అన్వేషించండి

Ration Card Latest News: రేషన్ కార్డుదారులకు బిగ్‌ షాక్- అలాంటి వారికి రేషన్ లేనట్టే

Ration Card Latest News: రేషన్‌కార్డుదారుల్లో అనర్హుల గుర్తింపుపై కేంద్రం దృష్టి పెట్టింది. ఆదాయపన్ను కట్టేవారిని తొలగించాలని నిర్ణయించింది. ఐటీశాఖ నుంచి వివరాలు సేకరిస్తోంది.

Ration Card Latest News: నకిలీ రేషన్‌కార్డులు ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. అల్పాదాయ వర్గాల(BPL)కు మాత్రమే చెందాల్సిన రాయితీ బియ్యం, సరుకులు పక్కదారి పడుతున్నాయని భావించిన ప్రభుత్వం...ముందుగా  నకిలీకార్డుదారులను ఏరివేయాలని నిర్ణయించింది.అందులో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(PMGKAY) లబ్ధిదారుల్లో అనర్హులను  గుర్తించే దిశగా  అడుగులు వేస్తోంది. ఆదాయపన్ను చెల్లించేవారికి ఈ పథకం కింద సాయం నిలిపివేయనుంది. దీనికోసం ఐటీ(IT) విభాగం నుంచి ఆదాయ పన్ను చెల్లింపుదారుల వివరాలను ఆహార మంత్రిత్వశాఖ కోరింది.
 
నిరుపేదలకు మూడుపూటలా ఆహారం అందించాలన్న సంకల్పంతో  కేంద్రం ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్ అన్న యోచన పథకం కింద ఉచితంగా  రేషన్ బియ్యం(Ration Rice) అందిస్తోంది. 2024 జనవరి 1 నుంచి ఐదేళ్లపాటు ఉచితంగా  ఆహార ధాన్యాలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికోసం ఏకంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రూ.1.97లక్షల కోట్లు వెచ్చిస్తోంది. కొత్త బడ్జెట్‌లో ఏకంగా రెండు లక్షల కోట్లు పైచిలుకు కేటాయింపులే చేసింది. ఇంత ఖర్చు చేసి అందిస్తున్న ఆహార ధాన్యాలు  అర్హులకు కాకుండా అనర్హులకు చేరుతుండంతో  కేంద్రం ప్రత్యేక దృష్టిసారించింది. అనర్హులను  ఏరివేయడమే ధ్యేయంగా  కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఓ ఆర్డర్ జారీ చేసింది. ఇందులో  డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌... వినియోగదారుల వ్యవహార మంత్రిత్వశాఖ పరిధిలోని ఆహారం, ప్రజాపంపిణీ విభాగం ఒకదానికొకటి  సమాచారం పంచుకోనున్నాయి. ఆధార్, పాన్‌, మదింపు సవంత్సరం వివరాలు సమర్పిస్తే చాలు....నిర్ణిత మొత్తం కన్నా ఆదాయం ఎక్కువ కలిగిన వారి వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థలో  అనర్హుల వివరాల గుర్తింపులో ఈ డేటా చాలా కీలకం కానుంది. అనర్హులను గుర్తించి తర్వాత కేంద్రం తదుపరి నిర్ణయం తీసుకోనుంది. 
 
 
దాదాపు 150 కోట్లకు చేరువులో ఉన్న భారత్‌లో...అత్యధికశాతం పేదవారే. వ్యవసాయ ఆధారిత దేశం కావడంతో రోజుకూలీలే ఎక్కువ మంది ఉన్నారు. వీరందరికీ సరైన ఉపాధి దొరక్క...కనీసం మూడు పూటల తిండికూడా తినలేని స్థితిలో కోట్లాది మంది ఉన్నారు. వారందరి కడుపు నింపాలన్న సంకల్పంతో  నిరుపేదలకు  కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా రేషన్ సరుకులు సరఫరా చేస్తోంది. దీనికోసం కేంద్రం దాదాపు 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. రైతుల  నుంచి ప్రభుత్వమే ఆహార ధాన్యాలు కొనుగోలు చేసి వాటిని  మిల్లర్ల ద్వారా బియ్యంగా మార్చి  పేదలకు అందజేస్తోంది. దీనికోసం ఏకంగా ఒక్కో కిలోకు దాదాపు రూ.40 రూపాయల వరకు ఖర్చు చేస్తోంది. ఏటా లక్షల  టన్నుల ధాన్యం సేకరించి అటు రైతులను ఆదుకుంటోంది.
 
అయితే ప్రజాపంపిణీ వ్యవస్థలో ఏళ్లనాడుగా నాటుకుపోయిన అవినీతి కారణంగా ఇష్టానుసారం  రేషన్ కార్డులు జారీ అయ్యాయి.అనర్హులకు  సైతం పెద్దఎ్తతున కార్డులు అందజేశారు. భూస్వాములకు ,బడా వ్యాపారులకు, మోతుబరి రైతులకు సైతం రేషన్ కార్డులు ఉన్నాయి. బెంజ్‌కారులో వచ్చి రేషన్ బియ్యం తీసుకున్న ఘటనలు మనం కళ్లారా చూశాం.అలాగే  బైక్‌లు, కార్లలో వచ్చి బియ్యం తీసుకుంటున్న వారిని నిత్యం చూస్తూనే ఉన్నాం. పోనీ ఆ బి‌య్యం వాడుకుంటున్నారా అంటే అదీ లేదు. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని నల్లబజార్‌లో అమ్ముకుంటున్నారు. వివిధ మార్గాల ద్వారా సేకరించిన లక్షల టన్నుల రేషన్ బియ్యం ఓడల ద్వారా ఇతర దేశాలకు తరలిపోతోంది.  దీన్నంతటినీ అరికట్టాలని భావించిన కేంద్ర ప్రభుత్వం...మందుగా  నకిలీ రేషన్ కార్డుదారుల ఏరివేత ప్రారంభించింది.
 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget