అన్వేషించండి

Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో

Air Pollution in India: భారత్‌లో కాలుష్యం కారణంగా నమోదవుతున్న మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని ఓ నివేదిక వెల్లడించింది. ఢిల్లీలో ఈ సమస్య ఎక్కువగా ఉందని తెలిపింది.

Air Pollution Deaths in India: భారత్‌లోని ప్రధాన నగరాల్లో కేవలం కాలుష్యం కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరుగుతోంది. The Lancet Planetary Health జర్నల్ ఈ సంచలన విషయం వెల్లడించింది. ఇండియాలోని 10 ప్రధాన నగరాల్లో రోజూ నమోదవుతున్న మరణాల్లో వాయు కాలుష్యం కారణంగా మృతి చెందుతున్న వాళ్లు 7% మందికి పైగా ఉంటున్నారని తేల్చి చెప్పింది. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని హెచ్చరించింది. ఈ నగరాల్లోని గాల్లో PM2.5 మేర ధూళికణాలుంటున్నాయని వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ PM2.5ని ప్రమాదకరంగా పరిగణిస్తోంది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కత్తా, హైదరాబాద్, ముంబయి,పుణే, అహ్మదాబాద్, షిమ్లా, వారణాసి నగరాల్లోని వాతావరణ పరిస్థితులను పరిశీలించి ఈ రిపోర్ట్‌ విడుదల చేసింది. ధూళి కణాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత ప్రమాదకరంగా మారతాయి. ఈ నగరాల్లో ఇప్పుడదే జరుగుతోంది. ఈ చిన్న ధూళి కణాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోతున్నాయి. రక్త సరఫరాపైనా ప్రభావం చూపిస్తున్నాయి. PM 2.5 అంటే particles 2.5 micrometres అని అర్థం. అంటే ఈ ధూళి కణాల సైజ్‌ని సూచిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. నెల వారీగా చూసినా, ఏటా లెక్కలు పరిశీలించినా ఢిల్లీలోనే కాలుష్య మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపింది. 

వాహనాలు, పరిశ్రమల నుంచి ఇవి ఎక్కువగా గాల్లోకి (Air Pollution Effects on Health) విడుదలవుతున్నాయి. ఏటా ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల 12 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తం మరణాల్లో ఇది 11.5%. ఈ ధూళి కణాలు ప్రాణాలు తీసే ప్రమాదం ఎక్కువగా ఉందని రీసెర్చర్స్ తేల్చి చెబుతున్నారు. ఏటా మొత్తంగా 33 వేల మంది కేవలం పొల్యూషన్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్ గాలిలో 15 మైక్రోగ్రాముల వరకూ ధూళి కణాలుండొచ్చు. ఇప్పుడున్న పరిస్థితికి ఈ ప్రమాణానికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. 2008-2019 మధ్య కాలంలో  PM2.5 ఉన్న నగరాల్లో మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని రిపోర్ట్ తెలిపింది. ఇవే పరిస్థితులు కొనసాగితే రోజూవారీ మరణాలు కూడా విపరీతంగా పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది. 

ఈ 11 ఏళ్లలో కాలుష్యం కారణంగా ఏటా బెంగళూరులో 2,100 మంది, చెన్నైలో 2,900 మంది, ముంబయిలో 5,100 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. షిమ్లాలో కాలుష్య స్థాయి కాస్త తక్కువగానే ఉంది. అక్కడ మరణాలూ తక్కువగానే నమోదయ్యాయి. కాసేపు కాలుష్య వాతావరణంలో గడిపినా అది ఆయుష్షుని తగ్గించేస్తుందని (Air Pollution Causes) నివేదిక స్పష్టం చేసింది. అంత ప్రమాదకరంగా కాలుష్యం ఉందని తెలిపింది. ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోకపోతే ఈ మరణాలు ఇంకా పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది. లంగ్ క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బులు, గుండె పోటుని కట్టడి చేయాలంటే కాలుష్యాన్ని తగ్గించాలని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కాలుష్య సమస్యపై ఆందోళన వ్యక్తం చేసింది. 

Also Read: Hathras Stampede: చనిపోయిన వాళ్లని బతికిస్తానంటూ మాయ మాటలు, 16 ఏళ్ల బాలిక మృతదేహాన్ని లాక్కెళ్లిన భోలే బాబా

టాప్ హెడ్ లైన్స్

Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Telangana BJP: తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
తెలంగాణపై బీజేపీ ఫుల్‌ ఫోకస్‌! ఢిల్లీ నుంచి పెద్దల క్యూ! భారీగా చేరికలకు ప్లాన్!
Karur Stampede Case Update: కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్‌కి షాక్! మృతుల కుటుంబానికి తాత్కాలిక  ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోర్టు ఆదేశం!
Psychological Thriller OTT : ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
ఆరు ఓటీటీల్లో మెడికల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ - ఎందుకంత స్పెషల్... తెలుగులోనూ చూసెయ్యండి
AP Cabinet Special Task Force: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం! సోషల్ మీడియా సైకోల కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ .. డీజీపీ నివేదికతో యాక్షన్ ప్లాన్!
Embed widget