అన్వేషించండి

Parliament Budget Session : ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేసే చాన్స్ - బడ్జెట్ సమావేశాల ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం

Parliament Budget Session : శీతాకాల సమావేశాల సందర్భంగా ఉభయ సభల నుంచి సస్పెండ్ అయిన 146 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తి వేయనున్నారు.


Suspension Of Opposition MPs To Be Revoked :  లోక్‌సభ, రాజ్యసభల్లో సస్పెండ్ అయిన ఎంపీలకు గుడ్ న్యూస్ రానుంది. వారిపై సస్పెన్షన్లు ఎత్తివేసేందుకు ప్రివిలేజ్ కమిటీకి ప్రభుత్వం నుంచి  సూచనలు వెళ్లాయి.  ప్రస్తుత పార్లమెంట్ చివరి సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఓటాన్ అకౌంట్  బడ్జెట్ ను ఈ సమావేశాల్లో ప్రతిపాదించనున్నారు. చివరి సమావేశాలు కావడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. గత సమావేశాల సందర్భంగా సస్పెన్షన్‌కు గురైన  ప్రతిపక్ష సభ్యులందరి సస్పెన్షన్లను ఉపసంహరించుకోవాలని కోరుతూ లోక్ సభ, రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీలతో ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. సస్పెన్షన్ కు గురైన ఎంపీలు తిరిగి సమావేశాలకు హాజరడం ద్వారా  నిర్మాణాత్మక చర్చలకు అనువైన వాతావరణాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ప్రహ్లాద్ జోషి  ప్రకటించారు.  

 
 
శీతాకాల సమావేశాల్లో సభ్యుల సస్పెన్షన్ 

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పుడు  లోక్‌సభ (Lok Sabha)లో దుండగులు చొరబడ్డారు.  ఈ  ఘటనతో పార్లమెంట్ (Parliament) దద్దరిల్లింది.  డిసెంబరు 13 న ఈ ఘటన జరిగింది. నాటి ఈ భద్రతా వైఫల్యం (Security Breach)పై హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి.ఎంతకీ వినక పోవడంతో ఉభసభల నుంచి సభ్యులను సస్పెండ్ చేసారు.     ఉభయ సభల నుండి ఏకంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసారు. వీరిలో  132 మందిని "మిగిలిన సెషన్" వరకు సస్పెండ్ చేశారు. లోక్‌సభకు చెందిన ముగ్గురు ఎంపీలు, రాజ్యసభకు చెందిన 11 మంది ఎంపీలను సంబంధిత హౌస్ ప్రివిలేజెస్ కమిటీల నివేదిక పెండింగ్‌లో ఉంచింది. ఇప్పుడు ప్రభు్త్వమే  వారి సస్పెన్షన్లను ఎత్తి వేయాలని కోరుతూండటంతో.. వారంతా మళ్లీ సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. 

రాష్ట్రపతి ప్రసంగంతో  ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు
 
జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగంతో   బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.  ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ సమర్పించనున్నారు.  ఫిబ్రవరి 9న సమావేశాలు ముగుస్తాయి.  ఈ చివరి సమావేశాలు కావడంతో అర్థవంతమైన చర్చలకు అవకాశం కల్పించడం, ఎంపీలందరూ పాల్గొనేలా చూడటంపై దృష్టి సారించారు. రాష్ట్రపతి ప్రసంగం, ఓట్ ఆఫ్ అకౌంట్స్ పై చర్చలకు వీలు కల్పించే ప్రణాళికలతో ఈ సమావేశాల్లో సమగ్రంగా పాల్గొనేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజ్యసభ ప్రివిలేజెస్ ప్యానెల్ ప్రతినిధి మాట్లాడుతూ ఎంపీలందరినీ చర్చల్లో పాల్గొనేందుకు అనుమతిస్తామని, రాష్ట్రపతి ప్రసంగాన్ని గౌరవిస్తామని అంటున్నారు.  సస్పెన్షన్ల ఎత్తివేత నిర్ణయం మరింత సహకారాత్మకంగా .. బడ్జెట్ సమావేశాలు పార్లమెంటరీ చర్చకు, చర్చలకు కీలక అవకాశాన్ని కల్పిస్తాయని అంచనా వేస్తున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP DesamUdhaynidhi Stalin on Pawan Kalyan Comments | పవన్ కళ్యాణ్ కామెంట్స్ కి ఉదయనిధి కౌంటర్లు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు కీలక ప్రకటన చేసిన టీటీడీ
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
WhatsApp New Features: ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
ఇన్‌స్టాగ్రామ్‌ను చూసి వాట్సాప్ వాత పెట్టుకుంటుందా? - స్టేటస్‌లో రెండు కొత్త ఫీచర్లు!
OG Update: 'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
'ఓజి' ఇండస్ట్రీ హిట్, రాసి పెట్టుకోండి... రిలీజ్‌కి ముందే హైప్ పెంచుతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్
World War III : మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
మూడో ప్రపంచయుద్ధం వస్తే ఈ దేశాలు చాలా సేఫ్ - ముందే పాస్‌పోర్టులు, వీసాలు రెడీ చేసుకుంటే మంచిదేమో ?
Tirumala News: తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన
Best Budget Cars: రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
రూ.7.5 లక్షల్లో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్ కార్లలో మామూలు పోటీ లేదుగా!
Embed widget