అన్వేషించండి

Maharastra Elections: మహారాష్ట్రలో ఊపందుకుంటున్న ప్రచారం - ప్రధాని నాందేడ్ సభ బాధ్యత ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డికి !

Vishnu: ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి నాందెడ్‌లో ప్రధాని మోదీ సభను విజయవంతం చేసే బాధ్యతను తీసుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో నాందేడ్ జిల్లా పరిశీలకుడిగా ఆయనకు అవకాశం కల్పించారు.

Maharastra Elections AP BJP Vice President Vishnuvardhan Reddy: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. పోలింగ్ సమయం దగ్గర పడటంతో అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. బీజేపీ నేతలు ప్రణాళికా బద్దంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ బహిరంసభలు నిర్వహిస్తున్నారు.                             

నాందేడ్ జిల్లాలో తొమ్మిదో తేదీన ప్రధాని మోదీ బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాందేడ్ జిల్లాకు  బీజేపీ పరిశీలకునిగా ఆంధ్రప్రదేశ్ నేత విష్ణువర్ధన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన ప్పటి నుండి విష్ణువర్ధన్ రెడ్డి నాందేడ్ జిల్లాలో ఎన్నికల ప్రచారంతో పాటు ప్రచార వ్యూహాలు, ఎలక్షనీరింగ్ వ్యూహాలను ఖరారు చేస్తున్నారు. ప్రధాని మోదీ సభను విజయవంతం చేసే భాధ్యతను కూడా తీసుకున్నారు. భారీగా జన సమీకరణ చేసి.. మహారాష్ట్రలో బీజేపీ కూటమికి ఉన్న పాజిటివ్ వాతావరణాన్ని ప్రస్పుఠం చేయాలని ఆయన పట్టుదలగా ఉన్నారు.

నాందేడ్ జిల్లాలో తెలుగువారి ప్రభావం ఉంటుదంి. అలాగే బీజేపీ కూడా అక్కడ బలంగానే ఉంటుంది.వ్యూహాత్మంగా జన సమీకరణ చేస్తే ఐదారు లక్షల మంది సులువుగా వచ్చే అవకాశం ఉంది.ఈ దిశగా విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ నేతలతో జస  సమీకరణ వ్యూహాలపై చర్చిస్తున్నారు. 

నాందెడ్ జిల్లాలో క్లీన్ స్వీప్ లక్ష్యంగా నేతలంతా పని చేస్తున్నారు. మరోసారి బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విష్ణువర్ధన్  రెడ్డి  ధీమా వ్యక్తం చేస్తున్నారు.         మరో ఉపాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నాసిక్ ప్రాంతానికి పరిశీలనిగా వెళ్లారు. నాసిక్ లో కూడా తెలుగు వారు ఉంటారు. షిరిడికి వెళ్లే భక్తులు  దగ్గరలో ఉన్న నాసిక్ కు కూడా వెళ్తూంటారు. జ్యోతిర్లింగ క్షేత్రం ప్రసిద్ధి చెందినది. టూరిజానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో బీజేపీకి గట్టి పట్టు ఉంది. ఈ సారి ఎన్నికల్లో మరోసారి అక్కడ బీజేపీ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ ప్రయత్నంలో పరిశీలనకునిగా మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ ఉపాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెళ్లారు.  

ఇక బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్న మథుకర్ ను మరఠ్వాడా ప్రాంతానికి పరిశీలకునిగా నియమించారు. పరిశీలకుని విధులు బీజేపీలో కీలకంగా ఉంటాయి. క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయడం మాత్రమే కాకుండా.. ప్రచార సరళిని సమన్వయం చేయడం, అభ్యర్థికి పార్టీకి మధ్య సమన్వయం చేయడం, ఓటర్లను నేరుగా కలిసే బృందాలకు దిశానిర్దేశం  చేయడం వంటివి చేస్తూంటారు. అభ్యర్థుల విజయంలో పరిశీలకుల విధులు కీలకంగా ఉంటాయని భావిస్తారు. 

                       

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు- అన్ని రంగాల్లో MoUల మారథాన్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు- అన్ని రంగాల్లో MoUల మారథాన్
Telangana Rising Summit: PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Rising Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు- అన్ని రంగాల్లో MoUల మారథాన్
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు- అన్ని రంగాల్లో MoUల మారథాన్
Telangana Rising Summit: PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
PPP మోడల్‌ అనివార్యం - గ్లోబల్ సమ్మిట్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Ram Mohan Naidu: ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
ఇండిగోపై ప్రారంభమైన చర్యలు - అనుభవించి తీరాల్సిందే - లోక్ సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన
Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
కల్వకుంట్ల కవితపై కూకట్ పల్లి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు - బీఆర్ఎస్ ఇక మాటకు మాట చెప్పాలని డిసైడ్ అయిందా ?
Advocate Rakesh Kishore: సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
సీజేఐ మీద షూ విసిరిన లాయర్‌కు చెప్పు దెబ్బ- ఢిల్లీ కోర్టు వద్ద అనూహ్య ఘటన
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Akhanda 2 Release Updates: 'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
'అఖండ 2'కు లైన్ క్లియర్... మద్రాస్ హైకోర్టులోని ఎరోస్ కేసులో నిర్మాతలకు ఊరట
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
Embed widget