అన్వేషించండి

CM Jagan: వైఎస్సార్ సున్నా వడ్డీ నిధుల విడుదల - చంద్రబాబుకు సెక్యూరిటీ ఎందుకని జగన్ ప్రశ్న

CM Jagan: రాష్ట్రంలోని కోటి 5 లక్షల మంది అక్కచెల్లమ్మలకు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా లబ్ధి చేకూర్చామని సీఎం జగన్ వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థఆయిలో విమర్శలు చేశారు.

CM Jagan: దేవుడి దయ వల్ల ఈరోజు మహిళలకు మంచి చేసే వైఎస్సార్ సున్నా వడ్డీ నిధుల విడుదల కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బటన్ నొక్కి మరీ నిధులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.1,353.76 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. నాలుగో విడదల నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడారు. అక్కచెల్లెమ్మల సాధికారిత కోసం అడుగులు వేశామన్నారు. కోటి 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కల్గుతుందన్నారు. గత ప్రభుత్వంలో అక్క, చెల్లమ్మలను మోసం చేశారని.. 14 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారని అన్నారు. గత సర్కారు బకాయిలు పెట్టి డబ్బును తాము చెల్లించామని చెప్పారు. చంద్రబాబు వల్ల అనేక మంది అమాయకలు మోసపోయారని ఆరోపించారు. 

వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు దిక్కు తోచడం లేదని.. వారి మైండ్ లో ఫ్యూజులు ఎగిరిపోయాయంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు 2016లో చంద్రబాబు సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు మోసానికి ఏ, బీ గ్రేడ్ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్ కు దిగజారాయన్నారు. ఇంత మంచి పథకాలను గత ప్రభుత్వలా హయాంలో అసలు చూసైనా ఉండరని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక న్యాయం ఉందని అని ప్రశ్నించారు. మీ బిడ్డల భవిష్యత్ గురించి ఏనాడైనా ఆలోచించారా అని అడిగారు. అలాగే పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం బడులు పెడితే అడ్డుకోవాలని చూశారని, పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే కూడా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన మోసాలు, వెన్నుపోటులే గుర్తొస్తాయి తప్పితే.. ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని చెప్పారు. బాబు కోసం ఆయన దత్తపుత్రుడు పరుగులు పెడుతున్నాడని విమర్శించారు. 

చంద్రబాబు గనుక మరోసారి సీఎం అయితే ప్రజలకు ఏమాత్రం మంచి జరగదని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు తనకు గిట్టని వారి అంతు చూస్తారని, అందుకే ఆయనకు అధికారం ఇవ్వాలని కోరుతున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు దళితులను చీల్చి వారికి నరకం చూపించారన్నారు. మైనార్టీల ఓటు బ్యాంకు కోసం వారికి నరకం చూపిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎస్టీలకు చంద్రబాబు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు బెదిరించారన్నారు. అలాగే మొన్నటి పుంగనూరు ఘటన గురించి తెలిసి తాను చాలా బాధ పడినట్లు వెల్లడించారు. ఇలాంటి రాక్షసులకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలనిపించిందని చెప్పారు. ఒక రూట్ లో పర్మిషన్ తీసుకొని ఇంకో రూట్ లో వెళ్లాల్సిన అవసరం ఏంటని సీఎం జగన్ ప్రశ్నించారు. 47 మంది పోలీసులకు గాయాలు అయ్యేలా చేశారని.. ఓ పోలీసు అయితే కన్నే పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శవ రాజకీయాలకు సైతం చంద్రబాబు వెనుకాడడం లేదని రాబోయే రోజుల్లో నీచ రాజకీయాలు ఎక్కువ చేస్తారని ఆరోపించారు. మీ జీవితాలు, మీ బిడ్డల జీవితాలు ఏమాత్రం బాగుండాలనుకున్న చంద్రబాబుకు ఓటు వేయొద్దని వివరించారు. 

పేద అక్కచెల్లెమ్మలకు సాధికార కల్పిస్తూ, వారు చేస్తున్న వ్యాపారాలకు చేయూతనిచ్చేలా సున్నా వడ్డీకే రుణాలు అందించి, వారి జీవన ప్రమాణాలు తమ సర్కారు మెరుగు పరుస్తుందని చెప్పుకొచ్చారు. అమలాపురం చేరుకున్న సీఎం జగన్.. వైఎస్ఆర్ సున్నా వడ్డీ జమ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు అనంతరం సున్నావడ్డీ పథకం లబ్ధిదారులతో కలిసి ఫొటో దిగారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy To Delhi :  ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ - ఈ సారైనా కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా ?
ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ - ఈ సారైనా కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Case Against Nagarjuna : నాగార్జునకు వరుస సమస్యలు -  మాదాపూర్‌ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
నాగార్జునకు వరుస సమస్యలు - మాదాపూర్‌ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
Tomato And Onion Price:సెంచరీ కొట్టిన టమాటా- అదే బాటలో ఉల్లి- బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు 
సెంచరీ కొట్టిన టమాటా- అదే బాటలో ఉల్లి- బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy To Delhi :  ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ - ఈ సారైనా కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా ?
ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ - ఈ సారైనా కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Case Against Nagarjuna : నాగార్జునకు వరుస సమస్యలు -  మాదాపూర్‌ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
నాగార్జునకు వరుస సమస్యలు - మాదాపూర్‌ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
Tomato And Onion Price:సెంచరీ కొట్టిన టమాటా- అదే బాటలో ఉల్లి- బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు 
సెంచరీ కొట్టిన టమాటా- అదే బాటలో ఉల్లి- బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు 
VD12 Movie: సెట్స్‌లో ఏనుగుల బీభత్సం... కేరళలో విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ క్యాన్సిల్
సెట్స్‌లో ఏనుగుల బీభత్సం... కేరళలో విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ క్యాన్సిల్
Family Digital Card : తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
తెలంగాణలో తీసుకొస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా ఉంటుంది? అందులో ఏ వివరాలు ఉంటాయి?
East Godavari: తూర్పుగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు స్పెషల్ సర్వీస్‌లు- ప్రత్యేక బస్‌లు వేసిన ఏపీఎస్ఆర్టీసీ
తూర్పుగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు స్పెషల్ సర్వీస్‌లు- ప్రత్యేక బస్‌లు వేసిన ఏపీఎస్ఆర్టీసీ
Lava AGNI 3 5G: రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ - లావా అగ్ని 3 5జీ వచ్చేసింది!
రూ.20 వేలలో బెస్ట్ ఫోన్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ - లావా అగ్ని 3 5జీ వచ్చేసింది!
Embed widget