ఐదు మంది సభ్యుల ధర్మాసనంలో ముగ్గురు మద్దతు ఇవ్వగా, ఇద్దరు వ్యతిరేకించారు. దీనిపై సభలో చర్చకు మేము పట్టుపడతాం. ఈ సమావేశాల్లో జరగనున్న చర్చల్లో నిరుద్యోగం, రైతులకు కనీస మద్దతు ధర, ధరల పెరుగుదల, సైబర్ క్రైమ్, రూపాయి పతనం, తక్కువ ఎగుమతులు, ఉత్తర భారతదేశంలో వాయు కాలుష్యము వంటి అనేక విషయాలు గురించి చర్చించాం" అని తెలిపారు.

ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
గుజరాత్ ఎన్నికల షెడ్యూల్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల నిర్వహణ కారణంగా ఒక నెల ఆలస్యంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఒక రోజు ముందే ఈ బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలు డిసెంబర్ 29 వరకు జరగనున్నాయి. మధ్య భారత్ నుంచి ఉత్తర భారతదేశం వైపూ సాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. కనుక రాహుల్ తో పాటు ఆయన వెంట భారత్ జోడో యాత్రలో పాల్గొనే కొందరు నేతలు ఈ సమావేశాలలో పాల్గొనడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సిన నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం కాకపోవడంతో పాత పార్లమెంట్ భవనంలోనే ఈ సమావేశాలు జరగనున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Telugu TV Movies Today: సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Telugu TV Movies Today: సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
సోమవారం స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Embed widget