అన్వేషించండి

Andhra News: దుప్పటికి చలి మంటలంటుకొని వ్యక్తి సజీవ దహనం - వివాహేతర సంబంధంతో ఇద్దరు, ఏపీలో విషాద ఘటనలు

AP News: ఏపీలో వరుస ఘటనల్లో ఓ చిన్నారి సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చలి మంట అంటుకుని ఓ వృద్ధుడు, పాముకాటుకు చిన్నారి, వివాహేతర సంబంధంతో ఇద్దరు, రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

Man Burnt Alive in Vizianagaram: ఏపీలో శుక్ర, శనివారాల్లో కొన్ని విషాద ఘటనలు కలకలం రేపాయి. విజయనగరం (Vijayanagaram) జిల్లాలో ఓ వ్యక్తి చలి మంటలు దుప్పటికి అంటుకొని సజీవదహనం కాగా, కర్నూలు (Kurnool) జిల్లాలో వివాహేతర సంబంధం ఓ ఇద్దరి నిండు ప్రాణాలు బలి తీసుకుంది. ఎన్టీఆర్ (NTR) జిల్లాలో ఓ చిన్నారికి పాముకాటుకు బలవ్వగా, కడప జిల్లా రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

వ్యక్తి సజీవదహనం

విజయనగరం జిల్లా వేపాడ (Vepada) మండలంలోని బొద్దాం గ్రామంలో శుక్రవారం రాత్రి విషాదం జరిగింది. చలి కాచుకునేందుకు మంటలు వేసుకోగా దాని నుంచి నిప్పురవ్వలు ఎగిసి పశువుల పాక దగ్ధమైంది. ఈ క్రమంలో పాకలో నిద్రిస్తోన్న తిమ్మ నాగమయ్య (75), అనే వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. అనారోగ్యంతో మంచం పట్టిన వృద్ధుడు, చలి కాచుకునేందుకు కుంపటి పెట్టగా, మంటలు అంటుకుని ప్రమాదానికి గురైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య సన్యాసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివాహేతర సంబంధంతో ఇద్దరు

కర్నూలు జిల్లాలో నందికొట్కూరులో (Nandikotkuru) శనివారం ఉదయం దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి సదరు మహిళను హతమార్చి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉండే విజయ్ కుమార్ (35) ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. తని ఇంటికి సమీపంలో నివాసం ఉండే రుక్సానా (45) అనే మహిళతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో రుక్సానా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో శుక్రవారం విజయ్ కుమార్, రుక్సానాతో కలిసి కర్నూలులోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. శనివారం ఉదయం వరకూ ఎంతకూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది, తలుపులు బద్దలు కొట్టి చూడగా, ఇద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. విజయ్ కుమార్, రుక్సానాను కత్తితో పొడిచి చంపి, అనంతరం అతను విషం తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పాముకాటుతో బాలుడు

ఎన్టీఆర్ జిల్లా నందిగామ (Nandigama) మండలం పాతకంచలకు చెందిన ఓ మూడున్నరేళ్ల బాలుడు పాముకాటుకు బలయ్యాడు. గ్రామానికి చెందిన నాగకృష్ణ, మౌనిక దంపతుల కుమారుడు చైతన్ ఇంట్లో ఆడుకుంటుండగా, తాచుపాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. అప్పటివరకూ ఇంట్లో ఆడుకుంటూ సందడి చేస్తున్న బాలుడు, విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. 

రోడ్డు ప్రమాదంలో

కడప జిల్లాలోని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామం వద్ద ఓ పెళ్లి బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. మృతుడు కొండాపురం మండలం ముచ్చుమర్రికి చెందిన కొండు నాగసుబ్బారెడ్డిగా గుర్తించారు. బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: CM Jagan capital politics failed : సీఎం జగన్ రాజధాని రాజకీయాలు ఫెయిలయ్యాయా ? ఇక విశాఖ వెళ్లే ఆలోచన ఉండదా ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం! హైదరాబాద్‌లో ఘటన
భార్యను చంపి కట్టు కథ చెప్పిన భర్త.. కూతుళ్ల ఎంట్రీతో బయటపడ్డ దారుణం!
హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
గుడ్ న్యూస్.. హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
Jupally Krishna Rao: ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
ఆరేళ్లుగా మరమ్మతులు చేయరా? బీమా కాలువను పరిశీలించి, అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం
Old Age Viral Love Story: భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు
భార్య మెడికల్ బిల్లు కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ - రూ.4 కోట్ల సాయం చేసిన ప్రజలు

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
Embed widget