అన్వేషించండి

Rahul Gandhi: బీజేపీలో అంతా గులాం గిరీనే, బీజేపీ ఎంపీనే నాతో అన్నారు - రాహుల్ కీలక వ్యాఖ్యలు

Congress Rally: కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు (డిసెంబర్ 28) ఆర్‌ఎస్‌ఎస్ కంచుకోట అయిన నాగ్‌పుర్‌లో కాంగ్రెస్ భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించింది.

Congress 139th Foundation Day Nagpur Meeting: కాంగ్రెస్ పార్టీ 2024 లోక్ సభ ఎన్నికల కోసం రణభేరి మోగించింది. ‘ఎన్నికలకు మేం రెడీగా ఉన్నాం’ అని నాగ్ పుర్ వేదికగా రాహుల్ గాంధీ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు (డిసెంబర్ 28) ఆర్‌ఎస్‌ఎస్ కంచుకోట అయిన నాగ్‌పుర్‌లో (Nagpur) కాంగ్రెస్ భారీ ర్యాలీ (Congress Rally), బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో మాట్లాడిన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ బీజేపీ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చాలా మంది బీజేపీ ఎంపీలు తమను కలుస్తున్నారని.. తమ బాధను చెప్పుకుంటున్నారని అన్నారు.

బీజేపీలో బానిసత్వం - రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘బీజేపీలో బానిసత్వం సాగుతోందని ఓ బీజేపీ నేత నాతో చెప్పారు. మా మాట ఎవరూ వినరు, కాంగ్రెస్ లో అయితే, ఎవరైనా సీనియర్ నాయకుడితో తన అభిప్రాయాలను పంచుకోవచ్చు. దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు మన అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి కాంగ్రెస్ లో మనకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని ఆ బీజేపీ నేత నాతో అన్నారు’’ అని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.


Rahul Gandhi: బీజేపీలో అంతా గులాం గిరీనే, బీజేపీ ఎంపీనే నాతో అన్నారు - రాహుల్ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం

కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. ఏ కాంగ్రెస్ నాయకుడైనా కార్యకర్తలు అయినా నాతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వారు చెప్పేది నాకు నచ్చకపోతే, నేను కచ్చితంగా వారితో ఏకీభవించను. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల గొంతులను మేం అణచివేయము.

దేశంలో రెండు సిద్ధాంతాల పోరు

దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరు నడుస్తోంది. ఇది రాజకీయం కాదు, అధికారం కోసం పోరాటం. ప్రజలు న్యాయం, అన్యాయం మధ్య ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యానికి బదులుగా, రాజుల మాదిరిగా ఆదేశాలు ఇచ్చే సంప్రదాయం దేశంలో ఉంది.

ప్రశ్నలు అడిగిన తర్వాత పటోలేను తోసేశారు

రాహుల్ గాంధీ మాట్లాడుతూ, 'మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే జీఎస్టీపై ప్రధాని మోదీని ఒక ప్రశ్న అడిగారు. ఆ తర్వాత పటోలే ఔటయ్యారు. ఇది అతని వేదన. ప్రశ్నలు అడిగే ఏ నాయకుడూ బీజేపీ అధిష్ఠానానికి నచ్చరు. ఎవరి సలహాలు మోదీకి నచ్చవు. వారికి అవును అని మాత్రమే చెప్పే వ్యక్తులను మాత్రమే మోదీ, అమిత్ షా ఇష్టపడతారు. నోరెత్తే వారికి బీజేపీలో స్థానం లేదు’’ అని రాహుల్ గాంధీ మాట్లాడారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Embed widget