అన్వేషించండి

Chittoor News: 8 కిలోల వెండి, కిలో బంగారంతో అయోధ్య రాముడికి పాదుకలు - కాణిపాకంలో ప్రత్యేక పూజలు

Chittoor News: అయోధ్య రాముడి కోసం 8 కిలోల వెండి, కిలో బంగారంతో తయారు చేసిన పాదుకలకు కాణిపాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Chittoor News: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో అయోధ్య రాముల వారి పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్ కు చెందిన చల్లా  శ్రీనివాసులు అయోధ్య రాముల వారికి 8 కిలోల వెండి, కిలో బంగారంతో పాదుకలు తయారు చేయించారు. సుమారు 44 లక్షల రూపాయలతో తయారు చేయించిన వెండి, బంగారు పాదకవచాలకు అయోధ్యలో 41 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేశంలోని ప్రసిద్ధి పుణ్య క్షేత్రాల్లో వాటికి పూజలు చేయిస్తున్నారు. అందులో  భాగంగా ఆంధ్రప్రదేశ్ చిత్తూరులోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అయోధ్య రామమందిర నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఆ వెండి, బంగారు పాదుకలను తిరిగి రామమందిరంలో భక్తుల సందర్శనార్థం ఉంచనున్నట్లు దాత హైదరాబాద్ కు చెందిన చల్లా శ్రీనివాసులు తెలిపారు. 

44 లక్షల విలువైన పాదుకలు విరాళం

" 8 కిలోల వెండితో రాముల వారికి ప్రత్యేక పాదుకలు చేయించాం. ఆ పాదుకలకు కిలో బంగారంతో కవచం చేయించాం. వెండికి 8 లక్షల రూపాయలు, కిలో బంగారానికి 36 లక్షల రూపాయలు అయింది. మొత్తం 44 లక్షల రూపాయల అయింది. ఈ పాదుకలను మొదట అయోధ్యలోని రామ మందిరంలో ఉంచి 41 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించాం. తర్వాత దేశంలోని ప్రముఖ దైవ పుణ్యక్షేత్రాల్లో పాదుకలకు ప్రత్యేక పూజలు చేయిస్తున్నాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో రామ పాదకవచాలకు పూజలు నిర్వహించాం. దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసిన అనంతరం, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత వెండి, బంగారు పాదుకలను భక్తుల సందర్శనార్థం ఉంచనున్నాం.  అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి గతంలో నాలుగు వెండి బిస్కెట్లు విరాళంగా అందించాం." - చల్లా శ్రీనివాసులు

అయోధ్య రామమందిర నిర్మాణం కోసం గత సంవత్సరం విరాళాల సేకరణ ప్రారంభించారు. దాదాపు నెల రోజుల విరాళాల సేకరణ జరగ్గా అంతకంటే ముందే శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ లక్ష్యాన్ని చేరుకుంది. దేశవ్యాప్తంగా నిరుపేదల నుండి స్థితిమంతుల వరకు విరాళాలు ఇచ్చారు. అలా రూ. 1.511 కోట్ల విరాళాలు సేకరించింది ట్రస్ట్. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాలను సందర్శించి, ప్రజల నుండి విరాళాలను సేకరించాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. విరాళాల సేకరణ ప్రారంభమైన తర్వాత కేవలం 25 రోజుల్లో రూ.1,000 కోట్ల మార్క్ చేరుకుంది. మొత్తం 1.50 లక్షల మంది వీహెచ్పీ కార్యకర్తలు ఈ విరాళాల సేకరణలో భాగస్వాములు అయ్యారు. సేకరించిన విరాళాలను డిపాజిట్ చేసే బాధ్యతను 35 మంది వాలంటీర్లకు అప్పగించారు. మారుమూల పల్లెలకు సైతం వీహెచ్పీ కార్యకర్తలు వెళ్లి విరాళాలు సేకరించారు. 

ఇక 2019 నవంబరులో సుప్రీం కోర్టు తీర్పుతో అయోధ్లో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది. ఫిబ్రవరి 2020లో ఆలయ ట్రస్ట్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతేడాది ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Asaduddin Owaisi vs Raja singh | బీఫ్ షాపు జిందాబాద్ అన్న ఓవైసీ.. ఫైర్ అవుతున్న రాజాసింగ్ | ABPJagapathi Babu on Vijayendra Prasad | Ruslaan మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో జగపతిబాబు | ABP DesamThatikonda Rajaiah on Kadiyam Srihari | కడియం శ్రీహరిపై తీవ్రపదజాలంతో రాజయ్య ఫైర్ | ABP DesamNimmakayala Chinarajappa Interview | ఉభయ గోదావరిలో కూటమిదే క్లీన్ స్వీప్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
War 2 Update: 'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
Tillu Square OTT Release Date: టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
KL Rahul Comments On Dhoni: ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో
ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో "కేక్‌" వాక్ చేసిన రాహుల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Andhra Pradesh News: ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
Embed widget