అన్వేషించండి

IAS IPS : ఐఏఎస్‌లు డీవోపీటీ ఆదేశాల పాటించాల్సిందే - క్యాట్ ఆర్డర్స్ - ఏపీలో రిపోర్టు చేయనున్న అమ్రపాలి !

CAT Orders: ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా ఆదేశాలివ్వాలని క్యాట్‌కు వెళ్లిన ఐఏఎస్‌లకు ఊరట లభించలేదు. డీవోపీటీ ఆదేశాల మేరకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

CAT has directed the IAS to follow the orders of DoPT :  ప్రస్తుతం పని చేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగాలని ఐదుగురు ఐఏఎస్‌లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. డీవోపీటీ ఆదేశాల మేరకు వారికి కేటాయించిన రాష్ట్రాల క్యాడర్‌లో రిపోర్టు చేయాల్సిందేనని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ స్పష్టం చేసింది. తెలంగాణలో పని చేస్తున్న  అధికారులు ఏపీకి, ఏపీలో పని చేస్తున్న అధికారులను తెలంగాణ క్యాడర్ కు కేటాయించారు. అయితే ఈ కేటాయింపులపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు కేసులు, వాదనల తర్వాత ఎవరికి కేటాయించిన రాష్ట్రాలకు వారు వెళ్లాల్సిందేనని డీవోపీటీ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలను నిలుపుదల చేయాలని ఐదుగురు క్యాట్‌లో అత్యవసర పిటిషన్లు వేసి వాదనలు వినిపించినా ప్రయోజనం లేకపోయింది.  

డీవోపీటీ ఆదేశాలను పాటించాల్సిందేనని క్యాట్ తీర్పు 

తమను ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల్లోనే కొనసాగించాలని క్యాట్ ఎదుట పిటిషన్లు వేసిన సివిల్ సర్వీస్ అధికారుల తరపు లాయర్లు వాదించారు. ప్రతి ఒక్కరి వాదనలను విన్నారు.ఈ సందర్భంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.  ఏపీలో వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు, వారికి సేవచేయాలని లేదా అని ప్రశ్నించారు. ఏసీ గదుల్లోనే కూర్చుని ఎందుకు పని చేయాలనుకుంటున్నరాని ప్రశ్నించారు.  స్థానికత ఉన్నప్పటికీ, స్వాపింగ్‌ చేసుకోవచ్చని గైడ్‌లైన్స్‌లో ఉంటే చూపించాలని క్యాట్  ఐఏఎస్‌ల కేటాయింపుపై డీఓపీటీకి నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. వన్‌ మెన్‌ కమిటీ సిఫారసులను డీఓపీటీ ఎలా అమలు చేస్తుందని క్యాట్ ప్రశ్నించింది.  వన్‌ మెన్‌ కమిటీ సిఫారసు చేసినప్పుడు ఎందుకు హైకోర్టుకు వెళ్లలేదని కూడా క్యాట్ ప్రశ్నించింది.

కొద్దిగా ఉంటే కొండ చిలువకు మంచింగ్ అయిపోయేవాడే - ఈ తాగుబోతుకు భూమి మీద నూకలున్నాయి ! 

ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్రాల్లోనే ఉండాలనుకుంటున్న అధికారులు

సుదీర్ఘ వాదనల అనంతరం డీవోపీటీ ఆదేశాలను పాటించాల్సిందేనని క్యాట్ స్పష్టం చేసింది. క్యాట్ ఆదేశాల మేరుక ఎనిమిది మంది తెలంగాణ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు ఏపీలో, ముగ్గురు ఏపీకి చెందిన ఐఏఎస్‌లు తెలంగాణలో బుధవారమే రిపోర్టు చేయాల్సి ఉంది. విభజనలో భాగంగా ఏపీకి కేటాయించినా తెలంగాణలోనే పని చేస్తున్న ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేస్తూ డీవోపీటీ ఉత్తర్వులు ఇచ్చింది.   రోనాల్డ్ రాస్ , ప్రశాంతి , వాకాటి కరుణ ,  వాణి ప్రసాద్, అమ్రపాలి ఏపీకి వెళ్లాల్సిన ఐఏఎస్‌ల జాబితాలో ఉన్నారు.  ఏపీ నుంచి   ఐఎఎస్‌లు ఎస్ ఎస్ రావత్, అనంత్రామ్, సృజన, శివశంకర్, హరికిరణ్ ను రిలీవ్ చేసింది. వీరంతా బుధవారమే కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాల్సి ఉంది.  

అత్తాకోడళ్లపై అత్యాచార కేసులో విస్తుపోయే వాస్తవాలు-నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఒకరిపై 32 కేసులు !

బుధవారం లంచ్ మోషన్ పిటిషన్  దాఖలు చేసే అవకాశం 

అయితే ప్రస్తుతం  పని చేస్తున్న రాష్ట్రాల్లోనే ఉండాలనుకుంటున్న వీరు క్యాట్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయిచేందుకు రెడీ అవుతున్నారు. పదహారో తేదీనే రిపోర్టు చేయాల్సి ఉంది. ఈ కారణంగా పదహారో తేదీన ఉదయమే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపించాలనుకుంటున్నారు. తాత్కలిక ఊరట అయినా లభిస్తే తదుపరి ప్రయత్నాలు చేయవచ్చని అనుకుంటున్నారు. ఒక వేళ ఊరట రాకపోతే వెంటనే ఆయా రాష్ట్రాల్లో రిపోర్టు చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.  

 

టాప్ హెడ్ లైన్స్

అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Court Denies Sushil Bail: ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget