అన్వేషించండి

Elephants in Chittoor: ఏనుగులను ఖననం చేసిన ప్రాంతంలో గజరాజుల గుంపు, భయపడిపోయిన స్థానికులు

Elephants in Chittoor: ఇటీవలే కూరగాయల వాహనం ఢీకొని మూడు ఏనుగులు మృతి చెందగా.. వాటిని ఖననం చేశారు. అయితే ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఏనుగుల గుంపులు రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Elephants in Chittoor: చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో ఈ నెల 14వ తేదీ రాత్రి మూడు ఏనుగులు రోడ్డు దాటుతుండగా.. ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కూరగాయల వాహనం ఢీ కొనడంతో అవి మృతి చెందగా.. అటవీ శాఖ అధికారులు వాటిని రహదారికి దగ్గర్లోనే ఖననం చేశారు. అయితే ఇప్పుడు ఆ చోటుకు ఏనుగుల గుంపులు రావడం స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. అర్ధరాత్రి నుంచి వేకువ జాము వరకు ఓ ఏనుగుల గుంపు అక్కడే సంచరిస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సోమవారం వేకువజామున అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఏనుగులు.. పంట పొలాలు దాటి మూడు ఏనుగులను ఖననం చేసిన ప్రాంతానికి చేరుకుని ఘీంకారాలు చేశాయి. అక్కడే చాలాసేపు నిలబడి చూస్తూ ఉండిపోయాయి. 

అయితే ఈ విషయం గుర్తించిన పలువరు స్థానికులు భయపడుతూనే వీడియోలు తీశారు. అనంతరం ఇదే విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చెప్పి వీడియోను చూపించారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు సంఘటన స్ధలానికి చేరుకుని ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. ఏనుగులు సంచరించిన పాద ముద్రలను కనుకొన్నారు. తోటి ఏనుగులు మృతి చేందడాన్ని జీర్ణించుకోని ఏనుగులు వాటిని ఖననం చేసిన ప్రదేశానికి చేరుకుని‌ గంటల తరబడి అక్కడే ఉండడం చూపరులను కలిచి వేసింది. 

అసలు ఆ మూడు ఏనుగులు ఎలా మృతి చెందాయంటే..?

తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఏనుగుల గుంపు ప్రమాదంలో పడింది. ఈ దుర్ఘటనలో మూడు ఏనుగులు మృత్యువాత పడ్డాయి. తిరుపతి బెంగుళూరు ‌హైవేపై రోడ్డు దాటతున్న టైమ్ఏ లో ఈ ప్రమాదం జరిగింది..రోడ్డు దాటుతుండగా ఏనుగుల గుంపును ఓ లారీ ఢీ కొట్టింది. దీంతో మూడు ఏనుగులు మృతి చెందాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు లారీ ఢీకొనడంతో ఏనుగులు రోడ్డుకు అవతల ఎగిరి పడ్డాయి. ప్రమాదంలో లారీ కూడా దెబ్బ తిన్నది. లారీ తీసుకు వెళుతున్న కూరగాయలు కింద  పడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే లారీని విడిచి పెట్టి డ్రైవర్ పరారయ్యాడు. ఈ మధ్య కాలంలో ఏనుగులు తరచూ జనావాసాల్లోకి ఫలితంగా అవి ప్రమాద బారిన పడటమో లేకంటే ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే చేస్తున్నాయి. కొన్ని సార్లు పంటలను కూడా నాశనమం చేస్తున్నాయి.  

మే నెలలో విద్యుత్‌ షాక్‌తో ఏనుగులు మృతి

మేలో  పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పొలాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌కు తాకి ఏనుగులు మృతి చెందాయని స్థానికులు తెలిపారు.

ఒడిశా నుంచి వచ్చిన ఆరు ఏనుగుల గుంపు గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో సంచరిస్తోంది. ఆ గుంపులోని నాలుగు ఏనుగులు గురువారం రాత్రి విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా.. మరో రెండు ఏనుగులు తప్పించుకుని సమీపంలోని తువ్వ కొండవైపు వెళ్లిపోయాయని తెలిపారు. మృతి చెందిన ఏనుగుల్లో ఒకటి మగ, మూడు ఆడ ఏనుగులు ఉన్నట్లు అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'

వీడియోలు

World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
APSRTC employees: ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్‌గా మారిన ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - వేరే శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం
ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్‌గా మారిన ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - వేరే శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం
Upcoming Smartphones in 2026: కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లు.. Oppo నుంచి Vivo వరకు పూర్తి జాబితా
కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లు.. Oppo నుంచి Vivo వరకు పూర్తి జాబితా
Chiranjeevi Venkatesh Song: చిరు - వెంకీల 'మెగా విక్టరీ మాస్' సాంగ్ రెడీ... రిలీజ్ ఎప్పుడంటే?
చిరు - వెంకీల 'మెగా విక్టరీ మాస్' సాంగ్ రెడీ... రిలీజ్ ఎప్పుడంటే?
Venkatrama and Co Calendar : వెంకట్రామా &కో క్యాలెండర్‌కు వందేళ్లు! ఇది క్యాలెండర్ కాదు, తెలుగువాడి ఎమోషన్
వెంకట్రామా &కో క్యాలెండర్‌కు వందేళ్లు! ఇది క్యాలెండర్ కాదు, తెలుగువాడి ఎమోషన్
Embed widget