అన్వేషించండి

UP Rains: పిడుగుపాటుకు ఒక్కరోజులోనే 38 మంది మృతి, బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే

Uttar Pradesh Rains: ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక్కరోజులోనే పిడుగుపాటుకు గురై 38 మంది ప్రాణాలు కోల్పోయారు.

Lightning Strikes: యూపీలో భారీ వర్షాలు సతమతం చేస్తున్నాయి. ఇప్పటికే వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఏరియల్ సర్వే చేపట్టి ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అయితే..ఇప్పటికే వర్షాలతో ప్రాణనష్టం నమోదవుతోంది. ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తున్నాయి. ఒక్క రోజులోనే పిడుగులు పడిన కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. పిడుగుల కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతాప్‌గఢ్‌లోనే 11 మంది మృతి చెందారు. ఆ తరవాత సుల్తాన్‌పుర్, మణిపురి, ప్రయాగ్‌రాజ్‌ సహా మరి కొన్ని ప్రాంతాల్లో మరణాలు నమోదయ్యాయి. ప్రతాప్‌గఢ్‌లో మొత్తం 5 చోట్ల పిడుగులు పడ్డాయి. ఈ ఘటనల్లో చనిపోయిన 11 మంది మృతదేహాల్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. చండౌలి ప్రాంతంలో పిడుగుపాటు కారణంగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతానికి వాళ్లని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ జిల్లాలో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగులు పడ్డాయి. 

బాధితుల్లో ఎక్కువ మంది 13-15 ఏళ్ల వాళ్లే ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. పొలంలో పని చేస్తుండగా కొందరు, చేపలు పడుతూ మరి కొందరు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. సుల్తాన్‌పుర్‌లో చనిపోయిన ఏడుగురిలో ముగ్గురు చిన్నారులే ఉన్నట్టు అధికారులు తెలిపారు. మామిడి కాయలు కోస్తుండగా ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. వర్షం పడుతోందని చెట్టు కిందకు వెళ్లగా ఓ మహిళపై పిడుగు పడి చనిపోయింది. ఓ 14 ఏళ్ల బాలుడు వర్షంలో తడుస్తున్నానని పరిగెత్తి ఓ చెట్టు కింద నిలబడ్డాడు. సరిగ్గా అదే సమయంలో పిడుగు పడి చనిపోయాడు. మరో చోట ఐదేళ్ల బాలిక ఇలాగే చనిపోయింది. ఆమె తల్లిదండ్రులు పొలంలో పని చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇలా పలు చోట్ల ఈ విషాదాలు చోటు చేసుకున్నాయి. మరో 5 రోజుల పాటు యూపీలో ఇవే పరిస్థితులు ఉంటాయని IMD అంచనా వేసింది. భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు యోగి సర్కార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించింది. వరదల్ని కట్టడి చేసి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. నదులన్నీ ఉప్పొంగుతుండడం వల్ల ఈ స్థాయిలో వరదలు వచ్చాయని చెప్పారు. 12 జిల్లాల్లో దాదాపు 17 లక్షల మంది వరదలకు బాధితులయ్యారని వివరించారు. NDRF, SDRFతో సహా మరి కొన్ని టీమ్స్ సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. 

Also Read: Viral News: టేకాఫ్‌ అవుతుండగా పేలిన ఫ్లైట్ టైర్, ఒక్కసారిగా మంటలు - వీడియో వైరల్

టాప్ హెడ్ లైన్స్

Rains In AP and Telangana: రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: ఐఎండీ
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
ABP Desam Top 10, 24 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 24 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget