అన్వేషించండి

నెల్లూరు బాధితురాలికి చంద్రబాబు ఫోన్- సీన్‌లోకి లోకేష్!

ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు టీడీపీ నేతలు. బాధిత కుటుంబంతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. వారికి అండగా నిలబడతామని చెప్పారు. 

నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరు దళితవాడకు చెందిన దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన చావుకి కారణం వైసీపీ నేతలే అంటూ ఆయన సూసైడ్ లెటర్ రాసి మరీ చనిపోయాడు. ఆ కుటుంబానికి టీడీపీ అండగా నిలిచింది. కరుణాకర్  మృతదేహానికి టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు నివాళులు అర్పించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు టీడీపీ నేతలు. బాధిత కుటుంబంతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. వారికి అండగా నిలబడతామని చెప్పారు. 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నేతలు..

బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ నాయకులు ఎమ్మెస్ రాజు కావలి వచ్చారు. కరుణాకర్ చేపలు సాగు చేసిన చెరువును ఎమ్మెస్ రాజు సందర్శించారు. కరుణాకర్ ఆర్థికంగా నష్టపోయి బలవన్మరణానికి కారణమైన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డిని అరెస్టు చేయాలని డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. కాసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. అనంతరం అధికారులు 24 గంటల్లోగా నిందితుల్ని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించిన ఎమ్మెస్ రాజు, తదితరులు.. అక్కడినుంచి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. 


నెల్లూరు బాధితురాలికి చంద్రబాబు ఫోన్- సీన్‌లోకి లోకేష్!

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బిడ్డల ప్రాణాలు అకారణంగా గాల్లో కలిసి పోతున్నాయని ఆరోపించారు ఎమ్మెస్ రాజు. వైసీపీ నాయకుల దాష్టీకాన్ని తట్టుకోలేక తాను చనిపోతున్నానని సూసైడ్ నోట్ లో కరుణాకర్ రాసినా కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం వైసీపీ నేతలు కావడం వల్లనే పోలీసులు వారిని వదిలిపెట్టారని అన్నారు. ఎస్సీ కమిషన్ కూడా ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉందని విమర్శించారు. పోలీసులు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం అని అన్నారు. ఛలో కావలి కార్యక్రమం మొదలు పెడతామన్నారు. నారా లోకేష్ ఈ కార్యక్రమానికి వస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా దళితుల ఐక్యత ఏంటో చూపిస్తామన్నారు. 

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి..

కావలి నియోజకవర్గంలో జగనన్న కాలనీల కోసం.. తన సొంత భూమిని ఐదురెట్ల ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మేశారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కూడా టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఇటీవల ఎన్టీఆర్ విగ్రహం మెడకు తాడు కట్టి లాగిన ఘటనలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రధాన ముద్దాయి అని, ఇప్పుడు దళిత యువకుడి ఆత్మహత్యకు కూడా అతనే కారణం అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కేతిరెడ్డికి బదులు చెబుతామన్నారు. 

పరారీలో ఉన్న నిందితులు..!

నెల్లూరు జిల్లా దళిత యువకుడి ఆత్మహత్య ఘటన రెండురోజుల్లోనే మరింత సంచలనంగా మారింది. వైసీపీ నేతలకు ఆత్మహత్యతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు సూసైడ్ లెటర్ బయట పడటంతో కేసు విషయంలో ఎటూ తేల్చలేకపోతున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు పోలీసులు. వారికోసం గాలింపు చేపట్టినట్టు పేర్కొన్నారు.. అదే సమయంలో పోలీసులే నిందితుల్ని తప్పించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు వైసీపీ నేతలు మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. సూసైడ్ లెటర్ లో పేర్లు ఉన్న నాయకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Ind vs Eng 2nd Semi Final: సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India vs England 2nd Semi Final: ఇంగ్లాండ్‌ వర్సెస్ భారత్ ప్లేయింగ్ ఎలెవన్, పిచ్ రిపోర్ట్.. ఆ 5 ప్లేయర్లతో డేంజర్!
ఇంగ్లాండ్‌ వర్సెస్ భారత్ ప్లేయింగ్ ఎలెవన్, పిచ్ రిపోర్ట్.. ఆ 5 ప్లేయర్లతో డేంజర్!

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Eng 2nd Semi Final: సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
Mrithyunjay OTT : మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Speaker chit chat: వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
Embed widget