అన్వేషించండి

Bihar Politics: చావనైనా చస్తాం కానీ బీజేపీతో పొత్తు మాత్రం పెట్టుకోం - బిహార్ సీఎం నితీష్ కుమార్

Bihar Politics: బీజేపీతో పొత్తు పెట్టుకునేదే లేదని బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.

Bihar Politics:

క్లారిటీ ఇచ్చిన నితీష్..

బిహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీతో పొత్తు విషయమై మరోసారి స్పష్టతనిచ్చారు. చావడానికై సిద్ధం కానీ...బీజేపీతో కలిసి పోటీ చేసేది మాత్రం లేదని తేల్చి చెప్పారు. మహాత్మా గాంధీకి నివాళులర్పించేందుకు పట్నాకు వచ్చిన నితీష్‌పై మీడియా పలు ప్రశ్నలు సంధించింది. 

"ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు. అసలు ఆ ప్రశ్నే వద్దు. చనిపోవడానికైనా వెనకాడం. కానీ...వాళ్లతో మాత్రం కలిసి ముందడుగు వేసేదే లేదు. అలాంటి అసత్య ప్రచారాలను నమ్మకండి. ఇలాంటి పుకార్లు ఎందుకు పుడుతున్నాయో తెలీదు" 

-నితీష్ కుమార్, బిహార్ సీఎం 

అటు బీజేపీ కూడా జేడీయూతో కలిసి పోటీ చేసే అవకాశమే లేదని వెల్లడించింది. పొరపాటున కూడా అది జరగదని తేల్చి చెప్పింది. మైనార్టీ ఓటు బ్యాంకుపైనా నితీష్ కుమార్ స్పందించారు. బీజేపీ మాటల దాడి చేశారు. మైనార్టీల ఓట్లను బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందని, కలిసి పోటీ చేసినప్పుడు తమ ఓటు బ్యాంకుతోనే కాషాయ పార్టీ గెలిచిందని వెల్లడించారు. వాజ్‌పేయీ, అడ్వాణి నాటి బీజేపీతో తమకు ఎలాంటి విభేదాలు లేవని, ఇప్పుడు ఆ పార్టీ రూపు రేఖలు మారిపోయాయని అన్నారు. 

ఊహించని ప్రగతి..

బిహార్ ఊహించని ప్రగతిని సాధించిందని నితీష్ కుమార్ ఇటీవలే  ఓ కార్యక్రమంలో అన్నారు. తమ చిరకాల డిమాండ్ ప్రత్యేక హోదా తిరస్కరణకు గురైన తర్వాత కూడా పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఉన్న వనరులతోనే అభివృద్ధి చేసుకుంటు న్నామన్నారు. వెనుకబడిన రాష్ట్రాలను ఆదుకునేందుకు ప్రత్యేక హోదా ఇచ్చే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రాల పురోగతి చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రోద్యమంలో RSS పోరాటం చేయలేదని, దేశానికి స్వతంత్రం లభించడంలో ఆ సంస్థ చేసిన కృషి ఏమీ లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇటీవలే విమర్శించారు. "స్వాతంత్య్రోద్యమంలో వాళ్లు చేసిందేమీ లేదు. ఎప్పుడూ ఈ పోరాటంలో పాలు పంచుకోలేదు" అని అన్నారు. అంతే కాదు. ప్రధాని నరేంద్ర మోడీపైనా విమర్శలు చేశారు. "నవ భారత జాతి పిత" దేశానికి చేసిందేమీ లేదంటూ సెటైర్ వేశారు. "ఈ మధ్య కాలంలో నవ భారత జాతిపిత అని ఆయనను అందరూ పిలుస్తున్నారు. ఈ న్యూ ఫాదర్...న్యూ ఇండియాకు చేసిందేమీ  లేదు" అని అన్నారు.

ఇటీవల మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ ప్రధాని మోడీని ఫాదర్ ఆఫ్ నేషన్ అంటూ పొగిడారు. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇప్పుడు నితీష్ కుమార్ సెటైర్ వేసింది కూడా ఈ కామెంట్స్‌పైనే. నితీష్ మాత్రమే కాదు. అటు కాంగ్రెస్ కూడా ఆమెపై తీవ్రంగానే విమర్శలు చేసింది. ప్రధాని మోడీని గాంధీతో పోల్చడం ఏంటని మండి పడింది. "జాతిపిత మహాత్మా గాంధీని 
ఎవరితోనూ పోల్చలేం. బీజేపీ చెబుతున్న నవ భారతం..కేవలం ధనికులకు మాత్రమే. మిగతా వాళ్లు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. ఇలాంటి కొత్త భారత్ మనకు వద్దు. బడా బిజినెస్‌మేన్‌లున్న నవ భారత్‌కు మోడీని జాతిపిత చేసుకోవాలనుకుంటే చేసుకోండి. 
మేం అభినందనలు కూడా చెబుతాం" అని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే విమర్శించారు. 

టాప్ హెడ్ లైన్స్

Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Breaking News: తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
కొత్త Tata Tiago EV Faceliftను ఏ ధరకు బుక్ చేసుకోవచ్చు? బుకింగ్ ప్రాసెస్ ఇదే
కొత్త Tata Tiago EV Faceliftను ఏ ధరకు బుక్ చేసుకోవచ్చు? బుకింగ్ ప్రాసెస్ ఇదే
Texas Resident Rips Indian Flag: డాలస్‌లో రెచ్చిపోతున్న పనీపాటా లేని అమెరికన్ యువత - భారత జెండాలు చించి జాత్యాహంకారం -సోషల్ మీడియా వైరల్ కోసమే !
డాలస్‌లో రెచ్చిపోతున్న పనీపాటా లేని అమెరికన్ యువత - భారత జెండాలు చించి జాత్యాహంకారం -సోషల్ మీడియా వైరల్ కోసమే !

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
Embed widget