అన్వేషించండి

Medicine Ban: ఫీవర్ వచ్చిందని ఈ మందులు వాడుతున్నారా.. వీటిని బ్యాన్ చేశారని తెలుసా?

Medicine Ban: ఒకటి కన్నా ఎక్కువ ఔషధాల కలయికతో తయారైన మందుల వాడకం వల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువని నిపుణుల బృందం తేల్చింది. 156 రకాల ఔషధాలపై కేంద్రం నిషేధం విధించింది.

Medicines Ban: అసలే వర్షాకాలం చిన్న జలుబు చేసినా....కాస్త ఒళ్లు వెచ్చబడిందా అంతే పరుగెత్తుకుని మందుల షాపులకు వెళ్లి టాబ్లెట్‌లు తెచ్చుకుని వేసుకుంటారు. ఇంట్లో ఎవరికైనా కాస్త సుస్తి చేసిందంటే చాలు ప్రతిఒక్కరూ డాక్టర్( Doctor) అవతారం ఎత్తేస్తారు. అవసరం ఉన్నా లేకున్నా....మూడుపూటలు బిల్లలు వేస్తూనే ఉంటారు. దీనివల్ల  ఉన్న రోగం సంగతి ఏమోగానీ కొత్తకొత్త రోగాలు అంటుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్‌(Side Effects)లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రోగులకు ముప్పు తెచ్చే అవకాశం ఉన్న 156 రకాల మందులను నిషేధించింది. ఈ మందులు(Medicine) ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని ప్రజలను   హెచ్చరించింది.

కాంబినేషన్ మందులతో జాగ్రత్త
సాధారణంగా మనకు జ్వరం వస్తే...ముందు జాగ్రత్తగా  జలుబుకు కూడా కలిపి కాంబినేషన్ మందులు తీసుకుంటాం. యాంటీబయోటిక్‌లో కూడా రెండు, మూడు రకాలు కలిపి ఉన్న కాంబినేషన్లు ఎక్కువగా వాడుతుంటారు. ఇలా అవసరం ఉన్నా లేకపోయిన ఇష్టానుసారం మందులు వాడకం వల్ల లేని ప్రమాదాలను కొని తెచ్చుకోవడమేనని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇబ్బందికరమైన 156 రకాల ఔషధాలను నిషేధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రజలు తరుచుగా వాడే జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీ మందులే ఎక్కుగా ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా కాస్త ఒళ్లు నొప్పులు ఉండగానే నోప్పులతోపాటు పారాసిటమల్ కాంబినేషన్ మందులు తీసుకుంటారు.అందుకే ఎసిక్లోఫినాక్‌ పారాసిటమాల్ కాంబినేషన్ మందులను సైతం కేంద్రం నిషేధిత జాబితాలో ఉంచింది. ఈనెల 12నే వీటిని  నిషేదిత జాబితాలో చేర్చుతూ  నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 156 ఎఫ్‌డీసీలను తక్షణమే ఉత్పత్తి, నిల్వలు, విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించింది. వీటిల్లో ఎక్కువగా యాంటీబయోటిక్స్‌, నొప్పి, మల్టీ విటమిన్లు ఉన్నాయి. డ్రగ్‌ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మందుల తయారీ సంస్థల వాదనలను డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు తోసిపుచ్చింది. కాంబినేషన్ మందుల వల్ల రోగులకు ప్రయోజనాలు చేకూరపోగా...మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింంది. అందుకే  ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ మందులను నిషేదిస్తున్నట్లు వెల్లడించింది. 

రెండు లేదా మూడు ఔషధాలను కలిపి నిర్దిష్ట నిష్పత్తిలో తయారు చేసే మందులను ఎఫ్‌డీసీ(FDC) అంటారు. వీటిని కాక్‌టెయిల్ డ్రగ్స్‌ అని కూడా పిలుస్తారు. కేంద్రప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ ఎఫ్‌డీసీలపై అధ్యయనం చేసి అవి వాడకం మంచిది కావని నిర్థారించిన తర్వాత వాటిపై నిషేధం విధించారు. చిన్నచిన్న జబ్బులకు సైతం సొంత వైద్యం పనికిరాదని  వైద్య నిపుణులు హెచ్చరించారు. ఇష్టానుసారం మందుల దుకాణాల నుంచి టాబ్లెట్లు కొని వేసుకోరాదని సూచించారు. దీర్ఘకాలంలో అవి అవయవాలపై దుష్ప్రాభావం చూపుతాయని హెచ్చరించారు. నిపుణులైన వైద్యులను సంప్రదించిన తర్వాత...వారు సూచించిన మందులనే వాడాలని తెలిపారు. ఒక్కోసారి మందుల దుకాణదారులు సైతం డాక్టర్ రాసిన మందులు లేవని...వేరే కాంబినేషన్ ఉందని ఇస్తుంటారు. ఖచ్చితంగా అలాంటివి కూడా వద్దని చెప్పారు. నిర్దిష్టమైన రోగానికి...నిర్ధిష్టమైన మందులనే వైద్యులు సూచిస్తారని...అంతకు మించి ఇష్టానుసారం వాడటం మంచిది కాదని తెలిపారు. 

Also Read: కోల్‌కతా కేసులో మరో సంచలనం, హత్యాచారానికి ముందు రోజు డాక్టర్‌ని వేధించిన నిందితుడు - సీసీటీవీ ఫుటేజ్‌ సంచలనం

Also Read: కోల్‌కతా కేసులో ఇంత గందరగోళం ఎందుకు? ఆ రోజు ఏం జరిగింది - ముందుగా డెడ్‌బాడీని చూసిందెవరు?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget