అన్వేషించండి

World Tuberculosis Day: టీబీ ప్రాణాంతకం కావచ్చు! వ్యాధి నిర్ధారణ, ట్రీట్మెంట్ వివరాలివీ - నేడు ప్రపంచ టీబీ దినం

Tuberculosis Day: టీబీ అన్నది గాలి ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి సోకుతుంది. టీబీ పేషెంట్స్ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ట్యూబర్ క్యూలోసిస్ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది.

టీబీని తెలుగులో క్షయ వ్యాధిగా పిలుస్తారు. ఇది మైకోబ్యాక్టీరియం ట్యూబర్ క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా తో వస్తుంది. ఇది ప్రధానంగా ఉపిరితిత్తులను ప్రభావితం చేయడమే కాకుండా, ఒక్కోసారి మూత్రపిండాలు, వెన్నముక, మెదడు, గర్భాశయం వంటి కీలక అవయవాలను సైతం ప్రభావితం చేయవచ్చు. ఈ నెల 24 న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం (World Tuberculosis Day) సందర్భంగా దీనిపై అవగాహన కోసం ఈ కథనం. 

రెండేళ్లుగా ప్రపంచ దృష్టి మొత్తం కరోనా వైరస్‌ పై కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ శతాబ్దపు అత్యంత ప్రాణాంతక మహమ్మారి. కరోనా రాకతో.. దాని వల్ల సంభవించిన మరణాలు.. టీబీ వ్యాధిని వెనక్కి నెట్టాయి. కరోనాకు ముందు టీబీ వల్లే ఎక్కువ మంది చనిపోయే వారు. కరోనా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలియక భారీ ప్రాణ నష్టం జరిగింది. దీంతో టీబీ వ్యాధి కరోనా తర్వాత సెకండ్ ప్లేస్‌కు చేరింది. అటు క్షయవ్యాధి ప్రభావం ఎక్కువున్న ప్రాంతాల్లో ఉన్న వనరులను కరోనా చికిత్సకు వాడడంతో టీబీని నియంత్రించడం మరింత కష్టంగా మారింది. 2030 నాటికి టీబీపై విజయం సాధించాలని కలలు గన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా రాకతో ఆ లక్ష్యం చాలా సంవత్సరాలు వెనక్కి నెట్టివేసినట్టైంది.  

World Tuberculosis Day: టీబీ ప్రాణాంతకం కావచ్చు! వ్యాధి నిర్ధారణ, ట్రీట్మెంట్ వివరాలివీ - నేడు ప్రపంచ టీబీ దినం

ఎలా వ్యాపిస్తుందంటే:
టీబీ అన్నది గాలి ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి సోకుతుంది. టీబీ పేషెంట్స్ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ట్యూబర్ క్యూలోసిస్ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఇలా ఇది కుటుంబ సభ్యులకు, తోటివారికి, తమ సమీపంలోని వారికి, పరిసరాలలోని వారికి వస్తుంది. ఈ వ్యాధి ఇప్పటికీ మహమ్మారిలా ప్రపంచాన్ని వేధిస్తోంది. టీబీ కేసులు మనదేశంలో భారీగా ఉన్నాయి. అత్యధిక జనసాంద్రత కలిగి ఉండడం వల్ల దేశంలో టీబీ సంక్రమణ పెరుగుతోంది. దీంతో వ్యాధి నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో వ్యాధి నియంత్రణ కష్టంగా మారుతోంది. పరీక్షల సామర్థ్యాన్ని పెంచడం, యాక్టివ్ స్క్రీనింగ్, టీబీ హాట్‌స్పాట్‌ ప్రాంతాలను సులువుగా గుర్తించడం కోసం వ్యూహాలను అమలు చేయడం, చికిత్స కోసం ఔషధ సరఫరాలను పెంచడం, జనాభాను నియంత్రించడం వంటి చర్యలు పటిష్టంగా చేపడితేనే వ్యాధిని నియంత్రించవచ్చు. భారతదేశంలో టీబీ యుక్త వయసు వారినే ప్రభావితం చేస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన యువకుల్లో వ్యాధి సంక్రమణ ఎక్కువగా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 

వ్యాధి లక్షణాలు:
విపరీతమైన దగ్గుతో పాటు జ్వరం రావడం, ఛాతీలో నొప్పి, తలనొప్పి, నీరసం, అలసట, ఆకలి, బరువు తగ్గడం, ప్రధానంగా సాయంత్రం అవ్వగానే చలేస్తుండడం, రాత్రి వేళలో చెమటలు పట్టడం, ఛాతీలో నీరు చేరడం వల్ల దమ్ము కూడా రావడం వంటి లక్షణాలు టీబీ వ్యాధికి చెందినవే. టీబీ సోకిన వెంటనే వ్యాధి లక్షణాలు బయటపడకపోవచ్చు.రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్న వారిలో సూక్ష్మక్రిమి సోకిన కొద్ది రోజుల్లోనే లక్షణాలు బయటికి కనిపించవచ్చు. మరికొందరిలో ఏళ్ల తరబడి బాక్టీరియా ఉండిపోయి, ఎలాంటి లక్షణాలు బయటికి కనిపించకపోవచ్చు. కానీ, వ్యాధి సోకిన 2 నుంచి 5 సంవత్సరాలలోపు వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయి.

వ్యాధి నిర్ధారణ:
అత్యాధునిక రోగనిర్ధారణ విధానాలు, చికిత్స అందుబాటులోకి వచ్చినా, టీబీ ఇప్పటికీ మానవాళికి వణుకు పుట్టిస్తోంది. రోగ నిర్ధారణ కోసం తెమడ పరీక్ష, ఛాతి ఎక్స్-రే, ల్యాటెంట్ టీబీ విషయంలో కొన్నిసార్లు చర్మం పరీక్ష, దేహంలో టీబీ సూక్ష్మక్రిమిని నిర్ధారణ చేసే నిరాలాజికల్ పరీక్షలు, సూక్ష్మజీవుల పెరుగుదలను తెలిపే కల్చరల్ పరీక్షలతో పాటు మరి ఖచ్చితమైన నిర్ధారణ కోసం బ్రోంకోస్కోపీ, థొరాకోస్కోపీ మరియు సిటీ గైడెడ్ బయాప్సీ అనే పరీక్షలు చేస్తారు. 

2015 నుంచి దేశంలో టీబీ రోగుల మరణాల సంఖ్య పెరుగుతోంది. 2020లో మిలియన్ల మంది క్షయ వ్యాధితో మరణించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఆరోగ్య సేవలకు కరోనా అంతరాయాలు.. వ్యాధి నిర్ధారణ, చికిత్సపై ప్రభావం చూపాయి. మెడిసిన్, కౌన్సెలింగ్, ఫాలో-అప్ వంటి అంశాలు చికిత్స పై ప్రభావం చూపాయి. దీంతో మల్టీ డ్రగ్-రెసిస్టెంట్ జాతుల అభివృద్ధిని ప్రోత్సహించి.. చికిత్స వైఫల్యం రేట్లు, బాధలు మరియు మరణాలను పెంచుతోంది టీబీ వ్యాధి. దీంతో రాబోయే కాలంలో.. టీబీ వ్యాధి అనేక సవాళ్లను కలిగిస్తుంది. వ్యాధి భారం అధికంగా ఉన్న మన లాంటి దేశాలలో అక్కడి బలహీనమైన వైద్య వ్యవస్థలు వ్యాధిని నియంత్రించలేకపోతున్నాయి.

వీరికి రిస్క్ ఎక్కువ:
హెచ్‌ఐవీ పేషెంట్లు, డయాబెటిస్ మెల్లిటస్, పోషకాహార లోపం ఉన్నవారిలో, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిలో, కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంట్ తర్వాత, కరోనా వైరస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులున్న రోగులు, క్యాన్సర్ కీమోథెరపీలో ఉన్న రోగులకు టీబీ ఎక్కువగా సోకుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  

చికిత్స:
టీబీ పూర్తిగా నయం కావడానికి క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం అవసరం. కొన్ని రోజులు మందులు వాడగానే లక్షణాలు తగ్గడంతో వాటిని ఆపేస్తుంటారు. వారిలో మందులకు లొంగని డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వస్తుంది. ఇలాంటి వారికి  ముందు ఇచ్చిన మందులకు బదులుగా ఇంకా ప్రభావంతమైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని కనీసం 6 నెలల పాటు వాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో 18-24 నెలల పాటు కూడా చికిత్సను పొడిగించాల్సి రావచ్చు. ఇవి ఒకింత ప్రమాదకరమైనవి కావడంతో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు మొదటిసారే పూర్తిగా తగ్గేలా జాగ్రత్త పడటం మంచిది.   

జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (NTEP) భారతదేశంలో టీబీ నిర్మూలనకు సంబంధించిన ప్రధాన ప్రభుత్వ సంస్థ. టీబీ నిర్మూలన కోసం జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక (NSP) 2017–2025 వ్యాధిపై వ్యూహాత్మకంగా సమరం సాగిస్తోంది. "డిటెక్ట్ - ట్రీట్ - ప్రివెంట్ - బిల్డ్" వంటి వ్యూహాలతో ముందుకు వెళ్తోంది జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక (NSP). కరోనా రాకతో టీబీ వ్యూహాలు మరుగున పడగా.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గినందున దేశంలో టీబీపై అవగాహన కల్పించే కార్యక్రమాలు పెట్టడం.. "దేశాన్ని టీబీ రహితంగా మార్చేందుకు ఇది సరైన సమయం. రండి.. అందరం కలిసి టీబీని అరికడదాం".

డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి.పి
MBBS,MD,FCCP,(IDCC)
కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ & స్లీప్ మెడిసిన్
రెనోవా హాస్పిటల్స్, సనత్‌నగర్, హైదరాబాద్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TS Inter Results: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chennai Super Kings vs Lucknow Super Giants Highlights | స్టోయినిస్ సూపర్ సెంచరీ..లక్నో ఘన విజయంCM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TS Inter Results: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Embed widget