అన్వేషించండి

G20 Summit: దిల్లీలో డ్రోన్‌ ఎగరేయడంతో చిక్కులు, ఐఎఫ్ఆర్‌ నమోదుచేసిన పోలీసులు

G20 Summit: దిల్లీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జీ 20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి డ్రోన్‌ కెమెరాను ఆకాశంలోకి ఎగరేసి చిక్కుల్లో పడ్డారు. పోలీసులు ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

దేశ రాజధాని దిల్లీ నగరంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జీ 20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ప్రపంచ దేశాధినేతలకు ఆతిథ్యం  ఇచ్చేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. వివిధ దేశాధినేతలు ఇక్కడికి వస్తుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రతాపరమైన చర్యలు పటిష్ఠంగా ఉన్నాయి. దీంతో సెంట్రల్‌ దిల్లీలోని పటేల్‌ నగర్‌లో ఓ వ్యక్తి డ్రోన్‌ కెమెరాను ఆకాశంలోకి ఎగరేసి చిక్కుల్లో పడ్డారు. పోలీసులు ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

పటేల్‌ నగర్‌ ప్రాంతంలో ఓ బర్త్‌డే పార్టీ జరుగుతుండగా అక్కడ ఫంక్షన్‌ను కవర్‌ చేసేందుకు వచ్చిన ఫొటోగ్రాఫర్స్‌ వీడియో తీసేందుకు డ్రోన్‌ కెమెరాను గాల్లోకి ఎగరేసారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. తదుపరి విచారణ జరగనున్నట్లు తెలిపారు. పోలీసులు, ఇతర అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా డ్రోన్‌ ఎగరేసినందుకు ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. జీ 20 సదస్సు నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో డ్రోన్లు ఎగరవేయొద్దని నిబంధనలు పెట్టారు. సమావేశాలకు ఎలాంటి రాకూడదనే ఉద్దేశంతో దిల్లీ పోలీసులు చాలా అలర్ట్‌గా ఉన్నారు. ఏ చిన్న ఘటన జరిగినా కూడా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నారు. సెక్యురిటీ పెంచేందుకు పోలీసులు సదస్సు సమయంలో నో ఫ్టై జోన్‌ అని నిబంధనలు విధించారు. ట్రాఫిక్‌ మళ్లింపు నిబంధనలు కూడా పెట్టారు. సదస్సు ముగిసే వరకుయ అందరూ కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే.
దిల్లీలో దేశాధినేతలు తిరిగే ప్రాంతాన్ని కంట్రోల్డ్‌ జోన్‌ -`1 గా చేశారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి ఆదివారం రాత్రి 11.59 వరకు ఈ నిబంధనలు అమలులో ఉండనున్నాయి. 

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్‌ ప్లేన్స్‌ను స్టాండ్‌బై మోడ్‌లో అందుబాటులో ఉంచారు. దిల్లీ ఆకాశంలో ఏ మాత్రం అనుమానాస్పదంగా అనిపించినా వెంటనే స్పందించే విధంగా ఏర్పాట్లు చేశారు. యూఏవీ, డ్రోన్లకు కూడా అనుమతి లేదు. ఇందుకు సంబంధించి ఆగస్టు 29వ తేదీనే అధికారులు రాజధాని దిల్లీ నగరాన్ని నో ఫ్లై జోన్‌గా చేస్తున్నట్లు చెప్పారు.

జీ 20 శిఖరాగ్ర సదస్సు భారత్‌లో ఎంతో ఘనంగా నేడు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ స్వయంగా దేశాధినేతలకు భారత మండపం వద్ద స్వాగతం పలికారు. జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, యూకే ప్రధాని రిషి సునాక్‌ సహా కెనడా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, యూరోపియన్‌ యూనియన్‌, జపాన్‌, మారిషస్‌ ఇలా 19 దేశాల నుంచి ప్రతినిధులు భారత్‌కు విచ్చేశారు. వీరి కోసం రాజధానిలోని లగ్జరీ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. దేశాధినేతలు, ప్రతినిధులు, అధికారులు, వారి సెక్యురిటీ సిబ్బంది ఇలా వేల మంది దిల్లీ, పక్కన ఉన్న గుర్‌గ్రామ్‌లలోని హోటళ్లలో బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీలో సెక్యురిటీ కట్టుదిట్టంగా ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా భద్రత చాలా కఠినంగా ఉంటుంది. రష్యా, చైనా దేశాధినేతలు సమావేశాలకు హాజరుకావడం లేదు. వారికి బదులుగా ఇతర ప్రతినిధులు సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Adilabad Politics: నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
Maharashtra Municipal Election Result: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు- 2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పూర్తి వివరాలివే
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు- 2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పూర్తి వివరాలివే
Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
Teeth Enamel: దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Politics: నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
నేడు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్
Maharashtra Municipal Election Result: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు- 2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పూర్తి వివరాలివే
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు- 2017లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పూర్తి వివరాలివే
Washington Sundar: న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్ దూరం! టీ20 ప్రపంచ కప్ ఆడటంపై అనుమానం!
Teeth Enamel: దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
దంతాల ఎనామిల్‌ ఎలా కాపాడుకోవాలి? 27% భారతీయుల్లో మీరు ఉన్నారా?
తొలి ఎలక్ట్రిక్ కారు Urban Cruiser BEV తెస్తున్న టయోటా.. ఒక్క ఛార్జ్‌తో 500 KM రేంజ్
తొలి ఎలక్ట్రిక్ కారు Urban Cruiser BEV తెస్తున్న టయోటా.. ఒక్క ఛార్జ్‌తో 500 KM రేంజ్
Beer Bottle Colors : బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
బీరు సీసా ఆకుపచ్చ లేదా గోధుమ రంగులోనే ఎందుకు ఉంటాయి? కారణం ఇదే
Simple Ways to Keep Rats Away : ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
ఇంట్లో ఎలుకలు ఇబ్బంది పెడుతున్నాయా? Ratsని తరిమేసే ఇంటి చిట్కాలు ఇవే
Adilabad Murder Case: ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
ఒంటరి దగ్గర డబ్బులు అప్పు తీసుకుని చెల్లించాలసి వస్తుందని చంపేశారు - ఆదిలాబాద్‌లో దారుణం
Embed widget