అన్వేషించండి

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు.

5G Launch India: 

ఢిల్లీ వేదికగా..

ప్రధాని నరేంద్ర మోదీ రేపు (అక్టోబర్ 1వ తేదీన) అధికారికంగా 5G సేవలు ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇదే సమయంలో Indian Mobile Congress (IMC) ఆరో ఎడిషన్‌నూ ప్రారంభిస్తారు. IMC 2022, అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకూ కొనసాగనుంది. "న్యూ డిజిటల్ యూనివర్స్" థీమ్‌తో ఈ సారి ఈవెంట్స్ జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీపై చర్చిస్తారు. వాటిని అందిపుచ్చుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో అభిప్రాయాలు పంచుకుంటారు. కొత్త అవకాశాలు సృష్టించేందుకూ...ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్..వేదికగా మారనుంది. 
డిజిటల్ టెక్నాలజీపై ఈ సారి ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నారు. గతంలో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ 5G సర్వీస్‌లపై కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 12వ తేదీ నుంచి భారత్‌లో 5G సేవలు మొదలవుతాయని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే...ఇప్పుడు ప్రధాని మోదీ రేపు ఈ సేవల్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే 5జీ స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహించింది. 2017లో తొలిసారి ఐదవ తరం (5G) వాయు తరంగాలను వేలం వేయాలని ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది. ధరలు ఎక్కువగా ఉన్నాయని భావించిన టెలికాం కంపెనీలు ఇందుకు దూరంగా ఉన్నాయి. ఈసారి రూ.4.3 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినా చివరికు  రూ. 1.5 లక్షల కోట్లకు వాయు తరంగాలను విక్రయించింది. ఇటీవలి స్పెక్ట్రమ్ బిడ్‌లు అనేక విధాలుగా విజయవంతం అయ్యాయి. ఎందుకంటే 2017లో 3000 MHz బ్యాండ్‌లలో 5G ఎయిర్‌వేవ్‌ ప్రతిపాదిత విక్రయం పూర్తవ్వలేదు.  800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 మెగాహెర్జ్ బ్యాండ్ (megaherzt) స్పెక్ట్రమ్ అమ్ముడవ్వలేదు. దాంతో వేలాన్ని వాయిదా వేయాలని టెలికాం కంపెనీలు పోరాడగా TRAI సంప్రదింపులు జరిపి విజయవంతం చేసింది.

రికార్డు స్థాయిలో బిడ్‌లు..

ప్రభుత్వం గతేడాది మార్చిలో 5G స్పెక్ట్రమ్ బిడ్‌లను ప్రారంభించినా మొత్తం స్పెక్ట్రమ్‌లో కేవలం 37 శాతాన్ని మాత్రమే విక్రయించగలిగింది. కేవలం రూ.77,815 కోట్లను మాత్రమే ఆర్జించింది. 700 MHz, 2500 MHz బ్యాండ్‌ల ధర అతిగా ఉందని భావించడంతో లాభాల్లో ఉన్న 
రిలయన్స్ జియో సైతం కొనుగోలు చేయలేదు.  రెండు వారాల క్రితం నిర్వహించిన స్పెక్ట్రమ్ వేలం మాత్రం విజయవంతమైంది. తొలిసారి 700 MHz స్పెక్ట్రమ్‌ను సైతం విక్రయించగలిగింది. దాంతో గతేడాదితో కన్నా రెట్టింపు, రూ. 1.5 లక్షల కోట్లను ఆర్జించింది. 51 GHz స్పెక్ట్రమ్‌తో పాటు 
మొత్తం 72 GHz ఎయిర్‌వేవ్‌లలో 71 శాతాన్ని 22 టెలికాం సర్కిళ్లలో  రూ.1.5 లక్షల కోట్లకు ($19 బిలియన్) విక్రయించడం దూకుడైన చర్యేనని యూబీఎస్‌ అంచనా వేసింది. '2-3 ఏళ్లుగా దశల వారీగా కాకుండా ఒకేసారి దేశవ్యాప్తంగా 3300MHz కొనుగోలు చేసిన టెలికాం ఆపరేటర్ల వ్యూహాన్ని మేము అర్థం చేసుకున్నాం. ఖరీదైన 700MHz బ్యాండ్‌లో 10MHz స్పెక్ట్రమ్‌ను జియో దేశవ్యాప్తంగా కొనుగోలు చేయడం ఆశ్యర్యం కలిగించింది' అని యూబీఎస్‌ తెలిపింది.

Also Read: Kanpur News: హాస్టల్‌లో బాలికల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Dil Raju Trolls Tamil Trollers | Family Star తమిళ్ ప్రమోషన్స్ లో దిల్ రాజు ఫన్ | ABP DesamCM Revanth Reddy on Phone Tapping | ఫోన్ ట్యాపింగు కేసులో KTR పై CM Revanth Reddy సంచలన వ్యాఖ్యలుKadiyam Srihari Joins Congress | కాంగ్రెస్ నేతలతో కడియం భేటీ..మరి పాతమాటల సంగతేంటీ.? | ABP DesamPrabhakar Chowdary Followers Angry | ప్రభాకర్ చౌదరికి టీడీపీ దక్కకపోవటంపై టీడీపీ నేతల ఫైర్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Embed widget