అన్వేషించండి

Elephants in Chittoor: ఏనుగులను ఖననం చేసిన ప్రాంతంలో గజరాజుల గుంపు, భయపడిపోయిన స్థానికులు

Elephants in Chittoor: ఇటీవలే కూరగాయల వాహనం ఢీకొని మూడు ఏనుగులు మృతి చెందగా.. వాటిని ఖననం చేశారు. అయితే ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఏనుగుల గుంపులు రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Elephants in Chittoor: చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో ఈ నెల 14వ తేదీ రాత్రి మూడు ఏనుగులు రోడ్డు దాటుతుండగా.. ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కూరగాయల వాహనం ఢీ కొనడంతో అవి మృతి చెందగా.. అటవీ శాఖ అధికారులు వాటిని రహదారికి దగ్గర్లోనే ఖననం చేశారు. అయితే ఇప్పుడు ఆ చోటుకు ఏనుగుల గుంపులు రావడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. అర్ధరాత్రి నుంచి వేకువ జాము వరకు ఓ ఏనుగుల గుంపు అక్కడే సంచరిస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సోమవారం వేకువజామున అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఏనుగులు.. పంట పొలాలు దాటి మూడు ఏనుగులను ఖననం చేసిన ప్రాంతానికి చేరుకుని ఘీంకారాలు చేశాయి. అక్కడే చాలాసేపు నిలబడి చూస్తూ ఉండిపోయాయి. 

అయితే ఈ విషయం గుర్తించిన పలువరు స్థానికులు భయపడుతూనే వీడియోలు తీశారు. అనంతరం ఇదే విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చెప్పి వీడియోను చూపించారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు సంఘటన స్ధలానికి చేరుకుని ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. ఏనుగులు సంచరించిన పాద ముద్రలను కనుకొన్నారు. తోటి ఏనుగులు మృతి చేందడాన్ని జీర్ణించుకోని ఏనుగులు వాటిని ఖననం చేసిన ప్రదేశానికి చేరుకుని‌ గంటల తరబడి అక్కడే ఉండడం చూపరులను కలిచి వేసింది. 

అసలు ఆ మూడు ఏనుగులు ఎలా మృతి చెందాయంటే..?

తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఏనుగుల గుంపు ప్రమాదంలో పడింది. ఈ దుర్ఘటనలో మూడు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. తిరుపతి బెంగుళూరు ‌హైవేపై రోడ్డు దాటతున్న టైమ్ఏ లో ఈ ప్రమాదం జరిగింది..రోడ్డు దాటుతుండగా ఏనుగుల గుంపును ఓ లారీ ఢీ కొట్టింది. దీంతో మూడు ఏనుగులు మృతి చెందాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు లారీ ఢీకొనడంతో ఏనుగులు రోడ్డుకు అవతల ఎగిరి పడ్డాయి. ప్రమాదంలో లారీ కూడా దెబ్బ తిన్నది. లారీ తీసుకు వెళుతున్న కూరగాయలు కింద  పడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే లారీని విడిచి పెట్టి డ్రైవర్ పరారయ్యాడు. ఈ మధ్య కాలంలో ఏనుగులు తరచూ జనావాసాల్లోకి ఫలితంగా అవి ప్రమాద బారిన పడటమో లేకంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే చేస్తున్నాయి. కొన్ని సార్లు పంటలను కూడా నాశనమం చేస్తున్నాయి.  

మే నెలలో విద్యుత్‌ షాక్‌తో ఏనుగులు మృతి

మేలో  పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పొలాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌కు తాకి ఏనుగులు మృతి చెందాయని స్థానికులు తెలిపారు.

ఒడిశా నుంచి వచ్చిన ఆరు ఏనుగుల గుంపు గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో సంచరిస్తోంది. ఆ గుంపులోని నాలుగు ఏనుగులు గురువారం రాత్రి విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా.. మరో రెండు ఏనుగులు తప్పించుకుని సమీపంలోని తువ్వ కొండవైపు వెళ్లిపోయాయని తెలిపారు. మృతి చెందిన ఏనుగుల్లో ఒకటి మగ, మూడు ఆడ ఏనుగులు ఉన్నట్లు అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!
Embed widget