అన్వేషించండి

2024 Polls India: సినిమాలపై అనవసరపు రాద్ధాంతం చేయకండి, మైనార్టీలకు దగ్గరవండి - కార్యకర్తలకు ప్రధాని సూచన

2024 Polls India: 2024 ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది.

2024 Elections India:

ముస్లింలకు దగ్గరవ్వాలి: ప్రధాని 

2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది బీజేపీ. స్వయంగా ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్‌షా రంగంలోకి దిగి రాష్ట్రాల వారీగా పార్టీ బలాన్ని సమీక్షించుకుంటున్నారు. తరచూ సమావేశమవుతున్నారు. కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు పిలుపు నిస్తున్నారు. అయితే...బీజేపీ అగ్రవర్ణాల పార్టీ అన్న ముద్రను చెరిపేసుకోడానికి అధిష్ఠానం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా మైనార్టీల వ్యతిరేక పార్టీ అనే అపవాదు తొలగించుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే...ముస్లింలతో సహా అన్ని మైనార్టీలకు దగ్గరయ్యే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ మేరకు కార్యకర్తలకు కీలక ఆదేశాలిచ్చారు. అందరూ మైనార్టీలతో సంప్రదింపులు జరిపి వాళ్ల కష్టనష్టాలేంటో తెలుసుకోవాలని చెప్పారు. బీజేపీకి ఓటు వేస్తారా లేదా అన్నది పక్కన పెట్టి ఈ పని చేయాలని సూచించారు. ఇటీవలే ఢిల్లీలో జాతీయ స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధాని మోడీ బీజేపీ ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉందో...ఆ ప్రాంతాలపై దృష్టి సారించాలని నేతలకు సూచించారు. "పస్మండ ముస్లింలు, బోహ్రా తెగకు చెందిన వాళ్లతో పాటు కీలక ముస్లిం నేతలతో చర్చించాలని ప్రధాని మాకు చెప్పారు" అని ఓ కార్యకర్త వెల్లడించారు. యూనివర్సిటీలు, చర్చ్‌లకు వెళ్లాలని ప్రధాని సూచించినట్టు తెలుస్తోంది.

ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్‌లో భాగంగా అన్ని రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని, సంస్కృతి, భాషలకు గౌరవం ఇవ్వాలని అన్నారు. 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలని చెప్పినట్టు కార్యకర్తలు వెల్లడించారు. దేశంలో పార్టీని మరింత విస్తృతం చేసి అన్ని విషయాల్లోనూ లీడర్‌గా నిలవాలని ప్రధాని ఆకాంక్షించారు. సినిమాలపై అనవసరపు వివాదాలు చేయొద్దనీ సూచించినట్టు సమాచారం. పఠాన్‌ మూవీలోని ఓ పాటపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో..మోడీ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 

ఎన్నికలకు రెడీ..

ఇప్పటికే అన్ని పార్టీలు తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో బిజీగా ఉంది. ఇటు బీజేపీ కూడా తమ విజయ పరంపరను కొనసాగించేందుకు గట్టిగానే కృషి చేస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి పార్టీలో మరింత జోష్ పెంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఎడమొఖం పెడమొఖంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు కూడా మళ్లీ కలుస్తున్నాయి. ఎలాగైనా బీజేపీని ఢీకొట్టి తమ బలం నిరూపించుకోవాలని చూస్తున్నాయి. ప్రధానిరేసులో ఉన్నారన్న నితీష్ కుమార్ కూడా మిషన్ 2024కి రెడీ అవుతున్నారు. పలుమార్లు ఢిల్లీలో పర్యటించారు. జాతీయస్థాయి నేతల మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ TRSని BRSగా మార్చేశారు. ప్రాంతీయపార్టీగా పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని ఆయన సిద్ధమయ్యారు.  యాక్షన్ ప్లాన్‌ కూడా అమలు చేస్తున్నారు. 

Also Read: JP Nadda News:బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం పొడిగింపు

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
Embed widget