అన్వేషించండి

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 3 కరోనా కేసులు - తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వైరస్

Corona Cases: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ లో ఓ 14 నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా, ఏపీలోనూ కొత్తగా 3 కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.

Corona Cases in Telugu States: కనుమరుగైందనుకున్న కరోనా మళ్లీ పంజా విసురుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు వెలుగుచూస్తుండడంతో ఆందోళన నెలకొంది. నిన్నటి వరకూ కరోనా కేసులే లేని ఏపీలోనూ తాజాగా 3 కేసులు వెలుగుచూశాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కొవిడ్ కేసు నమోదైంది. 85 ఏళ్ల వృద్ధురాలికి కొవిడ్ సోకినట్లు సమాచారం. అప్రమత్తమైన వైద్యాధికారులు శాంపిల్ ను జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్ కు పంపించారు. ఏలూరులోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ వైద్యునికి సైతం కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వేరియంట్ నిర్ధారణ కోసం శ్వాబ్ ను హైదరాబాద్ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కు పంపారు. అయితే, ఆందోళన చెందాల్సిన పని లేదని పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని డీఎం అండ్ హెచ్ఓ తెలిపారు. పాజిటివ్ వ్యక్తి వేరే ఇతర రాష్ట్రాలకు ఎక్కడా ప్రయాణం చేయలేదని స్పష్టం చేశారు. 

తెలంగాణలోనూ కొత్తగా 6 కేసులు

తెలంగాణలోనూ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా న్యూ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేసులు నమోదు ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 6 కేసులు నమోదు కాగా, హైదరాబాద్ లో 4, మెదక్ లో 1, రంగారెడ్డిలో ఒక కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకూ 20 కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ లోనే 16 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒకరు రికవరీ అయ్యారు. ఇప్పటివరకూ 925 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

14 నెలల చిన్నారికి

హైదరాబాద్ లోని నిలోఫర్ ఆస్పత్రిలో తొలి కొవిడ్ కేసు నమోదైంది. నాలుగైదు రోజుల క్రితం నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 14 నెలల చిన్నారికి తీవ్ర జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతరం అనుమానంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం చిన్నారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య మెరుగైందని, వెంటిలేటర్ తొలగించి ఆక్సిజన్ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వైద్యాధికారి శ్రీనివాస్ కల్యాణి తెలిపారు. కొవిడ్ కొత్త వేరియంట్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

అప్రమత్తమైన సిబ్బంది

కరోనా కేసుల నేపథ్యంలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఎంజీఎం సిబ్బంది మాస్క్ లేనిదే ఆస్పత్రిలోకి అనుమతించడం లేదు. కొవిడ్ బాధితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. అటు, గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు 50 పడకలు సిద్ధం చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్, మాస్కులు, శానిటైజేషన్, డిస్పోజబుల్ బెడ్ షీట్స్ రెడీగా ఉంచినట్లు చెప్పారు. చెస్ట్ ఆస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డు అందుబాటులో ఉంచారు. ఆ పడకలకు ఆక్సిజన్ సదుపాయంతో పాటు మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్ వెల్లడించారు. 

ఏపీలోనూ

కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1పై కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఏపీలోనూ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కొత్తగా 3 కేసులు వెలుగుచూడడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు (Krishnababu) అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో ఉన్న విలేజ్ క్లినిక్స్ అన్నింటికీ యాంటీజెన్ టెస్ట్ కిట్స్ ఇప్పటికే అందజేశామని, అక్కడ ఏదైనా పాజిటివ్ నిర్ధారణ అయితే, దానిని ఆర్టీపీసీఆర్ టెస్టుకు పంపేందుకు వీలుగా రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలల్లో పరీక్షలకు అవసరమైన సౌకర్యాలు సిద్ధంగా ఉంచామన్నారు. అక్కడ కూడా పాజిటివ్ అని తేలితే విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపి వేరియంట్ ను గుర్తించి వైరస్ వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Also Read: Telangana News: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? - ప్రయాణికులకు గుడ్ న్యూస్, 20 ప్రత్యేక రైళ్ల ప్రకటన

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీలో మారిన రాజకీయం.. స్థానిక ఎన్నికల్లో పొత్తుపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో మారిన రాజకీయం.. స్థానిక ఎన్నికల్లో పొత్తుపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Hitman Records Alert: రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!
రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget