అన్వేషించండి

Kohinoor Diamond: మన కోహినూర్ వజ్రాన్ని ఇండియాకు ఎందుకు తిరిగి తీసుకురాలేకపోతున్నాం? కారణాలేమిటీ?

ప్రపంచ మేటి వజ్రం కోహినూర్. భారతదేశానికి చెందిన ఈ డైమండ్ ప్రస్తుతం బ్రిటీష్ మ్యూజియంలో కొలువుదీరింది. ఈ డైమండ్ కోసం భారత ప్రభుత్వం చాలాసార్లు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎందుకు?

ప్రపంచంలో ఎన్ని వజ్రాలు ఉన్నా.. కోహినూర్ డైమండ్ కు ఉన్న విశిష్టత వేరు. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా గుర్తింపు పొందింది. ఈ వజ్రం తెలుగు నేల మీదే కనుగొనబడినా.. ప్రస్తుతం ఇంగ్లాండ్ మ్యూజియంలో కొలువుదీరింది. ఈ వజ్రాన్ని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం ఎన్నిసార్లు బ్రిటన్ ను కోరినా సానుకూల స్పందన రాలేదు. నిజానికి ఈ వజ్రం తొలి రోజుల్లో 793 క్యారెట్లు ఉండగా ప్రస్తుతం 105.6 క్యారెట్లకు తగ్గిపోయిందట.  

తెలుగు నేలతో కోహినూర్ కు సంబంధం

కోహినూర్ వజ్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ వజ్రాన్ని సుమారు 5 వేల ఏళ్ల క్రితం తెలుగు నేల మీదే గుర్తించారని చెప్తుంటారు. 1813 సంవత్సరంలో కోహినూర్ వజ్రం సిక్కు రాజు మహారాజా రంజిత్ సింగ్ దగ్గరికి చేరిందట. ఆయన దాన్ని తన కిరీటంలో ధరించారట. 1839లో ఆయన మరణం తర్వాత.. కుమారుడు దిలీప్ సింగ్ దగ్గరికి ఆ వజ్రం వెళ్లింది. 1849లో బ్రిటన్ సేనలు అతడిని ఓడించాయట. ఆ సమయంలో అతడు ఆ వజ్రాన్ని ఇంగ్లాండ్ రాణికి అప్పగించారట. అప్పటి  నుంచి కోహినూర్ డైమండ్ బ్రిటన్ లోనే ఉంటోంది. వాస్తవానికి ఈ వజ్రం ఒకరి ఒకరు కానుకగా ఇవ్వడం తప్ప.. అమ్మడమో.. బలవంతంగా లాక్కోవడమో జరగలేదు. ఎవరూ కొనుగోలు చేయలేదు కూడా. ఈ నేపథ్యంలో కోహినూర్ వజ్రానికి శాశ్వత యజమానులు ఎవరూ లేరు.   

భారత చట్టాలు ఏం చెబుతున్నాయ్?
Kohinoor Diamond: మన కోహినూర్ వజ్రాన్ని ఇండియాకు ఎందుకు తిరిగి తీసుకురాలేకపోతున్నాం? కారణాలేమిటీ?

ఈ వజ్రం కోసం భారత ప్రభుత్వం కొన్ని సార్లు బ్రిటన్ ప్రభుత్వాన్ని  సంప్రదించినా.. పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇదే అంశానికి సంబంధించి భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఓసారి విచారణ జరిపింది. ఈ విచారణలో కోహినూర్ వజ్రం తిరిగి తీసుకురావడం కష్టమని తేలింది. యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజర్ యాక్ట్, 1972లోని నిబంధనల ప్రకారం దేశం నుంచి అక్రమంగా ఎగుమతి చేయబడిన పురాతన వస్తువులను మాత్రమే తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్ కు తెప్పించే అవకాశం లేదని రుజువైంది. భారత ప్రభుత్వం సైతం  పురాతన కోహినూర్ వజ్రాన్ని తమకు ఇచ్చేయాలని యునైటెడ్ కింగ్‌డమ్‌ను బలవంతం చేయలేమని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎందుకంటే ఈ వజ్రం దొంగిలించబడలేదు. బ్రిటీష్ వారికి బహుమతిగా ఇవ్వబడింది.   

కోహినూర్ వజ్రంతో పాటు అనేక ఇతర అరుదైన వస్తువులను, సంపదలను తిరిగి ఇచ్చేలా బ్రిటన్ హైకమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ఫ్రంట్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించిన సుప్రీం కోర్టు విచారించింది. కోహినూర్‌ ను తిరిగి దేశానికి అప్పగించాలని దాఖలైన పిల్‌ పై తన వైఖరిని స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు నాటి చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ధర్మాసం ప్రభుత్వాన్ని కోరింది. అయితే, ఇది సాధ్యం అయ్యే విషయం కాదని ప్రభుత్వం వెల్లడించింది.

కోహినూర్ ను ఇస్తే బ్రిటీష్ మ్యూజియం ఖాళీ అవుతుంది
Kohinoor Diamond: మన కోహినూర్ వజ్రాన్ని ఇండియాకు ఎందుకు తిరిగి తీసుకురాలేకపోతున్నాం? కారణాలేమిటీ?

అటు ఇంగ్లాండ్ రాణుల కిరీటంలో పలుమార్లు క్రౌన్ జ్వెల్ రూపంలో స్థానాన్ని సంపాదించుకున్న కోహినూర్ డైమండ్.. ఆ తర్వాత బ్రిటన్ మ్యూజియానికి తరలించబడింది. పలుమార్లు ఈ వజ్రాన్ని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం ఇంగ్లాండు ప్రభుత్వాన్ని కోరింది. 2010 లో యూకే ప్రధాని డేవిడ్ కెమరాన్ ఈ విషయంపై స్పందించారు. ఒకవేళ భారత్‌‌కు కోహినూర్ తిరిగి ఇవ్వాల్సి వస్తే, చాలా దేశాలకు చాలా తిరిగివ్వాల్సి ఉంటుందన్నారు. అప్పుడు బ్రిటీష్ మ్యూజియం మొత్తం ఖాళీ అయిపోతుందని చమత్కరించారు. ఇదండి కోహినూరు వెనుక ఉన్న కథ. అందుకే, మనం దాన్ని వెనక్కి తెచ్చుకోలేకపోతున్నాం. 

Also Read: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 ఆరోగ్య రహస్యం ఇదే, మీరూ ప్రయత్నించండి

Also Read: గుండెను కాపాడుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? ఈ పంచ సూత్రాలను తప్పక పాటించాలి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget