అన్వేషించండి

నెల్లూరు బాధితురాలికి చంద్రబాబు ఫోన్- సీన్‌లోకి లోకేష్!

ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు టీడీపీ నేతలు. బాధిత కుటుంబంతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. వారికి అండగా నిలబడతామని చెప్పారు. 

నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరు దళితవాడకు చెందిన దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన చావుకి కారణం వైసీపీ నేతలే అంటూ ఆయన సూసైడ్ లెటర్ రాసి మరీ చనిపోయాడు. ఆ కుటుంబానికి టీడీపీ అండగా నిలిచింది. కరుణాకర్  మృతదేహానికి టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎమ్మెస్ రాజు నివాళులు అర్పించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు టీడీపీ నేతలు. బాధిత కుటుంబంతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. వారికి అండగా నిలబడతామని చెప్పారు. 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నేతలు..

బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ నాయకులు ఎమ్మెస్ రాజు కావలి వచ్చారు. కరుణాకర్ చేపలు సాగు చేసిన చెరువును ఎమ్మెస్ రాజు సందర్శించారు. కరుణాకర్ ఆర్థికంగా నష్టపోయి బలవన్మరణానికి కారణమైన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, సురేష్ రెడ్డిని అరెస్టు చేయాలని డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. కాసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. అనంతరం అధికారులు 24 గంటల్లోగా నిందితుల్ని పట్టుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించిన ఎమ్మెస్ రాజు, తదితరులు.. అక్కడినుంచి బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. 


నెల్లూరు బాధితురాలికి చంద్రబాబు ఫోన్- సీన్‌లోకి లోకేష్!

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బిడ్డల ప్రాణాలు అకారణంగా గాల్లో కలిసి పోతున్నాయని ఆరోపించారు ఎమ్మెస్ రాజు. వైసీపీ నాయకుల దాష్టీకాన్ని తట్టుకోలేక తాను చనిపోతున్నానని సూసైడ్ నోట్ లో కరుణాకర్ రాసినా కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం వైసీపీ నేతలు కావడం వల్లనే పోలీసులు వారిని వదిలిపెట్టారని అన్నారు. ఎస్సీ కమిషన్ కూడా ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉందని విమర్శించారు. పోలీసులు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం అని అన్నారు. ఛలో కావలి కార్యక్రమం మొదలు పెడతామన్నారు. నారా లోకేష్ ఈ కార్యక్రమానికి వస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా దళితుల ఐక్యత ఏంటో చూపిస్తామన్నారు. 

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి..

కావలి నియోజకవర్గంలో జగనన్న కాలనీల కోసం.. తన సొంత భూమిని ఐదురెట్ల ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మేశారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కూడా టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఇటీవల ఎన్టీఆర్ విగ్రహం మెడకు తాడు కట్టి లాగిన ఘటనలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రధాన ముద్దాయి అని, ఇప్పుడు దళిత యువకుడి ఆత్మహత్యకు కూడా అతనే కారణం అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కేతిరెడ్డికి బదులు చెబుతామన్నారు. 

పరారీలో ఉన్న నిందితులు..!

నెల్లూరు జిల్లా దళిత యువకుడి ఆత్మహత్య ఘటన రెండురోజుల్లోనే మరింత సంచలనంగా మారింది. వైసీపీ నేతలకు ఆత్మహత్యతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు సూసైడ్ లెటర్ బయట పడటంతో కేసు విషయంలో ఎటూ తేల్చలేకపోతున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు పోలీసులు. వారికోసం గాలింపు చేపట్టినట్టు పేర్కొన్నారు.. అదే సమయంలో పోలీసులే నిందితుల్ని తప్పించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు వైసీపీ నేతలు మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. సూసైడ్ లెటర్ లో పేర్లు ఉన్న నాయకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MLA Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
Pawan Kalyan:  అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
Jubilee Hills by-election : 42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
Delhi Blast case : ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
Advertisement

వీడియోలు

Proud India | భారతదేశంపై అమెరికా అక్కసు వెనక కారణం ఇదే | ABP Desam
Jubilee Hills By Election Counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ కు భారీ భద్రత ! | ABP Desam
రోహిత్, కోహ్లీల కెరీర్‌లో విలన్‌గా మారిన బీసీసీఐ!
సంజూ కోసం జడ్డూని వదిలేస్తారా? CSKకి పిచ్చి పట్టింది: శడగొప్పన్ రమేష్
నితీష్‌కి బీసీసీఐ అన్యాయం.. మండిపడుతున్న తెలుగు ఫ్యాన్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Defection: ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
ఫిరాయింపు ఎమ్మెల్యేపై కోల్‌కతా హైకోర్టు అనర్హతా వేటు - తెలంగాణలో ఆ పది మందికి కొత్త టెన్షన్ !
Pawan Kalyan:  అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
Jubilee Hills by-election : 42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
42 టేబుల్స్‌, 10 రౌండ్‌లు- జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి- మధ్యాహ్నానికి ప్రక్రియ పూర్తి 
Delhi Blast case : ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
Pawan Kalyan vs Mithun Reddy: డిప్యూటీ సీఎం పవన్‌కు మిథున్ రెడ్డి ఘాటు హెచ్చరిక - క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు
డిప్యూటీ సీఎం పవన్‌కు మిథున్ రెడ్డి ఘాటు హెచ్చరిక - క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు
America shutdown ends:  43 రోజుల కష్టాలకు చెక్ -  అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ తాత్కాలిక ముగింపు - ట్రంప్ సంతకం పూర్తి
43 రోజుల కష్టాలకు చెక్ - అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్‌ తాత్కాలిక ముగింపు - ట్రంప్ సంతకం పూర్తి
Alluri Seetharamaraju district: ఊరికి స్కూల్ వచ్చిందని గిరిజనులు ఉత్సాహం- థింసా నృత్యాలతో సంబరాలు- అధికారులకు సన్మాం చేసిన ఆదివాసీలు!
ఊరికి స్కూల్ వచ్చిందని గిరిజనులు ఉత్సాహం- థింసా నృత్యాలతో సంబరాలు- అధికారులకు సన్మాం చేసిన ఆదివాసీలు!
Red Fort Blasts Conspiracy: 32 వాహనాలతో భారీ విధ్వంసానికి ప్లాన్! ఉగ్రవాదుల పాత్ర, రహస్యాలు బయటపెట్టిన దర్యాప్తు అధికారులు
32 వాహనాలతో భారీ విధ్వంసానికి ప్లాన్! ఉగ్రవాదుల పాత్ర, రహస్యాలు బయటపెట్టిన దర్యాప్తు అధికారులు
Embed widget