Court Summons To God : నువ్వేనా ? కాదా ? కోర్టుకు వచ్చి నిరూపించుకోవాలని దేవుడికి సమన్లు ! మరి దేవుడు వచ్చాడా ?
తమిళనాడులోని దిగువ కోర్టు ఒకటి తమ ఎదుట హాజరు కావాలని దేవుడికి సమన్లు జారీ చేసింది. ఈ ఆదేశాలను హైకోర్టు కొట్టి వేసింది.
అసలు నువ్వేనా.. కాదో తేల్చాల్సి ఉంది. కోర్టు ఎదుట హాజరై నిరూపించుకో అని ఓ ఆలయంలో దేవుడి విగ్రహానికి ఓ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ అయింది. చివరికి హైకోర్టుకు చేరింది. ముందూ వెనుకా చూసుకోకుండా అలా ఎలా సమన్లు ఇస్తారని హైకోర్టు సీరియస్ అయింది. అసలేం జరిగిందంటే .?
Also Read: హెయిర్ స్టైలిష్ హబీబ్పై ఎఫ్ఐఆర్.. మహిళ తలపై ఉమ్మేసి హెయిర్ స్టైలింగ్
తమిళనాడులోని తిరుపూరు జిల్లా శివిరిపలయంలోని పరమశివన్ స్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. సర్వం తీసుకెళ్లారు. చివరికి విగ్రహాన్ని కూడా దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి దొంగల్ని పట్టుకుని విగ్రహాన్ని రికవరీ చేశారు. ప్రత్యేక కోర్టుకు అనుమతితో విగ్రహాన్ని ఆలయ యాజమాన్యానికి అప్పగించారు. అయితే ఆ విగ్రహం వర్జినలా.. లేక నకిలీలా అనే డౌట్ అధికారులకు వచ్చింది. వెంటనే ఈ విగ్రహాన్ని పరీక్షించేందుకు కోర్టులో హాజరుపరచాలని అధికారి ఆదేశాలు జారీ చేశారు. అధికారి ఆదేశాలను సమర్థిస్తూ కుంభకోణం కోర్టు సమన్లు జారీ చేసింది.
Also Read: DigiLocker: యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు.. ఇక ఆ సర్టిఫికెట్లకు చెల్లుబాటు
కుంభకోణం కోర్టు సమన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దిగువ న్యాయస్థానం చర్యపై ఆగ్రహం వ్యక్తం చేసిన మద్రాస్ హైకోర్టు కుంభకోణం కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. విచారణకు విగ్రహాన్ని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని 0లయానికి వెళ్లి విగ్రహాన్ని పరీక్షించవచ్చని తెలిపింది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని న్యాయస్థానం సూచించింది.
ఇక్కడ విశేషం ఏమిటంటే దిగువ కోర్టు నేరుగా గర్భగుడిలోని విగ్రహానికే సమన్లు జారీ చేయడం. సబంధిత అధికారి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి కోర్టులో ప్రవేశ పెట్టాలని చెప్పడం వివాదాస్పదమయింది. చివరికి హైకోర్టు ఈ వివాదానికి తెర దించింది.
Also Read: Covid Updates: తెలంగాణలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి... ఒక్క రోజులో 2 వేలకు పైగా కేసులు, ముగ్గురు మృతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets