అన్వేషించండి

I.N.D.I.A కూటమిని వీడనున్న నితీశ్ కుమార్‌! మళ్లీ బీజేపీతో పొత్తుకి ప్రయత్నాలు?

Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ I.N.D.I.A కూటమిని వీడతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

I.N.D.I.A Alliance: విపక్ష కూటమి I.N.D.I.Aకి పెద్ద షాక్ తగిలేలా ఉంది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూటమిని వదిలే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన మళ్లీ బీజేపీతోనే కలిసి నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇప్పటికే విపక్ష కూటమి I.N.D.I.Aలో అప్పుడే చీలికలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌తో సీట్‌లు పంచుకునేందుకు ససేమిరా అంటున్నాయి తృణమూల్, ఆప్. మమతా బెనర్జీ అయితే ఏకంగా ప్రకటనే చేశారు. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసే ఉద్దేశమే లేదని తేల్చి చెప్పారు. అటు ఆప్ కూడా కాంగ్రెస్‌తో సీట్‌లు పంచుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇప్పుడు మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్‌ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారు. జనవరి 30వ తేదీన ఈ యాత్ర బిహార్‌కి చేరుకుంటుంది. అయితే...ఈ యాత్రలో పాల్గొనేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆసక్తి చూపించడం లేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల సీట్‌ల షేరింగ్ విషయంలో నితీశ్ తీవ్ర అసహనంతో ఉన్నట్టు సమాచారం. అందుకే...యాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. సీట్ల కేటాయింపు(Seats allocation) అంశం మా వ్య‌క్తిగ‌తం. వేరే పార్టీ వారు మాకు ఆఫ‌ర్ ఇవ్వ‌డం ఎందుకు?  మాతో చ‌ర్చిస్తే అప్పుడు ఆలోచిస్తాం అని మ‌మ‌తా బెన‌ర్జీ(Mamatha benarjee) తెగేసి చెప్పారు. అనంత‌రం వెంట‌నే ఆమె మాట మార్చి.. తాము ఒంట‌రిగానే బ‌రిలో దిగుతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. కాగా, బెంగాల్‌ రాష్ట్రంలో మొత్తం 47 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో క‌నీసం 10 స్థానాల్లో పోటీ చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ, మ‌మ‌తా బెన‌ర్జీ మాత్రం రెండు క‌న్నా ఎక్కువ సీట్లు ఇచ్చే ప‌రిస్థితి లేదు. దీంతో ఈ దిశగా కొన్నాళ్ల నుంచి వివాదం ర‌గులుతూనే ఉంది.

గతేడాది జులైలో NDAని ఓడించడమే లక్ష్యంగా I.N.D.I.A కూటమి ఏర్పడింది. ఈ కూటమి ఏర్పాటులో నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. సైద్ధాంతిక విభేదాలున్న పార్టీలను కలపడంలో చొరవ చూపించారు. ఆ తరవాత ఆయనే కాంగ్రెస్‌పై కాస్త అసహనం వ్యక్తం చేశారు. కూటమిలో కాంగ్రెస్‌ పెద్దగా చురుగ్గా ఉండడం లేదని అన్నారు. ఈ విమర్శలతో ఒక్కసారిగా కూటమిలో అలజడి రేగింది. ఆ తరవాత ఓ భేటీలో ప్రధాని అభ్యర్థిగా ఖర్గేని ప్రతిపాదించడంపైనా నితీశ్ చుర్రుబుర్రులాడారు. తనకు ప్రధాని అభ్యర్థిత్వంపై ఆసక్తి లేదంటూనే వేరే వాళ్ల పేరు ప్రతిపాదించిన వెంటనే ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రాహుల్ గాంధీ ఆయనకు కాల్ చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ...ఇప్పటికీ ఆ విభేదాలు సమసిపోనట్టే కనిపిస్తున్నాయి. అందుకే ఆయన కూటమిని వీడి మళ్లీ ఎప్పటిలాగే బీజేపీతో చేతులు కలిపేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. గత రెండు రోజుల్లోనే అటు మమతా బెనర్జీ, ఇటు ఆప్‌ కాంగ్రెస్‌కి షాక్ ఇచ్చాయి. ఇప్పుడు నితీశ్ కూడా అదే దారిలో నడిచే అవకాశాలున్నాయి. 2013 నుంచి దాదాపు 5 సార్లు నితీశ్ కుమార్ ఓ కూటమి నుంచి మరో కూటమికి మారుతూ వచ్చారు. NDA,మహాఘట్‌బంధన్ మధ్యే అటూ ఇటూ తిరుగుతున్నారు. 2022లో ఆయన NDA నుంచి బయటకు వచ్చి RJD మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మళ్లీ ఆయన మహాఘట్‌బంధన్‌ని వీడి NDAలో చేరిపోతారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Also Read: హనీమూన్‌కి గోవా తీసుకెళ్తానని అయోధ్యకి తీసుకెళ్లిన భర్త, విడాకుల కోసం కోర్టుకెళ్లిన భార్య

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
AP SSC Exams: టెన్త్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలర్ట్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయండిలా..
AP SSC Exams: టెన్త్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలర్ట్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయండిలా..
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Basil Joseph OTT Movies: 'సూక్ష్మదర్శిని' హీరో బసిల్ జోసెఫ్ లేటెస్ట్ డార్క్ కామెడీ - ఓటీటీలో మార్చి 14న స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?
'సూక్ష్మదర్శిని' హీరో బసిల్ జోసెఫ్ లేటెస్ట్ డార్క్ కామెడీ - ఓటీటీలో మార్చి 14న స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
చార్మినార్‌ చంద్ర‌బాబు క‌ట్టారా? మా పెట్టుబడులు మోదీ ఎత్తుకెళ్తున్నారు- రేవంత్ సంచలన కామెంట్స్
AP SSC Exams: టెన్త్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలర్ట్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయండిలా..
AP SSC Exams: టెన్త్ ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలర్ట్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయండిలా..
Free Bus Scheme in Andhra Pradesh :రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
రాష్ట్రమంతటా కాదు జిల్లాల్లోనే ఫ్రీ- ఏపీ మహిళలకు షాక్- ఉచిత బస్ ప్రయాణం పథకంపై కీలక అప్‌డేట్ !
Basil Joseph OTT Movies: 'సూక్ష్మదర్శిని' హీరో బసిల్ జోసెఫ్ లేటెస్ట్ డార్క్ కామెడీ - ఓటీటీలో మార్చి 14న స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?
'సూక్ష్మదర్శిని' హీరో బసిల్ జోసెఫ్ లేటెస్ట్ డార్క్ కామెడీ - ఓటీటీలో మార్చి 14న స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?
Best Haleem Spots In Hyderabad : హైదరాబాద్​లో బెస్ట్ హలీమ్​ తినాలనుకుంటే ఇక్కడ అస్సలు మిస్ కావొద్దు.. టేస్టీ టాపింగ్స్​తో కూడిన, ట్రెడీషనల్ హలీమ్ స్పాట్స్ ఇవే
హైదరాబాద్​లో బెస్ట్ హలీమ్​ తినాలనుకుంటే ఇక్కడ అస్సలు మిస్ కావొద్దు.. టేస్టీ టాపింగ్స్​తో కూడిన, ట్రెడీషనల్ హలీమ్ స్పాట్స్ ఇవే
Telangana Latest News: వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
వరంగల్‌లో లక్షల మందితో భారీ బహిరంగ సభ - కేసీఆర్ కీలక నిర్ణయం
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Karnataka:  సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం  - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
సినీ పరిశ్రమకు చెప్పినట్లుగానే నట్లు బిగిస్తున్న కర్ణాటక ప్రభుత్వం - మల్టీప్లెక్స్‌ల్లో అయినా సరే టిక్కెట్ రేటు రూ. 200 మాత్రమే !
Embed widget