అన్వేషించండి

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు.

5G Launch India: 

ఢిల్లీ వేదికగా..

ప్రధాని నరేంద్ర మోదీ రేపు (అక్టోబర్ 1వ తేదీన) అధికారికంగా 5G సేవలు ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇదే సమయంలో Indian Mobile Congress (IMC) ఆరో ఎడిషన్‌నూ ప్రారంభిస్తారు. IMC 2022, అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకూ కొనసాగనుంది. "న్యూ డిజిటల్ యూనివర్స్" థీమ్‌తో ఈ సారి ఈవెంట్స్ జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీపై చర్చిస్తారు. వాటిని అందిపుచ్చుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో అభిప్రాయాలు పంచుకుంటారు. కొత్త అవకాశాలు సృష్టించేందుకూ...ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్..వేదికగా మారనుంది. 
డిజిటల్ టెక్నాలజీపై ఈ సారి ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నారు. గతంలో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ 5G సర్వీస్‌లపై కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 12వ తేదీ నుంచి భారత్‌లో 5G సేవలు మొదలవుతాయని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే...ఇప్పుడు ప్రధాని మోదీ రేపు ఈ సేవల్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే 5జీ స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహించింది. 2017లో తొలిసారి ఐదవ తరం (5G) వాయు తరంగాలను వేలం వేయాలని ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది. ధరలు ఎక్కువగా ఉన్నాయని భావించిన టెలికాం కంపెనీలు ఇందుకు దూరంగా ఉన్నాయి. ఈసారి రూ.4.3 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినా చివరికు  రూ. 1.5 లక్షల కోట్లకు వాయు తరంగాలను విక్రయించింది. ఇటీవలి స్పెక్ట్రమ్ బిడ్‌లు అనేక విధాలుగా విజయవంతం అయ్యాయి. ఎందుకంటే 2017లో 3000 MHz బ్యాండ్‌లలో 5G ఎయిర్‌వేవ్‌ ప్రతిపాదిత విక్రయం పూర్తవ్వలేదు.  800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 మెగాహెర్జ్ బ్యాండ్ (megaherzt) స్పెక్ట్రమ్ అమ్ముడవ్వలేదు. దాంతో వేలాన్ని వాయిదా వేయాలని టెలికాం కంపెనీలు పోరాడగా TRAI సంప్రదింపులు జరిపి విజయవంతం చేసింది.

రికార్డు స్థాయిలో బిడ్‌లు..

ప్రభుత్వం గతేడాది మార్చిలో 5G స్పెక్ట్రమ్ బిడ్‌లను ప్రారంభించినా మొత్తం స్పెక్ట్రమ్‌లో కేవలం 37 శాతాన్ని మాత్రమే విక్రయించగలిగింది. కేవలం రూ.77,815 కోట్లను మాత్రమే ఆర్జించింది. 700 MHz, 2500 MHz బ్యాండ్‌ల ధర అతిగా ఉందని భావించడంతో లాభాల్లో ఉన్న 
రిలయన్స్ జియో సైతం కొనుగోలు చేయలేదు.  రెండు వారాల క్రితం నిర్వహించిన స్పెక్ట్రమ్ వేలం మాత్రం విజయవంతమైంది. తొలిసారి 700 MHz స్పెక్ట్రమ్‌ను సైతం విక్రయించగలిగింది. దాంతో గతేడాదితో కన్నా రెట్టింపు, రూ. 1.5 లక్షల కోట్లను ఆర్జించింది. 51 GHz స్పెక్ట్రమ్‌తో పాటు 
మొత్తం 72 GHz ఎయిర్‌వేవ్‌లలో 71 శాతాన్ని 22 టెలికాం సర్కిళ్లలో  రూ.1.5 లక్షల కోట్లకు ($19 బిలియన్) విక్రయించడం దూకుడైన చర్యేనని యూబీఎస్‌ అంచనా వేసింది. '2-3 ఏళ్లుగా దశల వారీగా కాకుండా ఒకేసారి దేశవ్యాప్తంగా 3300MHz కొనుగోలు చేసిన టెలికాం ఆపరేటర్ల వ్యూహాన్ని మేము అర్థం చేసుకున్నాం. ఖరీదైన 700MHz బ్యాండ్‌లో 10MHz స్పెక్ట్రమ్‌ను జియో దేశవ్యాప్తంగా కొనుగోలు చేయడం ఆశ్యర్యం కలిగించింది' అని యూబీఎస్‌ తెలిపింది.

Also Read: Kanpur News: హాస్టల్‌లో బాలికల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

 

టాప్ హెడ్ లైన్స్

Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
GenZ Protests Dharmendra Pradhan Resignation: నాడు రైతులు - నేడు జెన్‌జీ - ప్రజాఉద్యమాలకు మోదీ సర్కారైనా తలొగ్గాల్సిందే !
నాడు రైతులు - నేడు జెన్‌జీ - ప్రజాఉద్యమాలకు మోదీ సర్కారైనా తలొగ్గాల్సిందే !
Dharmendra Pradhan Letter Summary: ధర్మేంద్ర ప్రధాన్ దేశ యువతకు రాసిన లేఖలో ఏం ఉంది? పూర్తి వివరాలు ఇవే!
ధర్మేంద్ర ప్రధాన్ దేశ యువతకు రాసిన లేఖలో ఏం ఉంది? పూర్తి వివరాలు ఇవే!
Breaking News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Brazil Match Kolkata: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Embed widget