అన్వేషించండి

Bihar Political Crisis: 'జరిగిందేదో జరిగిపోయింది- అన్నీ మర్చిపోదాం, కలిసి పనిచేద్దాం'

Bihar Political Crisis: ఆర్‌జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమితో కలిసి జేడీయూ అధినేత నితీశ్ కుమార్ బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు.

Bihar Political Crisis: బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి మారిపోయింది. మిత్రపక్షం భాజపాకు ఝలక్ ఇచ్చి మరోసారి రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ)తో నితీశ్ కుమార్ జత కట్టారు. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్.. ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారు. రాష్ట్రీయ జనతా దళ్​(ఆర్​జేడీ), కాంగ్రెస్​, వామపక్షాలతో కూడిన మహాకూటమితో నితీశ్ నేతృత్వంలోని జేడీయూ జట్టు కట్టింది. ఆ పార్టీలతో కలిసి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు నితీశ్​.

రబ్రీ దేవి నివాసానికి

పట్నాలో గవర్నర్​ ఫాగూ చౌహాన్​ను కలిసి మంగళవారం రాజీనామా లేఖ అందజేశారు నితీశ్ కుమార్. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరి ఏకగ్రీవ సూచన మేరకు ఇలా చేసినట్లు మీడియాతో చెప్పారు.

అనంతరం రాజ్​భవన్​ నుంచి నేరుగా రబ్రీ దేవి నివాసానికి వెళ్లారు నితీశ్ కుమార్. తేజస్వీ యాదవ్​ సహా ఇతర ఆర్​జేడీ నేతల్ని ఆయన కలిశారు. "2017లో ఏం జరిగిందో మర్చిపోదాం. ఇప్పుడు సరికొత్త అధ్యాయం ప్రారంభిద్దాం" అని ఆయన తేజస్వీ యాదవ్‌తో అన్నట్లు సమాచారం. 

మళ్లీ గవర్నర్ వద్దకు 

ఆ తర్వాత కాసేపటికి నితీశ్, తేజస్వీ కలిసి రాజ్​భవన్​కు వెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరారు. తమకు సంఖ్యాబలం ఉందని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన పత్రాల్ని సమర్పించారు.

అంతకుముందు

జేడీయూ శాసనసభ్యులు, ముఖ్య నేతలతో నితీశ్ కుమార్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నితీశ్ కుమార్.. భాజపాతో దోస్తీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారట. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు తాము నితీశ్ కుమార్ వెంటే ఉంటామని.. ఎలాంటి నిర్ణయమైనా తీసుకోమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇలా

చాలా కాలం నుంచి బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఎన్‌డీఏ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2020 ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించి నితీశ్ అధికారంలోకి వచ్చినా.. మిత్రపక్షం భాజపాకి ఎక్కువ సీట్లు దక్కాయి. దీంతో నితీశ్‌‌పై ఆ పార్టీ పెత్తనం చెలాయిస్తుందనే ప్రచారం సాగింది. ఈ కారణంగా పలుమార్లు నితీశ్ కుమార్ అసహనానికి గురయ్యారు. దీంతో నితీశ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

బలాబలాలు

బిహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. అతిపెద్ద పార్టీ ఆర్‌జేడీకి అసెంబ్లీలో 80 స్థానాలు ఉన్నాయి. భాజపా 77, జేడీయూ 45, కాంగ్రెస్ 19 సీట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

Also Read: India Rankings In Various Indices: 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత వివిధ సూచికల్లో భారత్ స్థానం ఇది!

Also Read: Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravathi : అమరావతిలో మొట్టమొదటి శాశ్వత బిల్డింగ్ రెడీ!ఓపెనింగ్ ఎప్పుడంటే?
అమరావతిలో మొట్టమొదటి శాశ్వత బిల్డింగ్ రెడీ!ఓపెనింగ్ ఎప్పుడంటే?
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ బరిలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ భార్య- సునీత పేరు ఖరారు చేసిన కేసీఆర్
జూబ్లీహిల్స్ బరిలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ భార్య- సునీత పేరు ఖరారు చేసిన కేసీఆర్
Andhra University : ఆంధ్ర యూనివర్శిటీలో బీఎడ్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ మృతి - భగ్గుమన్న విద్యార్థులు- అసెంబ్లీలో స్పందించిన లోకేష్‌
ఆంధ్ర యూనివర్శిటీలో బీఎడ్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ మృతి - భగ్గుమన్న విద్యార్థులు- అసెంబ్లీలో స్పందించిన లోకేష్‌
Sirpur Politics: బిఆర్ఎస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప-ఆసక్తిగా సిర్పూరు రాజకీయం
బిఆర్ఎస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప-ఆసక్తిగా సిర్పూరు రాజకీయం
Advertisement

వీడియోలు

India vs Pakistan First Time in Asia Cup Final | ఆసియాకప్ లో మొదటిసారి ఫైనల్ లో ఆడబోతున్న ఇండియా పాక్
Pakistan Captain Warning to India Asia Cup 2025 Final | ఫైనల్ లో తలపడబోతున్న ఇండియా పాక్
Bangladesh vs Pakistan Preview Asia Cup 2025 | ఫైనల్ కు చేరిన పాకిస్తాన్
Chiranjeevi Counter to Balakrishna | అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్ | ABP Desam
Bathukammakunta Encroachments | ఇప్పటికీ కబ్జా కోరల్లోనే బతుకమ్మకుంట చెరువు..కోర్టులో పరిధిలో వివాదం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravathi : అమరావతిలో మొట్టమొదటి శాశ్వత బిల్డింగ్ రెడీ!ఓపెనింగ్ ఎప్పుడంటే?
అమరావతిలో మొట్టమొదటి శాశ్వత బిల్డింగ్ రెడీ!ఓపెనింగ్ ఎప్పుడంటే?
Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ బరిలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ భార్య- సునీత పేరు ఖరారు చేసిన కేసీఆర్
జూబ్లీహిల్స్ బరిలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ భార్య- సునీత పేరు ఖరారు చేసిన కేసీఆర్
Andhra University : ఆంధ్ర యూనివర్శిటీలో బీఎడ్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ మృతి - భగ్గుమన్న విద్యార్థులు- అసెంబ్లీలో స్పందించిన లోకేష్‌
ఆంధ్ర యూనివర్శిటీలో బీఎడ్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌ మృతి - భగ్గుమన్న విద్యార్థులు- అసెంబ్లీలో స్పందించిన లోకేష్‌
Sirpur Politics: బిఆర్ఎస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప-ఆసక్తిగా సిర్పూరు రాజకీయం
బిఆర్ఎస్ పార్టీలో చేరిన కోనేరు కోనప్ప-ఆసక్తిగా సిర్పూరు రాజకీయం
Jagan-Chiranjeevi Controversy :అసెంబ్లీలో బాలయ్య కామెంట్స్.. చిరంజీవి రియాక్షన్‌- వైసీపీ వ్యూహం ఏమిటి?
జగన్ అవమానించలేదని చిరంజీవి క్లారిటీ ఇచ్చారా? జరుగుతున్న ప్రచారంలో నిజమెంతా?
Swadeshi Tech : స్వదేశీ వస్తువులే కాదు యాప్‌లు కూాడా ఉన్నాయి! వాట్సాప్, గూగుల్ మ్యాప్స్, జిమెయిల్‌కు ప్రత్యామ్నాయాలు ఇవే!
స్వదేశీ వస్తువులే కాదు యాప్‌లు కూాడా ఉన్నాయి! వాట్సాప్, గూగుల్ మ్యాప్స్, జిమెయిల్‌కు ప్రత్యామ్నాయాలు ఇవే!
Anaganaga Oka Raju Promo: జ్యువెలరీ యాడ్ కాదు... 'అనగనగా ఒక రాజు' ప్రోమో - నవీన్ పోలిశెట్టి కామెడీ మూవీ వెరైటీగా...
జ్యువెలరీ యాడ్ కాదు... 'అనగనగా ఒక రాజు' ప్రోమో - నవీన్ పోలిశెట్టి కామెడీ మూవీ వెరైటీగా...
ChatGPT with Lottery : ChatGPTతో లాటరీలో కోట్లు గెలిచింది.. తర్వాత షాకింగ్ నిర్ణయం తీసుకుని డబ్బు ఏమి చేసిందంటే
ChatGPTతో లాటరీలో కోట్లు గెలిచింది.. తర్వాత షాకింగ్ నిర్ణయం తీసుకుని డబ్బు ఏమి చేసిందంటే
Embed widget