అన్వేషించండి

I.N.D.I.A కూటమిని వీడనున్న నితీశ్ కుమార్‌! మళ్లీ బీజేపీతో పొత్తుకి ప్రయత్నాలు?

Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ I.N.D.I.A కూటమిని వీడతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

I.N.D.I.A Alliance: విపక్ష కూటమి I.N.D.I.Aకి పెద్ద షాక్ తగిలేలా ఉంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూటమిని వదిలే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన మళ్లీ బీజేపీతోనే కలిసి నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇప్పటికే విపక్ష కూటమి I.N.D.I.Aలో అప్పుడే చీలికలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌తో సీట్‌లు పంచుకునేందుకు ససేమిరా అంటున్నాయి తృణమూల్, ఆప్. మమతా బెనర్జీ అయితే ఏకంగా ప్రకటనే చేశారు. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసే ఉద్దేశమే లేదని తేల్చి చెప్పారు. అటు ఆప్ కూడా కాంగ్రెస్‌తో సీట్‌లు పంచుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇప్పుడు మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్‌ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారు. జనవరి 30వ తేదీన ఈ యాత్ర బిహార్‌కి చేరుకుంటుంది. అయితే...ఈ యాత్రలో పాల్గొనేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తి చూపించడం లేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల సీట్‌ల షేరింగ్ విషయంలో నితీశ్ తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం. అందుకే...యాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. సీట్ల కేటాయింపు(Seats allocation) అంశం మా వ్య‌క్తిగ‌తం. వేరే పార్టీ వారు మాకు ఆఫ‌ర్ ఇవ్వ‌డం ఎందుకు?  మాతో చ‌ర్చిస్తే అప్పుడు ఆలోచిస్తాం అని మ‌మ‌తా బెన‌ర్జీ(Mamatha benarjee) తెగేసి చెప్పారు. అనంత‌రం వెంట‌నే ఆమె మాట మార్చి.. తాము ఒంట‌రిగానే బ‌రిలో దిగుతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. కాగా, బెంగాల్‌ రాష్ట్రంలో మొత్తం 47 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో క‌నీసం 10 స్థానాల్లో పోటీ చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ, మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం రెండు క‌న్నా ఎక్కువ సీట్లు ఇచ్చే ప‌రిస్థితి లేదు. దీంతో ఈ దిశగా కొన్నాళ్ల నుంచి వివాదం ర‌గులుతూనే ఉంది.

గతేడాది జులైలో NDAని ఓడించడమే లక్ష్యంగా I.N.D.I.A కూటమి ఏర్పడింది. ఈ కూటమి ఏర్పాటులో నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. సైద్ధాంతిక విభేదాలున్న పార్టీలను కలపడంలో చొరవ చూపించారు. ఆ తరవాత ఆయనే కాంగ్రెస్‌పై కాస్త అసహనం వ్యక్తం చేశారు. కూటమిలో కాంగ్రెస్‌ పెద్దగా చురుగ్గా ఉండడం లేదని అన్నారు. ఈ విమర్శలతో ఒక్కసారిగా కూటమిలో అలజడి రేగింది. ఆ తరవాత ఓ భేటీలో ప్రధాని అభ్యర్థిగా ఖర్గేని ప్రతిపాదించడంపైనా నితీశ్ చుర్రుబుర్రులాడారు. తనకు ప్రధాని అభ్యర్థిత్వంపై ఆసక్తి లేదంటూనే వేరే వాళ్ల పేరు ప్రతిపాదించిన వెంటనే ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రాహుల్ గాంధీ ఆయనకు కాల్ చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ...ఇప్పటికీ ఆ విభేదాలు సమసిపోనట్టే కనిపిస్తున్నాయి. అందుకే ఆయన కూటమిని వీడి మళ్లీ ఎప్పటిలాగే బీజేపీతో చేతులు కలిపేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. గత రెండు రోజుల్లోనే అటు మమతా బెనర్జీ, ఇటు ఆప్‌ కాంగ్రెస్‌కి షాక్ ఇచ్చాయి. ఇప్పుడు నితీశ్ కూడా అదే దారిలో నడిచే అవకాశాలున్నాయి. 2013 నుంచి దాదాపు 5 సార్లు నితీశ్ కుమార్ ఓ కూటమి నుంచి మరో కూటమికి మారుతూ వచ్చారు. NDA,మహాఘట్‌బంధన్ మధ్యే అటూ ఇటూ తిరుగుతున్నారు. 2022లో ఆయన NDA నుంచి బయటకు వచ్చి RJD మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మళ్లీ ఆయన మహాఘట్‌బంధన్‌ని వీడి NDAలో చేరిపోతారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Also Read: హనీమూన్‌కి గోవా తీసుకెళ్తానని అయోధ్యకి తీసుకెళ్లిన భర్త, విడాకుల కోసం కోర్టుకెళ్లిన భార్య

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

1st March Rules Change: ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
ట్రైన్ టికెట్ బుకింగ్ నుంచి LPG సిలిండర్ వరకు... మార్చి 1 నుంచి మారుతున్న రూల్స్
Ayatollah Khamenei Dies: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి.. 40 రోజులపాటు సంతాప దినాలు
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి.. 40 రోజులపాటు సంతాప దినాలు
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
CM Revanth Reddy: మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
మదీనా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం చెక్ లు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Embed widget