అన్వేషించండి

Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన జగన్ - సత్తెనపల్లి ఇంచార్జ్‌గా తొలగింపు - కొత్త నేతకు చాన్స్

YSRCP: అంబటి రాంబాబును సత్తెనపల్లి ఇంచార్జ్ పదవి నుంచి జగన్ తొలగించారు. నర్సరావుపేటకు చెందిన సుధీర్ భార్గవరెడ్డి అనే నేతను నియమించారు.

Jagan removed Ambati Rambabu from the post of Sattenapalli in charge: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఇంచార్జుల మార్పును జగన్ వేగంగా చేపడుతున్నారు. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి గజ్జల సుధీర్ భార్గవరెడ్డి అనే లీడర్ ను ఇంచార్జ్ గా ప్రకటించారు. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకూ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇంచార్జ్ గా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేశారు. ఓ సారి గెలిచారు. మరోసారి ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఇంచార్జ్ ను మార్చాలని జగన్ నిర్ణయించారు. 

సత్తెనపల్లి ఇంచార్జ్‌గా సుధీర్ భార్గవరెడ్డిని నియమించిన జగన్         

అంబటి రాంబాబు స్థానికేతర నేత. ఆయన రేపల్లెకు చెందిన నేత. అక్కడి నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వైఎస్ హయాంలో టిక్కెట్ దక్కలేదు కానీ.. నామినేటెడ్ పోస్టులు దక్కాయి. అయితే జగన్ వైసీపీ ప్రారంభించిన తరవాత ఆయన వెంట నడిచారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇంచార్జ్ గా నియమించారు. 2014లో సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019లో కోడెలపై భారీ తేడాతో విజయం సాధించారు. తర్వాత కోడెల ఆత్మహత్య చేసుకోవడంతో టీడీపీ తరపున గత ఎన్నికల్లో సీనియర్ నేత కన్నా లక్ష్మినారాయణ పోటీ చేసి గెలిచారు. 

అంబటి రాంబాబు ప్రత్యక్ష ఎన్నికల పోటీకి దూరం ?           

సామాజిక సమీకరణాలు, అంబటి రాంబాబుపై క్యాడర్ కు ఉన్న వ్యతిరేకత కారణంగా ఆయనను మార్చాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఇక్కడి నుంచి ఇంచార్జ్ గా పని చేసేందుకు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రయత్నించారు. కానీ జగన్ కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని అనుకోవడంతో నర్సరావుపేటకు చెందిన గజ్జల సుధీర్ భార్గవరెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆయన అర్థికంగా స్థితిమంతుడు కావడంతోపాటు సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఓ గ్రామం నుంచి వెళ్లి నర్సరావుపేటలో స్థిరపడ్డారు.దీంతో ఆయన సత్తెనపల్లికి లోకల్ అవుతారని భావించి చాన్స్ ఇచ్చారు.         

Also Read: అతుల్ సుభాష్‌లా ఆత్మహత్య చేసుకుంటేనే స్పందిస్తారా ? తన సోదరుడి దుస్థితిపై తెలుగు యువతి ఆవేదన - ఈ ప్రశ్నకు బదులేది?

యువనేతలకు అవకాశాలు ఇవ్వాలనుకుంటున్న జగన్           

కేసులు పెడుతున్న టీడీపీకి భయపడకుండా పని చేయాలంటే కొత్త యువనేతలకు చాన్సివ్వాలని జగన్ అనుకుంటున్నారు. అందులో భాగంగానే అంబటి రాంబాబును తప్ిపంచి సుధీర్ రెడ్డికి చాన్సిచ్చారు. అంబటి రాంబాబు ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయనను గుంటూరు జిల్లా  వైసీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఏ నియోజకవర్గానికీ ఇంచార్జ్ పదవి ఇవ్వలేదు. ఆయన సోదరుడు మురళీ మాత్రం పొన్నూరు నియోజకవర్గ ఇంచార్జ్ గా ఉన్నారు.  

Also Read: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget