అన్వేషించండి

Best Verdicts Laws In India: భారత్‌లో చరిత్రాత్మక చట్టాలు, తీర్పులు - అవేంటంటే?

దేశ చరిత్రలో ఎన్నో విప్లవాత్మక చట్టాలు అమల్లోకి వచ్చాయి. వాటితో పాటు కొన్ని కీలక కేసుల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులూ చరిత్రాత్మకంగా నిలిచిపోయాయి.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ భారత్‌లో ఎన్నో చట్టాలు వచ్చాయి. వాటిలో కొన్ని దేశ గతినే మార్చేశాయి. మరికొన్ని దేశ ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా ఓ సారి అవేంటో చూద్దాం. 

భారత్‌లో అమలైన కీలక చట్టాలివే 

1. 1976లో ఓ కీలక చట్టం అమల్లోకి వచ్చింది. అదే వెట్టిచాకిరీ నిర్మూలనా చట్టం. ఓ వ్యక్తి వద్ద అప్పు తీసుకుంటే, ఆ అప్పు తీర్చేంత వరకూ వెట్టి చాకిరీ చేయాల్సి వచ్చేది. ఈ కారణంగా కొందరు జీవితాంతం అలా కొందరికి ఊడిగం చేస్తూనే ఉండేవారు. ఈ హింసను భరించలేక కొందరు ప్రాణాలు కూడా విడిచారు. ఈ సమస్యకు పరిష్కారంగానే వెట్టిచాకిరీ నిర్మూలనా చట్టం అమల్లోకి తీసుకొచ్చారు. అప్పు చెల్లించాలనే సాకుతో పని చేయించుకునే వారు శిక్షార్హులు అని అప్పటి ప్రభుత్వం తేల్చి చెప్పింది. 

2. 1950ల్లో వచ్చిన అత్యంత ముఖ్యమైన చట్టాల్లో హిందూ కోడ్ బిల్స్ ఒకటి. హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ మైనార్టీ అండ్ గార్డియన్‌షిప్ యాక్ట్, హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటేనెన్స్ యాక్ట్..ఈ వరుసలో ఉన్నాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం... అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా నిర్ధరించగా, అబ్బాయిలకు 21 ఏళ్లుగా నిర్ణయించారు. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి అంగీకారంతోనే పెళ్లి జరగాలని స్పష్టం చేసింది హిందూ మ్యారేజ్ యాక్ట్. అయితే ఇది కేవలం ఓ వర్గానికి సంబంధించి చేసిన చట్టం వల్ల అప్పట్లో కాస్త వివాదాస్పదమైంది. అయితే ఇటీవల అమ్మాయిలకు కనీస వివాహ వయసు 21 ఏళ్లకు పెంచింది కేంద్రం. 

3. భారత్‌లో అమల్లోకి వచ్చిన అత్యంత కీలకమైన చట్టాల్లో విద్యాహక్కు చట్టం ఎంతో ప్రత్యేకం. విద్య అనేది భారత పౌరుల ప్రాథమిక హక్కు అని తేల్చి చెప్పింది. "ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిపుచ్చుకోవటం భారత్‌లోని ప్రతి పౌరుని హక్కు" అని ఆ చట్టం తేల్చి చెప్పింది. 6-14 మధ్య వయసున్న పిల్లలందరూ కచ్చితంగా స్కూల్‌లో అడ్మిషన్ తీసుకుని చదువుకోవాలని నిబంధన విధించింది. 

4. క్రిమినల్‌ లా అమెండ్‌మెంట్ యాక్ట్-2013లో భాగంగా అత్యాచార కేసుల్లో నిందితులకు శిక్ష పెంచారు. 20ఏళ్లకు తగ్గకుండా నేరస్థులకు శిక్ష పడేలా చేయటంతో పాటు, ఆ శిక్షను పొడిగించి జీవితకాల ఖైదునీ అమలు చేసేలా క్రిమినల్‌లా లో సవరణలు చేశారు. అవసరమైతే మరణశిక్షకూ వెనకాడొద్దని తేల్చి చెప్పింది ఈ చట్టం. 

5. మహిళా హక్కులకు ప్రాధాన్యతనిచ్చేలా ట్రిపుల్ తలాక్ చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం 'ఇన్‌స్టెంట్ ట్రిపుల్ తలాక్'ను నేరంగా పరిగణిస్తారు. మూడుసార్లు తలాక్ చెప్పి ముస్లిం భర్తలు తమ భార్యలకు విడాకులు ఇవ్వటం నేరం. ఒకవేళ అలా విడాకులు పొందిన మహిళ ఫిర్యాదు చేస్తే.. ట్రిపుల్ తలాక్ ఇచ్చిన భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం కల్పించింది ఈ చట్టం. 

6. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్ము, కశ్మీర పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని 2019లో అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా జమ్ము, కశ్మీర్‌ను విడగొట్టి జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. స్థానిక భూములపై స్థానికులకే హక్కు ఉండేలా ఈ చట్టం అవకాశం కల్పించింది. కశ్మీరీ యువతకు ఉపాధి అవకాశాలు చూపించటం సహా, ఆ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని అణిచివేయటమే తమ లక్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది. 

సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పులు 

ఇక రాజ్యాంగాన్ని అనుసరించి భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఎన్నో చారిత్రక తీర్పులు ఇచ్చింది. ఈ తీర్పులు తర్వాతి రోజుల్లో ఎన్నో కేసులకు పాఠ్యాంశాలుగా మారాయి. అలాంటి చారిత్రక తీర్పులను ఓసారి చూద్దాం. 

1. ఏకే గోపాలన్ Vs మద్రాస్ రాష్ట్రం, 1950
ఏకే గోపాలన్ ఓ కమ్యూనిస్టు లీడర్. 1950లో ముందస్తు నిర్బంధ చట్టం (Preventive Detention Law) కింద ఆయనను మద్రాస్ జైలులో పెట్టారు. అప్పుడు రాజ్యంగంలోని ఆర్టికల్ 32 ఆధారంగా హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేసి తన నిర్బంధాన్ని ఏకే గోపాలన్ సవాల్ చేశారు. సెక్షన్లు 7, 8, 10, 11, 12, 13, 14లు ఆర్టికల్ 13, 19, 21లను అతిక్రమిస్తున్నాయని ఆయన వాదించారు. 

తీర్పు


ఈ తీర్పు సందర్భంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 ఒక స్వతంత్ర కోడ్ అని సుప్రీంకోర్టు పేర్కొంది. సిస్టమ్ రూపొందించిన చట్ట వ్యవస్థ కింద గోపాలన్‌ను నిర్బంధించారని తెలిపింది. ఒక వేళ చట్ట ప్రకారం రూపొందించిన వ్యవస్థ ద్వారా వ్యక్తి స్వేచ్ఛను హరిస్తూ నిర్బంధించినప్పుడు ఆ వ్యవస్థ ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘించినట్టు కాదని స్పష్టం చేసింది.

అంతేకాదు, సెగ్మెంట్ 14ను సుప్రీంకోర్టు తొలగించింది. ఇది కీలక హక్కులను ఉల్లంఘిస్తున్నదని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. ఆ రిట్ పిటిషన్‌ను తొలగిస్తూ ఏకే గోపాలన్ నిర్బంధం చట్టబద్ధమేనని చారిత్రక తీర్పును ఇచ్చింది.

2. కేశవానంద భారతి Vs కేరళ, 1973
భారత న్యాయవ్యవస్థలో కేశవానంద భారతి కేసును చాలా ప్రత్యేకంగా పేర్కొంటారు. 1970లో ఈ పిటిషన్ ఫైల్ అయింది. ఎదినీర్ మఠానికి కేశవానంద భారతి మఠాధిపతి. కేరళ, కాసర్‌గోడ్‌లో ఈ మఠం ఉంది. అయితే ఆయన పేరు మీద ఆయన కొన్ని భూములను కొనుగోలు చేశారు. అదే సమయంలో అప్పటి కేరళ ప్రభుత్వం భూసంస్కరణల చట్టం 1969ని అమలు చేసింది. దీంతో ఆయన కేసు పెట్టారు.

తీర్పు

ఈ కేసును 13 మంది న్యాయమూర్తులతో కూడిన అతిపెద్ద సుప్రీం ధర్మాసనం విచారించింది. 7-6 రేషియోతో ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు రాజ్యాంగం మౌలిక స్వభావం, దాని సుస్థిరత్వానికి బీజాలు వేసింది.

పార్లమెంటు చట్టం రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించడానికి అర్హమేనని పేర్కొంది. ప్రాథమిక హక్కులు సహా అన్నింటిని పార్లమెంటు సవరించగలదని తెలిపింది. అయితే ఏ సవరణ చేసినా రాజ్యాంగ మౌలిక స్వభావం, దాని ప్రాథమిక నిర్మాణం కోల్పోకుండా ఉండాలని వివరించింది. ఈ నిర్మాణాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా కూడా మార్చలేరని తన చారిత్రక తీర్పులో స్పష్టం చేసింది. 


౩. ఎస్ఆర్ బొమ్మై Vs కేంద్ర ప్రభుత్వం, 1994
జనతా దళ్ ప్రభుత్వంలో కర్ణాటకకు ఎస్ఆర్ బొమ్మై 1988 ఆగస్టు 13 నుంచి 1989 ఏప్రిల్ 21 వరకు సీఎంగా చేశారు. 1989 ఏప్రిల్ 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ పాలనను ఆర్టికల్ 356ను ఉటంకిస్తూ రాష్ట్రపతి నిలిపేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తెచ్చారు.

ఇది సాధారణంగా ప్రతిపక్షాల ప్రభుత్వాన్ని తమ కంట్రోల్‌లోకి తెచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వేసే ఎత్తుగడ వంటిది. దీంతో రాష్ట్ర గవర్నర్‌ ఆదేశాలను వ్యతిరేకిస్తూ తమ ప్రభుత్వాన్ని తొలగించడాన్ని సవాల్ చేస్తూ బొమ్మై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కానీ, కర్ణాటక హైకోర్టు ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

తీర్పు

ఈ పిటిషన్‌ను తొమ్మిది మంది సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం విచారించింది. 1994 మార్చి 11న సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే పూర్తి అధికారం రాష్ట్రపతికి ఉండదని సుప్రీం కోర్టు తేల్చింది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి తన అధికారాన్ని ఉపయోగించాల్సి ఉంటుందని వివరించింది. అప్పటి వరకు రాష్ట్ర శాసన సభను సస్పెండ్ చేసే అధికారం మాత్రమే రాష్ట్రపతికి ఉంటుందని తెలిపింది. 

Also Read: Women Freedom Fighters : బ్రిటిష్ వారికే దడ పుట్టించిన మహిళా స్వాతంత్ర్య సమరయోధులు - వీరి గురించి ఎక్కువ మందికి తెలియదు ! ఇవిగో వారి విశేషాలు

టాప్ హెడ్ లైన్స్

Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Japan Illegal Mosque Inauguration: జపాన్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ - పర్మిషన్ లేని మసీదును ప్రారంభించిన రాయబారి.. కూల్చివేతకు జపాన్ ఆర్డర్!
జపాన్‌లో పాకిస్తాన్‌కు ఊహించని షాక్ - పర్మిషన్ లేని మసీదును ప్రారంభించిన రాయబారి.. కూల్చివేతకు జపాన్ ఆర్డర్!
Breaking News: తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
కొత్త Tata Tiago EV Faceliftను ఏ ధరకు బుక్ చేసుకోవచ్చు? బుకింగ్ ప్రాసెస్ ఇదే
కొత్త Tata Tiago EV Faceliftను ఏ ధరకు బుక్ చేసుకోవచ్చు? బుకింగ్ ప్రాసెస్ ఇదే

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
Embed widget