అన్వేషించండి

Medicine Ban: ఫీవర్ వచ్చిందని ఈ మందులు వాడుతున్నారా.. వీటిని బ్యాన్ చేశారని తెలుసా?

Medicine Ban: ఒకటి కన్నా ఎక్కువ ఔషధాల కలయికతో తయారైన మందుల వాడకం వల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువని నిపుణుల బృందం తేల్చింది. 156 రకాల ఔషధాలపై కేంద్రం నిషేధం విధించింది.

Medicines Ban: అసలే వర్షాకాలం చిన్న జలుబు చేసినా....కాస్త ఒళ్లు వెచ్చబడిందా అంతే పరుగెత్తుకుని మందుల షాపులకు వెళ్లి టాబ్లెట్‌లు తెచ్చుకుని వేసుకుంటారు. ఇంట్లో ఎవరికైనా కాస్త సుస్తి చేసిందంటే చాలు ప్రతిఒక్కరూ డాక్టర్( Doctor) అవతారం ఎత్తేస్తారు. అవసరం ఉన్నా లేకున్నా....మూడుపూటలు బిల్లలు వేస్తూనే ఉంటారు. దీనివల్ల  ఉన్న రోగం సంగతి ఏమోగానీ కొత్తకొత్త రోగాలు అంటుకునే ప్రమాదం ఉంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్‌(Side Effects)లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రోగులకు ముప్పు తెచ్చే అవకాశం ఉన్న 156 రకాల మందులను నిషేధించింది. ఈ మందులు(Medicine) ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దని ప్రజలను   హెచ్చరించింది.

కాంబినేషన్ మందులతో జాగ్రత్త
సాధారణంగా మనకు జ్వరం వస్తే...ముందు జాగ్రత్తగా  జలుబుకు కూడా కలిపి కాంబినేషన్ మందులు తీసుకుంటాం. యాంటీబయోటిక్‌లో కూడా రెండు, మూడు రకాలు కలిపి ఉన్న కాంబినేషన్లు ఎక్కువగా వాడుతుంటారు. ఇలా అవసరం ఉన్నా లేకపోయిన ఇష్టానుసారం మందులు వాడకం వల్ల లేని ప్రమాదాలను కొని తెచ్చుకోవడమేనని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇబ్బందికరమైన 156 రకాల ఔషధాలను నిషేధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రజలు తరుచుగా వాడే జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీ మందులే ఎక్కుగా ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా కాస్త ఒళ్లు నొప్పులు ఉండగానే నోప్పులతోపాటు పారాసిటమల్ కాంబినేషన్ మందులు తీసుకుంటారు.అందుకే ఎసిక్లోఫినాక్‌ పారాసిటమాల్ కాంబినేషన్ మందులను సైతం కేంద్రం నిషేధిత జాబితాలో ఉంచింది. ఈనెల 12నే వీటిని  నిషేదిత జాబితాలో చేర్చుతూ  నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 156 ఎఫ్‌డీసీలను తక్షణమే ఉత్పత్తి, నిల్వలు, విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించింది. వీటిల్లో ఎక్కువగా యాంటీబయోటిక్స్‌, నొప్పి, మల్టీ విటమిన్లు ఉన్నాయి. డ్రగ్‌ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. మందుల తయారీ సంస్థల వాదనలను డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు తోసిపుచ్చింది. కాంబినేషన్ మందుల వల్ల రోగులకు ప్రయోజనాలు చేకూరపోగా...మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింంది. అందుకే  ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ మందులను నిషేదిస్తున్నట్లు వెల్లడించింది. 

రెండు లేదా మూడు ఔషధాలను కలిపి నిర్దిష్ట నిష్పత్తిలో తయారు చేసే మందులను ఎఫ్‌డీసీ(FDC) అంటారు. వీటిని కాక్‌టెయిల్ డ్రగ్స్‌ అని కూడా పిలుస్తారు. కేంద్రప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఈ ఎఫ్‌డీసీలపై అధ్యయనం చేసి అవి వాడకం మంచిది కావని నిర్థారించిన తర్వాత వాటిపై నిషేధం విధించారు. చిన్నచిన్న జబ్బులకు సైతం సొంత వైద్యం పనికిరాదని  వైద్య నిపుణులు హెచ్చరించారు. ఇష్టానుసారం మందుల దుకాణాల నుంచి టాబ్లెట్లు కొని వేసుకోరాదని సూచించారు. దీర్ఘకాలంలో అవి అవయవాలపై దుష్ప్రాభావం చూపుతాయని హెచ్చరించారు. నిపుణులైన వైద్యులను సంప్రదించిన తర్వాత...వారు సూచించిన మందులనే వాడాలని తెలిపారు. ఒక్కోసారి మందుల దుకాణదారులు సైతం డాక్టర్ రాసిన మందులు లేవని...వేరే కాంబినేషన్ ఉందని ఇస్తుంటారు. ఖచ్చితంగా అలాంటివి కూడా వద్దని చెప్పారు. నిర్దిష్టమైన రోగానికి...నిర్ధిష్టమైన మందులనే వైద్యులు సూచిస్తారని...అంతకు మించి ఇష్టానుసారం వాడటం మంచిది కాదని తెలిపారు. 

Also Read: కోల్‌కతా కేసులో మరో సంచలనం, హత్యాచారానికి ముందు రోజు డాక్టర్‌ని వేధించిన నిందితుడు - సీసీటీవీ ఫుటేజ్‌ సంచలనం

Also Read: కోల్‌కతా కేసులో ఇంత గందరగోళం ఎందుకు? ఆ రోజు ఏం జరిగింది - ముందుగా డెడ్‌బాడీని చూసిందెవరు?

టాప్ హెడ్ లైన్స్

Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
Breaking News: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Embed widget