అన్వేషించండి

BJP Farmers Policy : బీజేపీకి 7 పథకాల బలం - రైతుల్లో మార్పు - విపక్షాల వ్యతిరేక ప్రచారం గ్రౌండ్ లెవల్లో రివర్స్ అయిందా ?

BJP : భారతీయ జనతా పార్టీపై కొంత కాలంగా రైతు వ్యతిరేక ప్రచారాన్ని విపక్షాలు ప్రణాళికాబద్దంగా చేస్తున్నాయి. ఈ ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఎంత ఉంటుంది ? బీజేపీ ఎందుకు కాన్ఫిడెంట్ గా ఉంది ?

BJP has the support of farmers in Haryana :  రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చినప్పటి నుండి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై రైతు వ్యతిరేకత ముద్ర వేసేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నించాయి. ఆ చట్టాలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత రాలేదు. కొన్ని రాష్ట్రాల్లోనే వచ్చింది. అయితే రైతులకు ఆ చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంలో విఫలమైన  బీజేపీ చివరికి రాజకీయంగా నష్టం జరగకుండా ఆ చట్టాలన వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సత్ఫలితాలను పొందింది. ఇప్పుడు మరోసారి రైతుల విషయంలో  బీజేపీ ని టార్గెట్ చేస్తూ.. హర్యానా ఎన్నికల్లో బీజేపీని కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలను బీజేపీ తేలికగా తీసుకోలేదు. వారికి కౌంటర్ ఇచ్చేందుకు వ్యూహాత్మకంగా చాపకింద నీరులా వ్యూహాలు పన్నింది. ఆ ఫలితాలు ఎన్నికల్లో కనిపిస్తాయని బీజేపీ గట్టిగా నమ్ముతోంది.  విపక్షాల రైతు వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టామని భావిస్తోంది. ఇంతకీ బీజేపీ ఏం చేసింది ? 

రైతులు, వ్యవసాయం కోసం బీజేపీ పక్కా ప్రణాళికలు

రైతులకు అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ తో  పాటు ఇండీ కూటమి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఏ అన్యాయం  కేంద్రం చేసిందో మాత్రం చెప్పడం లేదు. రైతులకు అలాంటి ఆలోచన లేకుండా రోడ్ల మీదకు వచ్చేలా చేస్తే రాజకీయంగా లాభమని ఇండీ  కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం  ఫార్మర్ సెంట్రిక్ విధానాలను సైలెంట్ గా అమలు చేస్తూ రైతుల ఆదాయంలో మెరుగుదలను చూపిస్తోంది. దాన్ని రైతులు తెలుసుకునేలా చేస్తోంది. ఇది చాపకింద నీరులాగా జరిగిపోతోంది. ఇండీకూటమి పార్టీలు పైపై ఆందోళనలు చేస్తూ.. రాజకీయ బలంతో చేసే ఆందోళనలు తటస్థ రైతులపై ఏ మాత్రం ప్రభావం చూపవని బీజేపీ నమ్మకంతో ఉంది.  

ఏడు కొత్త పథకాలతో టెక్ అగ్రికల్చర్ వైపు వ్యవసాయ రంగం

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా కేంద్రం అనేక నిర్ణయాలు తీసుకుంది. మద్దతు ధరలను రైతులు కూడా ఊహించనంత ఎక్కువగా పెంచుతూ వస్తోంది. రైతు చట్టాల విషయంలో ...రైతల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించలేకపోవడం వల్ల ఏర్పడిన పరిస్థితుల కారణంగా వెనక్కి తీసుకున్నా..రైతులకు ప్రత్యేక పథకాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. పీఎం కిసాన్, ఫసల్ బీమా వంటి పథకాలు రైతులకు ఎంతగా మేలు చేస్తున్నాయో చెప్పాల్సిన పని లేదు . తాజాగా రూ.  13,966 కోట్లతో ఏడు కీలక పథకాలకు ఆమోదం ఏడు కొత్త పథకాలకు ఆమోదం తెలిపారు. ఇందులో  డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కి 2,817 కోట్లు కేటాయించారు.

7 స్కీమ్స్‌కు రూ. 14 వేల కోట్ల కేటాయింపు

రైతుల జీవితాలు, వారికి మరింత మెరుగైన జీవనోపాధిని కల్పించే లక్ష్యంతో ఈ  ఏడు ప్రధాన పథకాలను అమల్లోకి తెచ్చారు.  రైతుల పట్ల కేంద్రం ఎంత శ్రద్ధ చూపుతోందో కొత్తగా ఆమోదించిన ఏడు పథకాలను బట్టి అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయం .. వ్యవసాయ రంగ నిపుణుల్లో వ్యక్తమవుతోంది.   వ్యవసాయ పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి  కృత్రిమ మేధస్సు, బిగ్ డేటా, జియోస్పేషియల్ టెక్నాలజీలతో సహా అత్యాధునిక సాంకేతికతను అన్వయించడానికి ఏర్పాట్లు చేస్తోంది.  వ్యవసాయ డేటాను సమగ్రంగా డిజిటల్ రిపోజిటరీ చేయడం, అగ్రి స్టాక్‌ను రూపొందించడం, రైతుల రిజిస్ట్రేషన్, విలేజ్ ల్యాండ్ మ్యాప్స్ రిజిస్ట్రేషన్ వంటివి ఏర్పాటు చేసి సాంకేతిక వ్యవసాయంగా మార్చి..రైతుల పంట పండించాలని సంకల్పించారు. 

బాగుపడుతున్న పరిస్థితులపై హర్యానా రైతుల్లో చర్చ 

రైతులను కొనుగోలుదారులతో నేరుగా అనుసంధానం చేయడాన్ని ఓ టార్గెట్ గా పెట్టుకున్నారు. రైతులు నేరుగా వినియోగదారులకు అమ్ముకునేలా ప్రోత్సహం ఇవ్వనున్నారు.  వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేలా  రైతులను సిద్ధం  చేసేందుకు ప్రత్యేక కార్యచరణ చేపడుతున్నారు. ఇందు కోసం రూ. 2,291 కోట్లు కేటాయించారు.  పశుపోషణ, ఉత్పత్తి పథకానికి 1,702 కోట్లు కేటాయించారు.  ఉద్యానవనాల అభివృద్ధి, సహజ వనరుల నిర్వహణ కోసం రూ. 860 కోట్ల రూపాయలను కేటాయించారు.  సహజ వనరుల నిర్వహణ పథకం కింద 1,115 కోట్ల రూపాయల బడ్జెట్‌తో దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే కేంద్రం చేపట్టిన చర్యల వల్ల పదేళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు తమ ఆదాయంలో వచ్చిన గణనీయమైన మార్పులు రైతులు గుర్తిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది హర్యానా ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని నమ్ముతున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
అంగన్‌వాడి సిబ్బందికి తల్లికి వందనం వర్తింపు- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 
US Iran War: జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
జోర్డాన్‌లో అమెరికా విమానాలపై ఇరాన్ దాడి! క్షిపణుల దాడిలో పలువురు మృతి!
Parliament Monsoon Session 2026: పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
పార్లమెంట్ అజెండాలో లేని రాజ్యాంగసవరణ బిల్లులు - ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తారా?
Kerala Kannur Consumer Court: 9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?
9 ఏళ్లు ఎదురు చూసినా పెళ్లి చేయలేదని మ్యాట్రిమొనీపై కోర్టుకెళ్లిన వ్యక్తి - కోర్టు ఏం చెప్పిందంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget